అన్వేషించండి

Vallabhaneni Vamsi Gets Bail: టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీకి బెయిల్, అయినా జైల్లోనే మాజీ ఎమ్మెల్యే

మొన్న సత్యవర్దన్ కిడ్నాప్ కేసులో, శుక్రవారం నాడు టీాడీపీ ఆఫీసు మీద దాడి కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది. కానీ ఇతర కేసుల కారణంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే విడుదల కావడం లేదు.

Vallabhaneni Vamsi Bail News Updates | విజయవాడ: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే  వల్లభనేని వంశీకి మరో శుభవార్త వచ్చింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ లభించింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా ఉన్నారు వల్లభనేని వంశీ. మొన్న సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ మంజూరైంది. రెండు రోజుల వ్యవధిలో రెండు కీలక కేసుల్లో వల్లభనేని వంశీకి కోర్టులు బెయిల్ మంజూరు చేశాయి.  

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సిఐడి కోర్టు వంశీకి శుక్రవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. ఈ రెండు కేసుల్లోనూ కోర్టుల్లో ఊరట కలిగినా, వల్లభనేని వంశీ జైలుకు పరిమితం కానున్నారు. కానీ నూజివీడు కోర్టు ఇచ్చిన రిమాండ్ కారణంగా మాజీ ఎమ్మెల్యే జైలులోనే ఉండనున్నారు. వల్లభనేని వంశీపై గన్నవరం పోలీసు స్టేషన్లో శుక్రవారం నాడు మరో  కేసు నమోదు అయింది.

వంశీకి 14 రోజుల రిమాండ్
వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడులో నకిలీపట్టాలు చేసి లబ్దిదారులకు పంచారని ఆయనపై, ఓలుపల్లి రంగా అనే వంశీ అనుచరుడిపైనా కేసు నమోదు అయింది. వీరిద్దరిని పీటీ వారెంట్ కింద అరెస్ట్ చేసిన పోలీసులు నూజివీడు కోర్టులో హాజరు పరిచారు. బెయిల్ ఇవ్వాలని వల్లభనేని వంశీ తరపు న్యాయవాదులు వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఇద్దరు నిందితులను 14 రోజుల రిమాండ్ కు పంపిస్తూ ఆదేశాలు ఇచ్చారు.      

అక్రమ మైనింగ్‌ కేసు
జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. గన్నవరంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని మైనింగ్ ఏడీ గన్నవరం పోలీసు స్టేషన్‌లో వల్లభనేని వంశీపై ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి అక్రమ తవ్వకాలకు సంబంధించిన వివరాలను పోలీసులకు సమర్పించారు. 2019 నుంచి 2024 వరకు వంశీ, ఆయన అనుచరులు అక్రమాలు చేశారని ఆ రిపోర్టులో ఉంది. దాని ప్రకారం సుమారు రూ.100 కోట్ల విలువైన మైనింగ్‌ అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదు రావడంతో వంశీపై కేసు నమోదైంది.          

వల్లభనేని వంశీకి కోర్టులు బెయిల్ మంజూరు చేస్తున్నా ఊరట కలగడం లేదు. వరుస కేసులు నమోదు కావడం, మరో కోర్టు ఆయనకు రిమాండ్ విధిస్తుండటంతో వంశీ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. పలు కేసుల్లో ఆయన నిందితుడిగా ఉండగా, వంశీపై వరుస కేసులు నమోదవుతున్నాయి. విచారణ చేపట్టిన పోలీసులు కోర్టుల్లో ప్రవేశపెట్టడం, ఆయనకు రిమాండ్ విధించడం జరుగుతోంది. గతంలో నమోదైన కేసుల్లో బెయిల్ వస్తున్నా, ఆయన జైలు నుంచి విడుదల కావడంలో జాప్యం జరుగుతోంది. ఆయన అనారోగ్యం కారణాలతో వంశీకి బెయిల్ ఇప్పించాలని ఆయన తరఫు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు. కానీ కోర్టులు బెయిల్ మంజూరు చేస్తున్నప్పటికీ.. కొత్త కేసులు నమోదు అవుతుండటంతో గన్నవరం మాజీ ఎమ్మెల్యే మరికొంత కాలం జైల్లో ఉండే అవకాశం కనిపిస్తోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Viral News:
"గుండెల నిండా దమ్ముతో ఎదురించాలి, జెండా ఎగరేయాలి" జనసేన ఆవిర్భావం రోజున ఓ బామ్మ కామెంట్స్ వైరల్‌!
AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే
CM Chandrababu: భవానీ ద్వీపం ఇండియా, పాక్ బార్డర్‌లో ఉందా? హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ కట్టలేకపోయా: సీఎం చంద్రబాబు
భవానీ ద్వీపం ఇండియా, పాక్ బార్డర్‌లో ఉందా? హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ కట్టలేకపోయా: చంద్రబాబు
Iran War Effect AP Hotels: ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Embed widget