అన్వేషించండి

Srikakulam News: కార్గో ఎయిర్పోర్ట్ పేరిట బలవంతపు భూసేకరణ! మరో ఉద్యమం వైపు పడుతున్న అడుగులు

ఉద్దానం ఉడుకుతోంది. ఉద్యమం వైపు ఉరుకుతోంది. ఎర్రజెండా నీడలో సేదదీరేందుకు సిద్ధమవుతోంది. కార్గో ఎయిర్పోర్ట్ పేరిట బలవంతపు భూ సేకరణను వ్యతిరేకిస్తోంది. వామపక్షాల సాయంతో ఆ ప్రయత్నాన్ని ప్రతిఘటిస్తోంది.

అభివృద్ధి మంచిదే కానీ.. అది ప్రజల అభివృద్ధి అయ్యుండాలని, కార్పొరేట్ల అభివృద్ధి కారాదని వామపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. రైతుల నుంచి కారు చౌకగా భూములు కొనుగోలు చేసి.. కార్పొరేట్లకు ధారాదత్తం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు.  ప్రభుత్వ విధానంపై నిప్పులు చెరిగారు. బలవంతపు భూసేకరణ సరికాదని అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో పైడిభీమవరం నుంచి ఇచ్ఛాపురం వరకు 193 కిలోమీటర్ల మేర సముద్రతీరం ఉందని, దీన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.

గతంలో అభివృద్ధి పేరుతో ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్ కు ప్రభుత్వం 2020 ఎకరాలు భూమిని ఇస్తే.. ఈస్ట్ కోస్ట్ కంపెనీ బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని దివాలా పిటిషన్ వేసింది. దీంతో ప్రభుత్వం వేలం వేసి సామీర్ పేట్ లాజిస్టిక్ కంపెనీకి 26 కోట్ల రూపాయలకు కారు చౌకుగా కట్టబెట్టిందని విమర్శించారు. 12 నుంచి గ్రామాల్లో పర్యటన కార్గో ఎయిర్ పోర్ట్ కోసం జరుగుతున్న బలవంతపు భూసేకరణను నిరసిస్తూ.. గ్రామాల్లో పర్యటిస్తామని వామపక్ష నేతలు ప్రకటించారు. అక్కడి రైతులను చైతన్యవంతం చేస్తామని చెప్పారు. ప్రజల ఆస్తిని కార్పొరేట్ ఆస్తిగా మార్చేస్తున్నారని దుయ్యబట్టారు. దీనివల్ల ప్రజల జీవన విధానం ధ్వంసం అయిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Srikakulam News: కార్గో ఎయిర్పోర్ట్ పేరిట బలవంతపు భూసేకరణ! మరో ఉద్యమం వైపు పడుతున్న అడుగులు

అదానీ ప్రదేశ్‌గా మార్చుతున్నారు

జిల్లా సస్యశ్యామలం కావాలంటే రూ. 1000 కోట్లతో వంశధార ఆధునీకరణ జరగాలని, శివారు భూములకు రెండు పంటలకు సాగునీరందిస్తే.. ప్రజల ఆదాయం పెరుగుతుందన్నారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు పెరుగుతాయని, ఉపాధి దొరుకుతుందని,వలసలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. వంశధార ఆధునీకరణకు ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించడం లేదో చెప్పాలన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ల అభివృద్ధి కన్నా ప్రజల అభివృద్ధి ముఖ్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ ని రాష్ట్ర ప్రభుత్వం అదానీ ప్రదేశ్ గా మార్చేస్తోందని ఆరోపించారు. జీడి, కొబ్బరి పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

 

