అన్వేషించండి

Simhachalam: సింహాచలం స్వామివారి ఉంగరం పోయిందట, దొంగిలించారని మంత్రినే నిలదీసిన పూజారి - చివరికి ట్విస్ట్

Simhachalam Appanna Temple: మంత్రి తొలుత రాజగోపురం వద్దకు రాగానే పురోహితుడు ఆయన్ను తాడుతో బంధించి స్థానాచార్యుల ముందుకు తీసుకొచ్చారు. ఉంగరాన్ని ఎందుకు దొంగిలించారని నిలదీశారు.

Visakhapatnam: విశాఖపట్నం జిల్లా సింహాచలంలో శ్రీవరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణోత్సవాలు వైభవంగా జరిగాయి. అయితే, ఆదివారం అప్పన్న స్వామి ఉంగరపు సేవ వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి ఉంగరం పోయిందంటూ కంగారు పెట్టేశారు. అక్కడికి అదే సమయంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కూడా రావడంతో ఆయన్ను కూడా అర్చకులు ప్రశ్నించారు. స్థానాచార్యులు టీపీ రాజగోపాల్‌ మంత్రిని ప్రశ్నిస్తూ.. ‘‘రాష్ట్రానికి మంత్రిగా ఉండి మీరు ఉంగరం దొంగతం చేస్తే ఎలాగండీ.. దయచేసి ఉంగరం ఇచ్చేయండి’’ అంటూ రాష్ట్ర బీసీ వెల్ఫేర్, సమాచారశాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణను నిలదీశారు. 

మంత్రి తొలుత రాజగోపురం వద్దకు రాగానే పురోహితులు అలంకారి కరి సీతారామాచార్యులు.. మంత్రి చెల్లుబోయినను తాడుతో బంధించి స్థానాచార్యుల ముందుకు తీసుకొచ్చారు. దొంగలించిన ఉంగరం ఇచ్చేయాలంటూ స్థానాచార్యులు మంత్రిని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ కొంత సేపు ఆందోళనకర వాతావరణం నెలకొంది. తర్వాత మంత్రి మాట్లాడుతూ.. తనకు ఏ ఆపదా రాకూడదని ఆ స్వామి రక్ష (తాడు) వేశాడని, స్వామి అనుగ్రహం తనపైపై ఉందని భావిస్తున్నట్టు తెలిపారు. వినోదోత్సవంలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఉత్సవం అనంతరం మంత్రి స్వామివారి పల్లకీని మోశారు.

అసలు స్వామివారి ఉంగరం ఏమైంది?
ఈ నెల 11 నుంచి వారం రోజుల పాటు జరిగిన స్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి మృగయోత్సవం జరిగింది. దొంగిలించబడ్డ స్వామి ఉంగరాన్ని వెతికే ఘట్టాన్ని సింహగిరిపై ఆదివారం ఉదయం వినోదోత్సవంగా నిర్వహించారు. ఉంగరం పోయిందనే హడావుడి తర్వాత తీరిగ్గా అసలు విషయం బయటపెట్టారు అర్చకులు. ఉంగరం పోవడం అనేది స్వామివారి వసంతోత్సవాల్లో సరదాగా ఆడే నాటకమని చెప్పారు. ప్రతిఏటా సింహాచలం దేవస్థానంలో ఈ వేడుకను ఆనవాయితీగా నిర్వహిస్తారు. ఈ విషయం తెలియని భక్తులు బెదిరిపోయారు. పూజారులు అసలు సంగతి చెప్పడంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొనే అవకాశం దక్కిందంటూ సంబరపడ్డారు.

ఆగ్రహంతో ఊగిపోయిన భక్తులు, ఏడ్చిన మరికొందరు
స్వామివారి ఉంగరం పోయిందని అర్చకులు భక్తులను కూడా నిలదీయడంతో అసలు విషయం తెలియని భక్తులు విస్తుపోయారు. కొంత మంది పూజారులపై ఓ సందర్భంలో కోపంతో ఊగిపోయారు. ఇలాగే ఒకర్ని ఉంగరం దొంగ అనగానే ఆ భక్తుడు ఆగ్రహించారు. తాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని అని అలాంటి తననే ఇలా అనుమానిస్తారా అంటూ ఊగిపోయారు. అసలు విషయం తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Perni Nani Ration Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు 12 రోజులు రిమాండ్
Perni Nani Ration Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు 12 రోజులు రిమాండ్
Holidays List in 2025 : న్యూ ఇయర్ 2025లో 12 రోజులు లీవ్ పెడితే 50 రోజులు పండగే.. పబ్లిక్ హాలీడేలు, వీక్లీ ఆఫ్​లతో రచ్చ చేసేయండిలా
న్యూ ఇయర్ 2025లో 12 రోజులు లీవ్ పెడితే 50 రోజులు పండగే.. పబ్లిక్ హాలీడేలు, వీక్లీ ఆఫ్​లతో రచ్చ చేసేయండిలా
Gudivada Amarnath: సొంత నియోజకవర్గం లేని నేతగా గుడివాడ అమర్నాథ్! మాజీ మంత్రి వింత పరిస్థితి- భీమిలి పై కన్ను
సొంత నియోజకవర్గం లేని నేతగా గుడివాడ అమర్నాథ్! మాజీ మంత్రి వింత పరిస్థితి- భీమిలి పై కన్ను
Richest CM In India: దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు, చివరి స్థానంలో మమతా బెనర్జీ - ఆస్తులు, అప్పుల వివరాలిలా
దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు, చివరి స్థానంలో మమతా బెనర్జీ - ఆస్తులు, అప్పుల వివరాలిలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KA Paul Interview on Allu Arjun | అంబేడ్కర్ ని తిట్టినోళ్లు యూజ్ లెస్ ఫెలోస్ | ABP DesamDeputy CM Pawan kalyan on Allu Arjun | సంధ్యా థియేటర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ | ABP DesamISRO SpaDEX Docking Experiment | తొలిసారిగా డాకింగ్ ప్రయోగం చేస్తున్న ఇస్రో | ABP Desamఅమిత్ షాకి అదో ఫ్యాషన్, మాలల సత్తా చూపిస్తాం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Perni Nani Ration Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు 12 రోజులు రిమాండ్
Perni Nani Ration Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు 12 రోజులు రిమాండ్
Holidays List in 2025 : న్యూ ఇయర్ 2025లో 12 రోజులు లీవ్ పెడితే 50 రోజులు పండగే.. పబ్లిక్ హాలీడేలు, వీక్లీ ఆఫ్​లతో రచ్చ చేసేయండిలా
న్యూ ఇయర్ 2025లో 12 రోజులు లీవ్ పెడితే 50 రోజులు పండగే.. పబ్లిక్ హాలీడేలు, వీక్లీ ఆఫ్​లతో రచ్చ చేసేయండిలా
Gudivada Amarnath: సొంత నియోజకవర్గం లేని నేతగా గుడివాడ అమర్నాథ్! మాజీ మంత్రి వింత పరిస్థితి- భీమిలి పై కన్ను
సొంత నియోజకవర్గం లేని నేతగా గుడివాడ అమర్నాథ్! మాజీ మంత్రి వింత పరిస్థితి- భీమిలి పై కన్ను
Richest CM In India: దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు, చివరి స్థానంలో మమతా బెనర్జీ - ఆస్తులు, అప్పుల వివరాలిలా
దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు, చివరి స్థానంలో మమతా బెనర్జీ - ఆస్తులు, అప్పుల వివరాలిలా
New Year Gift Ideas: మ్యూచువల్ ఫండ్, షేర్లు లేదా గోల్డ్ బాండ్ - కొత్త సంవత్సరంలో ఏ బహుమతి ఇవ్వాలి?
మ్యూచువల్ ఫండ్, షేర్లు లేదా గోల్డ్ బాండ్ - కొత్త సంవత్సరంలో ఏ బహుమతి ఇవ్వాలి?
Hyderabad Traffic Restrictions : హైదరాబాద్‌లో న్యూ ఇయర్ 2025 సెలబ్రేషన్స్‌పై బిగ్ అలర్ట్- ఇవి తెలుసుకోకుంటే జైలుకెళ్లాల్సిందే
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ 2025 సెలబ్రేషన్స్‌పై బిగ్ అలర్ట్- ఇవి తెలుసుకోకుంటే జైలుకెళ్లాల్సిందే
Ind Vs Aus Test Series: సిడ్నీ టెస్టులో కోహ్లీ, విరాట్ తప్పుకుంటారా? తప్పిస్తారా? సెలెక్టర్లే మాజీ క్రికెటర్ ఫైర్
సిడ్నీ టెస్టులో కోహ్లీ, విరాట్ తప్పుకుంటారా? తప్పిస్తారా? సెలెక్టర్లే మాజీ క్రికెటర్ ఫైర్
Madanapalli News: మదనపల్లె ఫైల్స్ దగ్దం కేసులో తొలి అరెస్ట్, 6 నెలల తరువాత కేసులో కదలిక
మదనపల్లె ఫైల్స్ దగ్దం కేసులో తొలి అరెస్ట్, 6 నెలల తరువాత కేసులో కదలిక
Embed widget