అన్వేషించండి

విధ్వంసాలకు మారుపేరు జగన్ : అచ్చెన్నాయుడు

విధ్వంసాలకు మారుపేరు జగన్ అంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతోందని ఏపీ టీడీపీ అధ్య క్షుడు, మాజీ మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు విమర్శించారు. పలాసలో 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న ప్రజల ఇళ్లు కూల్చడానికి రెవెన్యూ, పురపాలక అధికారులు ప్రయత్నించారని చెప్పారు. గురువారం రాత్రి అధికారులు పలాస- కాశీబుగ్గ మున్సిపాలిటీ 27వ వార్డు టీడీపీ కౌన్సిలర్ సూర్య నారాయణ ఇల్లు కూల్చేందుకు ప్రయత్నించారు. దీనిని వ్యతిరేకిస్తూ స్థానికులు పొక్లెయినర్ ముందు బైఠాయించారు. ఈ క్రమంలోనే బాధితులకు సంఘీభావం తెలపడానికి శుక్రవారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, గౌతు శిరీష పలాస బయల‌్దేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద వారిని అడ్డుకున్నారు. దాంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అచ్చెన్న, రామ్మోహన్, శిరీషలను పలాసలోకి అనుమతించేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు. 

నోటిసులు ఇవ్వాల్సిందేనన్న అచ్చెన్నాయుడు..

అనుమతి లేదన్న విషయానికి సంబంధించి నోటీసు ఇవ్వాలని అచ్చెన్న కోరారు. దీంతో పోలీసులు అచ్చెన్న, రామ్మోహన్లకు నోటీసులు ఇచ్చి టెక్కలి తరలించారు. దీనిపై అచ్చె న్నాయుడు విరుచుకుపడ్డారు. విధ్వంసాలతో జగన్ పాలన సాగుతోందని, ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెబుతారన్నారని అన్నారు. టీడీపీ నాయకులపై కక్ష సాధింపులే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. 40 ఏళ్లుగా టీడీపీ కౌన్సిలర్ సూర్య నారాయణ ఆ స్థలంలో నివాసం ఉంటున్నారన్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా దానిని తొలగించే హక్కు రెవెన్యూ, పురపాలక శాఖ అధికారులకు ఎవరిచ్చారని అచ్చెన్న ప్రశ్నించారు. అవసరమైతే న్యాయపోరాటానికి కూడా వెనుకాడేది లేదన్నారు. ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వైకాపా పాలనపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేక ఏర్పడిందని, ఆ దృష్టి మరల్చేందుకే టీడీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయిస్తున్నారన్నారు. 

మంత్రి అండదండలతోనే ఇవన్నీ..

పలాస భూకబ్జాలకు కేంద్రంగా మారిపోయిందన్నారు. ప్రభుత్వ భూములను వైకాపా నాయకులు కబ్జా చేస్తున్నా.. పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్నారు. పలాసలో భూములన్నీ వైకాపా నాయకులే ఆక్రమిస్తున్నారని, ఆ విషయం అధికారులకు కూడా తెలుసునన్నారు. మంత్రి అండదండలతోనే ఇవన్నీ జరుగుతున్నాయని అన్నారు. వాటిపై చర్యలు తీసుకోవడం మాని, టీడీపీ కౌన్సిలర్ ఇంటిని కూల్చేందుకు అధికారులు ప్రయత్నించడం సిగ్గు చేటన్నారు.

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష మాట్లాడుతూ... వైకాపా కక్షసాధింపు రాజకీయాలకు తెరలేపిందని అన్నారు. నియోజకవర్గంలో టీడీపీకి పెరుగుతున్న ఆదరణను చూసి స్థానిక మంత్రి ఓర్వలేకపోతున్నారన్నారు. అందుకే టీడీపీ కౌన్సిలర్ ఇంటిని కూల్చేందుకు అధికారులు సిద్ధమయ్యారని, దీనివెనుక మంత్రి ఆదేశాలు ఉన్నాయన్నారు. బాధితులు అధికారుల కాళ్లపై పడి వేడుకున్నా కనికరించకపోవడం సరికాదన్నారు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని వైకాపా నాయకులు గుర్తించాలని సూచించారు. 

పలాసలోకి ప్రవేశించకుండా..

ఎంపీ రామ్మోహన్ నాయుడు, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండ దాసునాయుడు, ఇతర టీడీపీ నేతలను పోలీసులు పలాసలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. మరోవైపు మాజీ మంత్రి గౌతు శివాజీ కూడా అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అవి నిజంగానే అక్రమ కట్టడాలైతే, అధికారులు ముందస్తు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పలాస పట్టణంలో భూకబ్జాలు చేస్తున్నవారందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

కూన రవికుమార్ హౌస్ అరెస్ట్.. 

పలాసలో టీడీపీ కౌన్సిలర్ ఇంటిని కూల్చేందుకు అధికారులు సిద్ధమవడంతో జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు అప్రమత్తం అయ్యాయి. పలాస వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ను స్థానిక శాంతి నగర్‌లోని నివాసం వద్ద శుక్రవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై కూన మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. ఏ కారణంతో తనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారో చెప్పాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడం కూడా పాపంగా మారిందన్నారు. వైకాపా పాలనకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడుతారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు సరి చేస్తామని హెచ్చరించారు.

టాప్ హెడ్ లైన్స్

AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Embed widget