ఉద్దానం కిడ్నీ బాధితులు

ఉద్దానం పేరు చెప్పగానే ప్రధానంగా గుర్తొచ్చేది కిడ్నీ వ్యాధులు. దశాబ్దాల కాలం నుండి కూడా ఇక్కడ కిడ్నీ వ్యాధులతో ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ నిర్మాణం చేపట్టినప్పటికీ కూడా పూర్తిస్థాయిలో వైద్యులు అందుబాటు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. అయితే అలాంటి వాటిపై దృష్టి సాధించి కిడ్నీ బాధితులను ఆదుకోవాలి కానీ ఈ విమానాశ్రయాలు వల్ల మాకు కలిగేది ఏముంటుంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా వలసలు అనేది ఉంటాయి. విమానశ్రయం వస్తే వలసలు నివారణ అనేది నివారిస్తాము అని చెప్తున్నారు. పూర్తిస్థాయిలో మాకు ఉద్యోగాలు ఇస్తారని నమ్మకాలేముంటాయి. నష్టపోయిన రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం వస్తుందని ఎలా అనుకుంటారు పూర్తిస్థాయిలో ఇవ్వరు. కిడ్నీ వ్యాధులతో ఎంతోమంది మృత్యువాత పడుతున్న వారికి సరైన వైద్యం చేకూరే విధంగా తగు చర్యలు చేపడితే ఎంతో బాగుంటుందని ఇలాంటి విమానాశ్రయాలు వల్ల తమకు ఏ ప్రయోజనం ఉండదని, ఇప్పటికే చాలామంది ఉద్యమ బాట పట్టారన్నారు. పలాసలో రీసెర్చ్ హాస్పిటల్ అంత పెద్దది నిర్మాణం చేసినప్పటికీ సరైన వైద్యనికాని అక్కడ ఏర్పాటు చేస్తే వాటికి మేము సంతోషిస్తాం. ఇక ఇలాంటి నిర్మాణాలు, ఎయిర్ పోర్టులు పెట్టి మా ప్రాణాలను తీసుకోవడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Srikakulam News: కార్గో ఎయిర్పోర్ట్ పేరిట బలవంతపు భూసేకరణ! మరో ఉద్యమం వైపు పడుతున్న అడుగులు

గతంలో ఉద్దానంలో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపడతామని ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి అతి ప్రజలు తిరగబడడంతో ముగ్గురు మృతి చెందారు 20 మంది వరకు క్షతగాత్రులు అయ్యారు. టెక్కలిలో పవర్ ప్లాంట్ నిర్మాణంలో అక్కడ ప్రజలు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడంతో అక్కడ ముగ్గురు మృతి చెందారు. ఉద్యమాల పురిటిగడ్డ సిక్కులు జిల్లా అని అంటారు అది ఖచ్చితంగా నిరూపిస్తామని చెబుతున్నారు. ప్రాణాలైనా అర్పిస్తాము ఇక్కడ మాత్రం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అయితే మాత్రం ఎటువంటి పరిస్థితులు అంగీకరించమని చెబుతున్నారు. కొబ్బరి పరిశ్రమకు సంబంధించి ఎంతో పరిశ్రమలు నిర్మించవచ్చు. వీటికి సంబంధించి ఎన్నో పరిశ్రమలు నిర్మించవచ్చు. విమానాలు వల్ల మాకు కలిగేది ఏమీ లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు గ్రామాల్లోకి వస్తే మా సత్తా చూపిస్తామంటున్నారు ఉద్దానవాసులు ఏం జరుగుతదో మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది.

Also Read: Pawan Kalyan Threat Calls Accused Arrest: పవన్‌ కళ్యాణ్‌ను చంపేస్తామని కాల్స్‌ చేసిన నిందితుడు అరెస్ట్! రహస్య ప్రాంతంలో విచారణ

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
Mana Shankara Vara Prasad Garu Trailer: ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
Soldier Suicide: కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? అయితే ఈ 3 వాస్తు చిట్కాలను పాటిస్తే అంతా ప్రేమమయం అయిపోతుంది!
తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? అయితే ఈ 3 వాస్తు చిట్కాలను పాటిస్తే అంతా ప్రేమమయం అయిపోతుంది!
Embed widget