అన్వేషించండి

AP Politics: వసంత, పార్థసారథి, బాలశౌరిని వైసీపీ టార్గెట్ చేసిందా ? ముగ్గుర్ని ఓడించేందుకు వ్యూహాలు!

Andhra Pradesh: కృష్ణా జిల్లాలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన వారిపై అధికార పార్టీ ప్రత్యేక ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.

AP Assembly Elections 2024: ఉమ్మడి కృష్ణా జిల్లాలో అధికార వైసీపీ (Ysrcp)...కొందరు నేతలను ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతోందా ? పార్టీని వీడిన ఆ ముగ్గురు నేతలను ఓడించేందుకు ముప్పేట దాడి చేయాలని నిర్ణయించిందా ?అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కృష్ణా జిల్లాలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ(Tdp)లో చేరిన వారిపై అధికార పార్టీ ప్రత్యేక ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ-జనసేన కూటమి తరపున బరిలోకి దిగుతున్న మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశారి, మాజీ మంత్రి, నూజివీడు అభ్యర్థి కొలుసు పార్థసారథి (Parthasarathi), మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ (Vasanta Krishna Prasad) ను ఓడించాలన్న లక్ష్యంతో వైసీపీ హైకమాండ్ వ్యూహాలు రచిస్తోంది.

వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడంతో... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు చేయడం ఆ పార్టీ అధిష్ఠానానికి ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. దీంతో ముగ్గుర్ని ఎలాగైనా ఓడించాలని, అన్ని అస్త్రాలు ప్రయోగించేందుకు రెడీ అయినట్లు సమాచారం. జిల్లాలోని  మైలవరం, పెనమలూరు అసెంబ్లీ స్థానాలతో పాటు మచిలీపట్నం పార్లమెంట్ స్థానాల్లో... ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో వైసీపీ హైకమాండ్ ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వైసీపీ నుంచి గెలిచిన ముగ్గురు నేతలు పార్టీని వీడే సమయంలో విమర్శలు చేసిన నేతలను ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడించాలని కేడర్ కు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. 

మొదట అసమ్మతి గళం వినిపించిన పార్థసారథి 
మాజీ మంత్రి పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి... జిల్లా నుంచి మొట్టమొదట పార్టీ అధిష్టానంపై అసమ్మతి గళం వినిపించారు. ఈసారి పెనమలూరు నుంచి కాకుండా నూజివీడు నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు బరిలోకి దిగడం ఖాయమైంది. యాదవుల ఓట్లు ఎక్కువగా ఉండటంతో...పార్థసారథి నూజివీడుకు షిఫ్ట్ అయ్యారు. అయితే పార్థసారథిని ఓడించేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఇన్ చార్జ్ గా పనిచేసిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు టికెట్ దక్కకపోవడంతో... సీఎం జగన్ ను కలిశారు. ఆయన వైసీపీలో చేరుతారని భావించారు. అయితే మద్దరబోయిన వైసీపీలో చేరకపోవడానికి కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ముద్దరబోయిన వెంకటేశ్వరరావును ఇండిపెండెంట్ గా పోటీ చేయించి... ఓట్లను చీల్చాలన్న లక్ష్యంతో వైసీపీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఓట్లు చీల్చడం ద్వారా పార్థసారథిని ఓడించవచ్చనే ప్లాన్ చేస్తోంది.  

వసంతను ఓడించేందుకు సీనియర్లకు బాధ్యతలు

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్... ఇటీవల చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. మైలవరంలో టీడీపీ అభ్యర్థిగా వసంత పోటీ చేయడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఐదేళ్ళ పాటు వైసీపీలో ఉన్న వసంత... మంత్రి జోగి రమేష్ తో విభేదాలు ఉన్నాయి. అనేక అంశాల్లో ముఖ్యమంత్రి జగన్, వైసీపీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ... టీడీపీ కండువా కప్పుకున్నారు. యాదవ వర్గానికి చెందిన సర్నాల తిరుపతి రావును వైసీపీ బరిలోకి దించింది. సాధారణ జడ్పీటీసీగా ఉన్న సర్నాల తిరుపతి రావుతోనే వసంతను ఓడించాలని ఎత్తులు వేస్తున్నట్లు సమాచారం. వసంతను ఓడించే బాధ్యతలను కొందరు సీనియర్ నేతలకు వైసీపీ అప్పగించినట్లు తెలుస్తోంది. వారికి అన్ని విధాలా సహయసహకారాలు అందించేందుకు రెడీ అయింది. 

