అన్వేషించండి

IMD Temperature Alert: ఈ ఏడాది సైతం రికార్డు ఉష్ణోగ్రతలు, భానుడి ప్రతాపానికి మార్చి నుంచే వడగాల్పులు: ఐఎండీ

Weather Updates Today | ఇది చలికాలమా లేక వేసవికాలమా అన్నట్లుగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని భారత వాతావరణ సంస్థ తెలిపింది.

IMD Temperature Alert | అమరావతి: గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఎండలతో ఉక్కపోత పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జనవరి చివరి వారం నుంచే మార్చి నెలాఖరులో ఉండే ఎండలను చూసి అప్పుడే వేసవి కాలం వచ్చేసిందా అంటూ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఫిబ్రవరి తొలి వారంలోనూ అధిక ఉష్ణోగ్రతలు చూసి.. ఇప్పుడే ఇలా ఉండే వేసవిలో తమ పరిస్థితి ఏంటని రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మార్చి నెల నుంచి వడగాల్పులు మొదలయ్యే అవకాశం ఉంది.

అటు తెలంగాణలోనూ కొన్ని రోజులుగా ఎండ తీవ్రత అధికంగా ఉంది. హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు అప్పుడే 34 డిగ్రీల మేర నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ లో 37 డిగ్రీలు, భద్రాచలంలో 36.8, ఖమ్మం, మహబూబ్ నగర్ లలో 36.4 డిగ్రీలు, నిజామాబాద్ లో 36 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలికాలంలోనూ ఎండ తీవ్రతకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉష్ణోగ్రత సగటున ఒక డిగ్రీ మేర పెరిగితే మరణాలు 0.2 శాతం నుంచి 5.5 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
అత్యంత వేడి సంవత్సరంగా 2024
భూతాపం కారణంగా గత దశాబ్దం, 15 ఏళ్లలో పలుమార్లు ఎండలు రికార్డు సృష్టించాయి. 2010 నుంచి 2024 మధ్యకాలంలో అత్యంత వేడి సంవత్సరాలుగా పదేళ్లు రికార్డు నెలకొల్పాయంటే ఎండల తీవ్రత ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. అత్యంత వేడి దశాబ్దంగా 2015- 2024  నిలిచింది. అత్యంత వేడి సంవత్సరంగా 2024 రికార్డు సృష్టించిందని తెలిసిందే. ఈ ఏడాది సైతం భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ సంస్థ తెలపడంతో ప్రజలు టెన్షన్ పడుతున్నారు. మరోవైపు శీతాకాలంలో చలి తీవ్రత తగ్గిపోయి,  అసాధారణ వేడి ఉంటుందని వాతావరణశాఖ చెబుతోంది. రానున్న రోజుల్లో వేడిని తట్టుకోలేని పరిస్థితి నెలకొంటుందని, కనుక ప్రజలకు చెట్ల పెంపకాన్ని సూచిస్తోంది. 
ఏపీ సహా పలు రాష్ట్రాల్లో భారీ ఉష్ణోగ్రతలు
కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలలో అసాధారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరించారు. చిరు జల్లులు కురిసే అవకాశం ఉండటంతో ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అసలే ఢిల్లీలో నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలు పెద్ద ఎత్తున ఇళ్ల నుంచి బయటకు రానున్నారు. బాపట్ల, నందిగామ, కావలి, కర్నూలులో మంగళవారం భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీటితో పాటు కాకినాడ, మచిలీపట్నం, తుని, నరసాపురం తదితర ప్రాంతాల్లో నిన్న ఒకేరోజు ఏకంగా 3 నుంచి 6 డిగ్రీలు మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం కలవరపెడుతోంది. అసలే ఏపీలో పలు జిల్లాలకు తీర ప్రాంతం ఉండటంతో ఎండ వేడి కంటే, హ్యుమిడిటీ సమస్య అధికంగా ఉంటుందని తెలిసిందే. కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోనూ ఫిబ్రవరి రెండో వారంలో 2 నుంచి 4 డిగ్రీలు మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఆ ప్రాంత ప్రజలను ఐఎండీ అలర్ట్ చేసింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
Mana Shankara Vara Prasad Garu Trailer: ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
Soldier Suicide: కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? అయితే ఈ 3 వాస్తు చిట్కాలను పాటిస్తే అంతా ప్రేమమయం అయిపోతుంది!
తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? అయితే ఈ 3 వాస్తు చిట్కాలను పాటిస్తే అంతా ప్రేమమయం అయిపోతుంది!
Embed widget