అన్వేషించండి

Vizag Port Stadium: లీజుకు విశాఖ పోర్ట్ స్టేడియం- నగరవాసుల్లో అనేక అనుమానాలు

పోర్ట్‌ స్టేడియాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే సామాన్యులకు దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విశాఖ ప్రజలు. దానితో వారు స్టేడియం కాంప్లెక్స్‌ పోర్ట్  యాజమాన్యం చేతిలోనే ఉంచుకోవాలని కోరుతున్నారు.

విశాఖ పోర్ట్ యాజమాన్యం తన అధీనంలోని స్టేడియాలను లీజుకు ప్రైవేటు వాళ్ళకి ఇవ్వనుంది. కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రకారం తాము కూడా స్థిరాస్తుల ద్వారానే ఆదాయం ఆర్జించాలని భావిస్తుంది. ఇప్పటికే పోర్ట్ ఆసుపత్రి వెనుక ఉన్న 17 ఎకరాలను రహేజా గ్రూప్‌నకు కేటాయించింది పోర్ట్ యాజమాన్యం. దీనివల్ల పోర్టుకు 125 కోట్ల వరకూ లభించినట్టు సమాచారం. ఈ లీజు 30 ఏళ్లపాటు కొనసాగనుంది. 

 లీజుకు ఇస్తే ఎలాంటి ఫలితం వస్తుందో గ్రహించిన పోర్టు యాజమాన్యం మరో అడుగు ముందుకేసింది. ఇలా లీజుకు ఇచ్చే వాటిలో తమ ఆధీనంలో ఉన్న స్టేడియంను కూడా రెంట్‌కు ఇవ్వాలని ఆలోచిస్తోంది. అక్కయ్య పాలెంలోని పోర్ట్ స్టేడియాన్ని కూడా లీజుకి ఇస్తామంటుంది. ఈ స్టేడియానికి పెద్ద హిస్టరీనే ఉంది. సరిగ్గా విశాఖ సిటీ నడిబొడ్డున ... నేషనల్ హైవేని ఆనుకొని .. ప్రజలకూ .. మార్నింగ్ వాకర్స్‌కూ అందుబాటులో ఉంది. ఈ స్టేడియం కాంప్లెక్స్‌ లో ఇండోర్ స్టేడియం, అవుట్ డోర్ స్టేడియాలతోపాటు ఒక ఆడిటోరియం కూడా ఉంది. వీటిని కలిపిగానీ .. విడివిడిగా గానీ లీజుకు ఇస్తామని చెబుతున్నారు అధికారులు. 

పోర్ట్‌ స్టేడియాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతికి లీజుకు ఇస్తే సామాన్యులకు దూరం అవుతుందని.. టికెట్ రేట్లను పెంచేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విశాఖ నగర ప్రజలు. దానితో వారు స్టేడియం కాంప్లెక్స్ ను పోర్ట్ యాజమాన్యం చేతిలోనే ఉంచుకోవాలని కోరుతున్నారు. 

నిర్వహణ వ్యయం తగ్గించడానికే

ఈ విషయంలో పోర్ట్ యాజమాన్యం వెర్షన్ మరోలా ఉంది. ఎవరు నిర్వహించినా పోర్ట్ స్టేడియంలోని సౌకర్యాలు ఎప్పటిలానే ప్రజలకు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు అధికారులు. స్టేడియం కాంప్లెక్స్‌ను ఒక్కరికే లీజుకు ఇచ్చినా .. విడివిడిగా ఇచ్చినా వాటిని ప్రైవేటు వారు నిర్వహించుకుని పోర్టుకు కొంత ఆదాయాన్ని ఇవ్వాల్సి ఉంటుందంటున్నారు. దీని వల్ల నిర్వహణ వ్యయం తప్పడంతోపాటు పోర్ట్‌కు అదనపు ఆదాయం కూడా దక్కుతుంది అని పోర్ట్ ప్రతినిధులు చెబుతున్నారు. అలాగే పోర్ట్‌కు అవసరమైనప్పుడు స్టేడియాన్ని వాడుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. 

పోర్ట్ ఉద్యోగులకు డిస్కౌంట్‌పై ఆడిటోరియాన్ని వాడుకునే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు అధికారులు. పోర్ట్ స్టేడియంలో ప్రధానంగా కనిపించేది మార్నింగ్ వాకర్స్. వారికి కూడా ఈ లీజు వల్ల ఎలాంటి ఆటంకం ఉండదని.. ప్రస్తుతం కొనసాగుతున్న పద్దతిలానే ఐడెంటిటీ పాసులతో వాకింగ్ చేసుకోవచ్చని అంటున్నారు. ఇవన్నీ వినడానికి బానే ఉన్నా .. ఒకసారికి ప్రైవేటు వ్యక్తులకు స్టేడియాన్ని లీజుకు ఇచ్చాక ఆచరణలో సాధ్యమేనా అన్నది చూడాలి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
Kailasagir iTrishul: కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
Jana Sena leader allegations: పోర్ట్ స్టేడియం లీజు వ్యవహారంలో భారీ కుంభకోణం - జనసేన తీవ్ర ఆరోపణలు
పోర్ట్ స్టేడియం లీజు వ్యవహారంలో భారీ కుంభకోణం - జనసేన తీవ్ర ఆరోపణలు
AP Matsyakara Bharosa 2026 : మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!
మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget