అన్వేషించండి

Srikakulam Crime News : శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కిలాడీ లేడీ - 8 పెళ్లిళ్లు చేసుకొని డబ్బులతో జంప్‌

Srikakulam Crime News : వివాహాన్నే వ్యాపారంగా మార్చుకుందా యువతి. తన మేనత్తతో కలిసి జనాలను మోసం చేస్తూ వచ్చి చివరకు చిక్కింది.

Srikakulam Crime News : మన సమాజంలో పెళ్లి అనేది ఒక పవిత్రమైన బంధం. రెండు మనసులను, రెండు కుటుంబాలను కలిపే ఒక వేడుక. కానీ, కొందరు కేటుగాళ్లకు మాత్రం ఇది ఒక లాభదాయకమైన వ్యాపారంగా మారిపోయింది. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో వెలుగులోకి వచ్చిన సీరియల్ బ్రైడ్ ఉదంతం చూస్తుంటే, మోసం ఏ స్థాయిలో వేళ్లూనుకుందో అర్థమవుతుంది. కేవలం డబ్బు, నగలే లక్ష్యంగా అమాయకులను  బుట్టలో వేసుకుని, ఆపై అందినకాడికి దోచుకుని పరారవుతున్న ఒక మహిళా ముఠా బాగోతం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

వరుస పెళ్లిళ్ల వెనుక 'మాస్టర్ మైండ్'

ఈ కథలో ప్రధాన నిందితురాలు ముత్తిరెడ్డి వాణి. ఈమె ఇచ్చాపురం పట్టణంలోని కార్జీ వీధికి చెందిన మహిళ. అయితే, ఈమె ఈ మోసాలను ఒంటరిగా చేయడం లేదు. తన మేనత్త అయిన యాంపడ సంధ్యతో కలిసి ఒక పక్కా ప్లాన్‌తో ఈ మ్యారేజ్ స్కామ్ కు తెరలేపింది. వీరిద్దరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి, పెళ్లి సంబంధాల కోసం వెతికే అమాయక యువకులను, వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు.

వీరి పనితీరు చాలా చిత్రంగా ఉంటుంది. వాణిని ఒక పద్ధతైన అమ్మాయిగా చూపిస్తూ, సంధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తూ సంబంధాలు కలుపుతారు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి, ఎదుటివారి నమ్మకాన్ని చూరగొనడంలో వాణిది అందెవేసిన చేయి. వివాహం జరిగిన కొద్దిరోజులకే అసలు రంగు బయటపెట్టి, ఇంట్లో ఉన్న నగలు, నగదు తీసుకుని గుట్టుచప్పడుకుండా ఉడాయించడం వీరి ప్రధాన శైలి.

ఎనిమిది మంది బాధితులు.. ఒకే తరహా మోసం!

స్థానికంగా వినిపిస్తున్న కథనాల ప్రకారం, ముత్తిరెడ్డి వాణి ఇప్పటివరకు సుమారు 8 మందిని పెళ్లి చేసుకుని మోసగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకే వ్యక్తి ఎనిమిది సార్లు పెళ్లి చేసుకుని, ఎనిమిది మందిని మోసం చేయడం అంటే అది సాధారణ విషయం కాదు. ప్రతి పెళ్లిని ఒక ఆర్థిక లాభంగా మార్చుకోవడమే ఈ ముఠా లక్ష్యం. పెళ్లి పేరుతో భారీగా ఆస్తులను కొల్లగొట్టడం, ఆ తర్వాత ఎవరికీ అందకుండా పారిపోవడం వీరి అలవాటు. ఈ ఘటనలు అన్నీ ముందే వేసుకున్న పథకం ప్రకారం జరుగుతుండటంతో, బాధితులు తేరుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.

కార్జీ వీధిలో కలకలం - పోలీసుల రంగప్రవేశం

ఈ మధ్య కాలంలో విజయనగరంలో యువకుడితో వివాహమైంది. అనంతరం అత్తారింటికి వెళ్లే క్రమంలో చెప్పాపెట్టకుండా ట్రైన్ దిగేసింది. విజయనగరం నుంచి ఇచ్చాపురం ప్రత్యేకంగా వాహనం బుక్ చేసుకొని వచ్చేసింది. ఆమె కోసం వెతికిన వరుడు కుటుంబ సభ్యులు ఇచ్చాపురం వచ్చారు. అక్కడ వాణిని చూసిన వారంతా షాక్ అయ్యారు. ఎందుకిలా చేశావని ప్రశ్నిస్తే తనకు పెళ్లి ఇష్టం లేదని ప్లేట్ ఫిరాయించింది. ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

ఈ కిలాడీ పెళ్లికూతురు బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో కార్జీ వీధిలో ఈ ఘటనపై ప్రజల్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఒకే వీధికి చెందిన మహిళ ఇంతటి ఘోరానికి పాల్పడటం స్థానికులను విస్మయానికి గురిచేస్తోంది.

ప్రస్తుతం పోలీసులు ఈ వ్యవహారంపై లోతైన విచారణ ప్రారంభించారు. ప్రధాన నిందితురాలు ముత్తిరెడ్డి వాణి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. ఆమె ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో వాణి, ఆమె మేనత్త సంధ్యతో పాటు మరికొంతమంది సహకరించారా? అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. త్వరలోనే ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Vizag Fishermen Missing: మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
Vizag Boat Accident: ఆ ఒక్క స్విచ్ ఆన్ చేసి ఉంటే.. ఆరుగురు మత్స్యకారులు బతికేవాళ్లు! వైజాగ్ బోటు ప్రమాదంలో షాకింగ్ నిజాలు!
ఆ ఒక్క స్విచ్ ఆన్ చేసి ఉంటే.. ఆరుగురు మత్స్యకారులు బతికేవాళ్లు! వైజాగ్ బోటు ప్రమాదంలో షాకింగ్ నిజాలు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget