By: ABP Desam | Updated at : 07 May 2022 03:23 PM (IST)
బంగాాళాఖాతంలో అల్పపీడనం ( Image Source : Twitter/Indiametdept )
దక్షిణ బంగాళాఖాతంలో అండమాన్ తీరంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉంది. మే 10న ఆంధ్రప్రదేశ్-ఒడిశా తీరాలకు చేరుకోవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ మృతుంజయ్ మహపాత్ర తెలిపారు. అల్పపీడన ప్రాంతం వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా, తూర్పు-మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని చెప్పారు. ఆదివారం సాయంత్రం నాటికి అల్పపీడనం మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
పశ్చిమ బెంగాల్లో ఉరుములు, భారీ వర్షాలు
ఐఎండీ ప్రకటన ప్రకారం, తుపాను ఏర్పడే అవకాశం ఉన్నందున, మే 10, 13 మధ్య గంగా పశ్చిమ బెంగాల్ జిల్లాల్లో ఉరుములు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ అల్పడీనం తుపానుగా మారితే దానికి అసని అని పిలవనున్నారు. దీనికి శ్రీలంక పెట్టింది. సింహళ భాషలో అసని అంటే కోపం.
బెంగాల్లో మే 10, 13 మధ్య భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మే 10 నుంచి కోల్కతాలో శక్తివంతమైన పిడుగులు పడే ఛాన్స్ ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. అసలు ప్రభావం తుపాను గమనంపై ఆధారపడి ఉంటుంది.
A Low Pressure Area lies over South Andaman Sea & adjoining Southeast BoB at 0830 hours IST of today, .To move northwestwards and intensify into a Depression over southeast Bay of Bengal by 7th May evening and into a Cyclonic Storm over eastcentral BoB by 8th May evening pic.twitter.com/37GFGOH4Bt
— India Meteorological Department (@Indiametdept) May 6, 2022
అల్పపీడన ప్రాంతం ప్రస్తుతం దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉందని IMD సీనియర్ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ తెలిపారు. "ఇది మే 10 సాయంత్రం వరకు వాయువ్య దిశగా కదులుతుందని భావిస్తున్నారు. ఆ తర్వాత ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరంలో వాయువ్య బంగాళాఖాతం వైపు కదులుతుంది" అని ఆయన తెలియజేశారు.
మే 10 నుంచి ఒడిశా మీదుగా ఉత్తరాంధ్రలో గంటకు 70-80 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. జగత్సింగ్పూర్, గంజాం, ఖోర్ధా జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఒడిశా తీరప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.
ఈ ప్రాంతంలో మూడేళ్లుగా వేసవిలో తుపాను వస్తున్నాయి. 2021లో 'యాస్', 2020లో 'అంఫాన్', 2019లో 'ఫణి' తుపాను ఈ ప్రాంతాన్ని కుదిపేసింది. మే 7న అల్పపీడనం ఏర్పడిన తర్వాతే తుపాను, గాలి వేగం, తీరందాటే ప్రదేశానికి సంబంధించిన వివరాలను IMD అందించనుంది. మే 9 నుంచి సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు. తుపాను వేగం సముద్రంలో గంటకు 80-90 కి.మీల వేగంతో కొనసాగుతుంది" అని మహపాత్ర చెప్పారు. సముద్రంలో మత్స్యకారుల రాకపోకలపై నిఘా ఉంచేందుకు భారత నావికాదళం, కోస్ట్గార్డ్లను అప్రమత్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య తీరం దాటుతుందా?
తుపాను ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య తీరాన్ని తాకుతుందా లేదా అనేది ప్రస్తుతానికి తెలియడం లేదు. "ఇది ఎక్కడ తీరం దాటుతుందనేది మేము ఇంకా ఎటువంటి అంచనా వేయలేదు. తీరం దాటే సమయంలో వీచే గాలి వేగంపై కూడా మేము ఏమీ చెప్పలేకపోతున్నాం. " అని IMD DG మృతుంజయ్ మహపాత్ర తెలిపారు.
Student Debarred: ఏపీ ఇంటర్ బోర్డ్ పరీక్షల్లో కాపీయింగ్ - 13 మంది విద్యార్థుల్ని డిబార్ చేసిన అధికారులు
Gold-Silver Price: స్థిరంగా బంగారం, వెండి ధరలు - మీ నగరంలో రేట్లు ఇవీ
Andhra Gold Man : ఒంటిపై ఐదు కేజీల బంగారం - ఆంధ్రా గోల్డ్ మ్యాన్ ముక్కా శ్రీనివాస్
బ్రిటిషన్ దొరను కీర్తిస్తూ శ్లోకం- నేటికీ నిత్యం స్మరిస్తున్న గోదావరి జనం- ఆయనంటే ఎందుకంత ప్రేమ?
Farmers On Jagan: ప్రభుత్వ తీసుకున్న ఆ నిర్ణయంపై కోస్తా రైతులు హర్షం- త్వరగా అమలు చేయాలంటూ విజ్ఞప్తి
Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ తగ్గింపు - వారికి మాత్రమే !
Woman Police SHO: మరో మహిళా పోలీస్కు అరుదైన గౌరవం, ఎస్హెచ్వోగా నియమించిన నగర కమిషనర్
YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?
Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?