Winter Special Trains: నరసాపురం, అనకాపల్లి నుంచి సికింద్రాబాద్కు స్పెషల్ రైళ్లు!డేట్స్, టైమింగ్స్ ఇవే..!
సంక్రాంతి సహా పండగ సీజన్ రద్దీని దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ నరసాపురం, అనకాపల్లి నుంచి సికింద్రాబాద్కు ప్రత్యేక ట్రైన్స్ వేశారు. ఆ రైళ్లు ఎప్పుడెప్పుడు తిరుగుతాయి, టైమింగ్స్ ఏంటో ఇక్కడ చూద్దాం.

Winter Special Trains: వింటర్ సీజన్ మొదలు కావడంతో టూరిస్ట్ల తెలుగు రాష్టాల్లో రద్దీ ఎక్కువగా ఉంది. ఆ రష్ను హ్యాండిల్ చెయ్యడం కోసం దక్షిణ మధ్య రైల్వే పలు స్పెషల్ రైళ్లను నడుపుతోంది. వాటిలో నరసాపురం, అనకాపల్లి నుంచి సికింద్రాబాద్కు రెండు ప్రత్యేక రైళ్ళను అనౌన్స్ చేశారు.
1)ట్రైన్ నెంబర్ 07455 నరసాపురం -సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్. ఈ ట్రైన్ 12 నవంబర్ అంటే రేపు సాయంత్రం 6:30కి నరసాపురంలో బయలుదేరి పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ జంక్షన్, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా ప్రయాణించి మర్నాడు ఉదయం 5గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైల్లో 2Ac, 3AC, స్లీపర్, జనరల్ కోచ్లు ఉంటాయి
2)ట్రైన్ నెంబర్ 07179 అనకాపల్లి -సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్. ఈ ట్రైన్ 15 నవంబర్ అంటే శనివారం సాయంత్రం 05:35కి అనకాపల్లిలో బయలుదేరి తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి,పిడుగురాళ్ల,మిర్యాలగూడ, నల్గొండ,చర్లపల్లి మీదుగా ప్రయాణించి మర్నాడు ఉదయం 8గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైల్లో 1AC, 2AC, 3AC, స్లీపర్, జనరల్ క్లాస్ బోగీలు ఉంటాయి. ప్రయాణికులు ఈ స్పెషల్ రైళ్ల సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే లోని విజయవాడ డివిజన్ ఒక ప్రకటన విడుదల చేసింది.
ట్రెండింగ్ వార్తలు






