బాలశారికి చెక్ పెట్టేలా వ్యూహాలు ?

మచిలీపట్నం ఎంపీ బాలసౌరి వైసీపీని వీడి జనసేన కండువా కప్పుకున్నారు. బాలశారి టీడీపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మచిలీపట్నం పార్లమెంట్ నుంచి బరిలోకి దిగనున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన అవనిగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబును ప్రస్తుతానికి వైసీపీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించింది. ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేసిన బాలసౌరీ ఓడించి తీరాలని వైసీపీ అధిష్టానం పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gannavaram Airport: గన్నవరం ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఫ్టైట్‌లో మంత్రి గొట్టిపాటి, ఇద్దరు ఎమ్మెల్యేలు
గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఫ్టైట్‌లో మంత్రి గొట్టిపాటి, ఇద్దరు ఎమ్మెల్యేలు
Bihar IPS Sunil Naik: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. విచారణకు హాజరైన బిహార్ ఐపీఎస్ సునీల్ నాయక్
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. విచారణకు హాజరైన బిహార్ ఐపీఎస్ సునీల్ నాయక్
Dhulipalla Narendra: పాలు, వెన్న లేకుండా నెయ్యి తయారు చేశారు, వైసీపీ ఇకనైనా తప్పు ఒప్పుకోవాలి: ధూళిపాళ్ల నరేంద్ర
పాలు, వెన్న లేకుండా నెయ్యి తయారు చేశారు, వైసీపీ ఇకనైనా తప్పు ఒప్పుకోవాలి: ధూళిపాళ్ల నరేంద్ర
AP Free Bus: దివ్యాంగులకు APSRTC గుడ్‌న్యూస్.. ఏ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు
దివ్యాంగులకు APSRTC గుడ్‌న్యూస్.. ఏ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు

వీడియోలు

Ind vs Eng 2nd Semi Final Preview | ఫైనల్ కు కివీస్ పిలుస్తోంది..ప్రత్యర్థి ఎవరో తేలేది నేడే | ABP Desam
Dinesh karthik Counter on Pak Matches | మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ లకు డీకే మాస్ కౌంటర్ | ABP Desam
SA vs NZ Semis 1 Highlights | టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్ | ABP Desam
South Africa ICC Bad Luck Continues | మరోసారి కప్పు లేకుండానే తిరుగుముఖం పట్టిన సౌతాఫ్రికా | ABP Desam
Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Eng 2nd Semi Final: సంజూ సెంచరీ మిస్.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ రికార్డ్ స్కోరు.. ఇంగ్లాండ్‌కు బిగ్ టార్గెట్
సంజూ సెంచరీ మిస్.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ రికార్డ్ స్కోరు.. ఇంగ్లాండ్‌కు బిగ్ టార్గెట్
Tolichawki building collapses : ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
Bengal governor resigns : బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
India Condoles Khamenei Death: ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
AP 10th Hall Tickets: ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
Operation Decapitation: ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ నుండి బంకర్ బస్టర్ల వరకు.. ఖమేనీ అంతం వెనుక CIA, మోసాద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ నుండి బంకర్ బస్టర్ల వరకు.. ఖమేనీ అంతం వెనుక CIA, మోసాద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
Mrithyunjay OTT : మృత్యుంజయ్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మృత్యుంజయ్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Speaker chit chat: వైసీపీ సభ్యులు సభకు వస్తేనే మసాలా - జగన్ జీతం తీసుకోవడం లేదు - స్పీకర్ అయ్యన్న కీలక వ్యాఖ్యలు
వైసీపీ సభ్యులు సభకు వస్తేనే మసాలా - జగన్ జీతం తీసుకోవడం లేదు - స్పీకర్ అయ్యన్న కీలక వ్యాఖ్యలు
Embed widget