అన్వేషించండి

Vishnu Kumar Raju: బీజేపీ హై కమాండ్‌కు అంతుబట్టని మాజీ ఎమ్మెల్యే తీరు, కానీ వీర విధేయతలో ఆయనకు సాటిలేరు

ఏపీ ప్రభుత్వ విధానాలపై గట్టిగా  విమర్శలు గుప్పించేవారిలో బీజేపీ నుంచి ఉన్న నేతలు సోము వీర్రాజు, విష్ణు కుమార్ రాజు. మరో విపక్షమైన టీడీపీ విషయంలో మాత్రం ఆయనకి కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది

Vishnu Kumar Raju: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును రాజకీయాల్లో అజాత శత్రువు శత్రువు అంటారు. ఎవ్వరినీ నొప్పివ్వకుండా హుందాగా ఉండే వ్యవహారశైలి ఆయనది అని ప్రచారంలో ఉంది. అటు బీజేపీకి వీర విధేయుడు. 2014 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచిన నలుగురు ఎమ్మెల్యే లలో విష్ణుకుమార్ రాజు కూడా ఒకరు. వారిలో మాణిక్యాల రావు మృతి చెందగా, ఆకుల సత్యనారాయణ పార్టీ మారారు. కామినేని శ్రీనివాసరావు పూర్తిగా మౌనం పాటిస్తుండగా.. విష్ణుకుమార్ రాజు మాత్రం బీజేపీలో కొనసాగుతూ యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ విధానాలపై గట్టిగా  విమర్శలు గుప్పించేవారిలో బీజేపీ నుంచి ఉన్న నేతలు సోము వీర్రాజు, విష్ణు కుమార్ రాజు. అది ఉత్తరాంధ్ర అంశాలు కావొచ్చు, రుషికొండ తవ్వకాలు కావొచ్చు. సమస్య ఏదైనా ఏపీ సర్కార్ పై విష్ణుకుమార్ రాజు నుండి విమర్శలు సూటిగానే వస్తూ ఉంటాయి. 
ఆ పార్టీపై సాఫ్ట్ కార్నర్..
రాష్ట్రంలోని మరో విపక్షమైన టీడీపీ విషయంలో మాత్రం ఆయనకి కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది అనే ఆరోపణలు విశాఖ రాజకీయాల్లో వినిపిస్తుంటాయి. ఒకప్రక్క టీడీపీ అంటేనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడుతుంటారు. బీజేపీ అధిష్టానం కూడా  టీడీపీ ఇష్యులో అంత సుముఖంగా లేదనీ, టీడీపీ - జనసేనలతో పాటు బీజేపీ పొత్తు అంశం ఆదిలోనే ఆగిపోవడానికీ, పవన్ సైతం జనంతోనే పొత్తు అంటూ కొత్త పల్లవి అందుకోవడానికి బీజేపీ హైకమాండ్‌ టీడీపీని అంగీకరించక పోవడమే అన్న కథనాలు ఉండనే ఉన్నాయి. దాంతో టీడీపీ అంటే రాష్ట్ర బీజేపీ నేతలు కాస్త అంటీ ముట్టనట్టే వ్యవహరిస్తున్నారు.

విష్ణుకుమార్ రాజు ఈ విషయంలో మాత్రం ప్రత్యేకం :
విష్ణుకుమార్ రాజు మాత్రం ఇటీవల నర్సీపట్నం వెళ్లి మరీ అక్కడ టీడీపీ సీనియర్ నేత  అయ్యన్నపాత్రుడు కుటుంబాన్ని పరామర్శించి వచ్చారు. ఆయన అక్రమంగా ఇంటిని నిర్మించారంటూ నర్సీపట్నం మున్సిపల్ అధికారులు ఇంటి గోడను కూల్చివేసిన ఘటనలో వైజాగ్ నుండి వెళ్లి మరీ నర్సిపట్నంలో అయ్యన్న కుటుంబాన్ని పరామర్శించి రావడం పార్టీలో అంతర్గతంగా చర్చకు దారితీసింది.
అలాగే, ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు పుట్టినరోజు వేడుకలకూ హాజరై విష్ణుకుమార్ రాజు సంచలనం సృష్టించారు. ఏకంగా విశాఖపట్నం తూర్పులోని వెలగపూడి రామకృష్ణబాబు కార్యాలయానికి వెళ్లి మరీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపి వచ్చారు. ఆ వేడుకలకు హాజరైన ఏకైక బీజేపీ నేత విష్ణు కుమార్ రాజే కావడం విశేషం. దీనిపై టీడీపీ వర్గాల్లోనూ కాస్త ఆశ్చర్యంగా ఉన్నారు.  

ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా అప్పటి అధికార టీడీపీతో సన్నిహితంగా మెలిగేవారన్న ప్రచారం జరిగింది. ఒకానొక దశలో విష్ణుకుమార్ రాజు టీడీపీలో చేరతారన్న వదంతులు పైతం హల్ చల్ చేశాయి. అయితే ఆయన మాత్రం బీజేపీకే  కట్టుబడి ఉన్నారు. ఆ పార్టీకి, హై కమాండ్ కూ తిరుగులేని విధేయుడు విష్ణుకుమార్ రాజు అనడంలో ఏమాత్రం సందేహం లేదు అంటారు బీజేపీ నేతలు. కానీ, అదే సమయంలో టీడీపీ అంటే ఏదో మూల ఆయనకు సాఫ్ట్ కార్నర్ ఉందని, అందుకే ఆ పార్టీ నేతలను తరచుగా కలుస్తారని, అవసరమైన సందర్భాలలో వారికి సానుభూతి వ్యక్తం చేస్తున్నారని బీజేపీతో పాటు టీడీపీలోనూ ఆ మాట వినిపిస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
YS Jagan vs Chandrababu Naidu:ఆరు హత్యల నిందితుడిలాంటిదే జగన్‌ మైండ్ సెట్! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన!
ఆరు హత్యల నిందితుడిలాంటిదే జగన్‌ మైండ్ సెట్! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget