అన్వేషించండి

శాపనార్థాలు, తిట్ల దండకాలు- ప్రజల ముందు నోరు జారుతున్న సిక్కోలు నేతలు

ప్రత్యర్థులపై పైచేయి సాధించాలనుకుంటున్న నేతలు మాట తూలుతున్నారు. ప్రజలను ఆకట్టుకోవాలన్న ఉద్దేశంతో హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

బాదుడే బాదుడు ఒకవైపు... గడపగడపకు మన ప్రభుత్వం ఇంకోవైపు. ఈ రెండు కార్యక్రమాలతో అధికార, ప్రతిపక్షాలు ప్రజల్లో తమ పరపతిని పరీక్షించుకుంటూనే వచ్చే ఎన్నికలకు స్ట్రాంగ్‌ గ్రౌండ్‌ను ప్రిపేర్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో నేతలు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకొని హీట్ పెంచుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు చేస్తున్న కామెంట్స్  దుమారాన్ని రేపుతున్నాయి.  

ప్రజల వద్దకు వెళ్తున్న నేతల ప్రసంగాలు ఎన్నికల ఫీవర్‌ని తలపించేలా ఉంటున్నాయి. నేతల పని తీరుపై ఫీడ్‌ బ్యాక్ ఎప్పటికప్పుడు సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుతున్న వేళ వైసీపీ నేతలు దూకుడు పెంచారు. మాటల తూటాలు పేలుస్తున్నారు. హెచ్చరికలు, శాపనార్థాలతో చర్చనీయాంశంగా మారుతున్నారు. 

పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తుండడంతో ప్రజలు తమవెంటే ఉన్నారన్న ధీమాలో అధికార పార్టీ నేతలు ఉన్నారు. అయినా ప్రజలు ప్రతిపక్షాల ట్రాప్‌లో పడతారేమో అన్న అనుమానంతో కొందరి నేతల మాటల ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ప్రజలను రెచ్చగొట్టేలా కామెంట్స్ చేస్తున్నారు. 

పాపం తగులుతుంది

వజ్రపుకొత్తూరు మండలంలోని గరుడభద్రలో మంత్రి సీదిరి అప్పలరాజు మంగళవారం పర్యటించారు. ఈ గ్రామం మంత్రి సతీమణి శ్రీదేవి స్వగ్రామం. ఆ గ్రామ అల్లుడినని చూడకుండా టీడీపీకి మెజార్టీ ఇచ్చారని మంత్రి సీదిరి గుర్తు చేశారు. అయినా సరే గ్రామానికి భారీగా నిధులు ఇచ్చి అభివృద్ధి చేశానని చెప్పుకొచ్చారు. రానున్న ఎన్నికల్లో అధిక మెజార్టీ ఇవ్వాలని కోరారు. దీన్ని అందరూ స్వాగతించారు. 

అదే గ్రామంలో గడపగడపకూ తిరుగుతూ ఓ లబ్ధిదారుతో మాట్లాడారు మంత్రి సీదిరి. ఆమెకు వచ్చిన పథకాలను వివరించారు. మాటలో మాటగా ఈసారి వైఎస్‌ఆర్‌సీపీకి ఓటేయకపోతే పాపం తగులుతుందని మంత్రి అనేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. చనువుతో సీదిరి చేసిన ఈ కామెంట్స్‌ స్థానికంగా కూడా చర్చనీయాంశమయ్యాయి.

బాదుడే బాదుడంటే.. చితగ్గొట్టేయాలి

మాజీ మంత్రి, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో జగనన్న తోడు కార్యక్రమంలో భాగంగా బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పేదల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నారని... పనిచేసే వారికే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోని టీడీపీ ఇప్పుడు బాదుడే బాదుడని ప్రజల్లోకి వస్తుందన్నారు. అలా వస్తే చితగ్గొట్టేయాలని జనాలకు సూచించారు. ఈ మాటలకు సమావేశంలో ఉన్న కేడర్ ఆశ్చర్యపోయింది. 

టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గతంలో చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. అచ్చెన్నను నడిరోడ్డుపై కొడతానని హెచ్చరించారు. ఇప్పుడు కృష్ణదాస్ అలాంటి కామెంట్స్ చేశారు. ఇలా జిల్లా నేతలు ప్రజలను ఆకట్టుకోవాలని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడమే కాకుండా... ప్రత్యర్థులకు ప్రచార అస్త్రాలు అందినట్టు అవుతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Viral News:
"గుండెల నిండా దమ్ముతో ఎదురించాలి, జెండా ఎగరేయాలి" జనసేన ఆవిర్భావం రోజున ఓ బామ్మ కామెంట్స్ వైరల్‌!
Anakalapalle Latest News:
"మా ఫుడ్‌తో పిండివంటలు చేసుకుంటున్నార్‌ సార్" బీసీ హాస్టల్‌ దుస్థితిపై లోకేష్‌కు విద్యార్థుల ఫిర్యాదు! ప్రభుత్వం సీరియస్
Srikakulam Latest News: ఉద్దానానికి కొత్త ఊపిరి! పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో తొలి కిడ్నీ మార్పిడి విజయవంతం!
ఉద్దానానికి కొత్త ఊపిరి! పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో తొలి కిడ్నీ మార్పిడి విజయవంతం!

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget