అన్వేషించండి

Buddha Venkanna: నాలుక కోసుకోవడానికి నేను రెడీ, నువ్వు కూడా సిద్ధమా? ఆరా మస్తాన్‌కు బుద్ధా వెంకన్న ఛాలెంజ్

AP Exit Poll 2024: ఏపీలో కూటమి అధికారంలోకి రాకపోతే నాలుక కోసుకుంటానని బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఆరా ఎగ్జిట్ పోల్స్ తప్పయితే ఆరా మస్తాన్ నాలుక కోసుకుంటారా అని సవాల్ విసిరారు.

AP Election Results 2024 | విజయవాడ: దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత శనివారం సాయంత్రం పలు ప్రముఖ మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం సాధిస్తుందని పలు సంస్థల ఎగ్జిట్ పోల్ సర్వేలో వచ్చింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో కూటమి అధికారంలోకి రాకపోతే నాలుక కోసుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

విజయవాడలో బుద్ధా వెంకన్న ఆదివారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. ఆరా మస్తాన్ వైసీపీ గెలుస్తుందని ఫేక్ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశారని మండిపడ్డారు. వైసీపీ చెప్పినట్లు ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇచ్చారని ఆరోపించారు. ఒకవేళ ఏపీలో కూటమి అధికారంలోకి రాకపోతే తాను నాలుక కోసుకుంటా అన్నారు. ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఆరా మస్తాన్ నాలుక కోసుకుంటాడా అని బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు. ఎలాగూ ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసిన వైసీపీ నేతలు బెట్టింగ్ కాయటానికి ఫేక్ ఎగ్జిట్ పోల్స్ ప్రకటనలు ఇచ్చి ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు.

‘నేషనల్ ఛానల్స్ ఇండియా టుడే, మరిన్ని ప్రముఖ సంస్థలు కూటమి అధికారంలోకి వస్తుందని, ఎక్కువ మెజార్టీ వస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వచ్చాయి. అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఆరా మస్తాన్‌తో ఫేక్ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు ప్రకటించారు. తమకు సీట్లు వస్తున్నాయని తెలిసి, ఎన్నికల కౌంటింగ్ మేనేజ్ చేసే ఉద్దేశంతో జగన్, ఆయన టీమ్ సభ్యులు, సజ్జల రామక్రిష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులు కలిసి ఆరా మస్తాన్‌తో కలిసి ఫేక్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల చేశారు. ఎన్నికల ఖర్చులను రాబట్టుకునేందుకు బెట్టింగ్ లపై ఆధారపడి తప్పుడు సర్వే రిజల్ట్స్ ఇస్తున్నారు. ఇది నిజమని ప్రజలు బెట్టింగ్స్ కాసి నష్టపోవద్దు.

కూటమికి 130కి పైగా సీట్లు వస్తాయని దాదాపు 70 శాతం సర్వేలు చెబుతున్నాయి. మరో రెండు రోజుల్లో ఫలితాలు రానున్నాయి. కానీ ఫేక్ సర్వేల కారణంగా ప్రజలు వైసీపీ మీద బెట్టింగ్స్ వేసి మోసపోయే అవకాశం ఉంది. ఆరా మస్తాన్ ఇచ్చింది ఫేక్ సర్వే. ఫలితాల్లో కూటమి అధికారంలోకి రాకపోతే నేను నా నాలుక కోసుకుంటాను. కూటమి గెలిస్తే ఆరా మస్తాన్ నాలుక కోసుకునేందుకు సిద్ధమా. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని’ టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు.

ఏపీలో కూటమికి భారీగా సీట్లు, వైసీపీకి ఎదురుదెబ్బ!
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమికి 52.9 శాతం ఓట్లు పోల్ అవుతాయని, అధికార వైఎస్సార్ సీపీ 41.7 శాతం ఓట్లు, కాంగ్రెస్ కు 3.3 శాతం ఓట్లు వస్తాయని, ఇతరులు 2.1 శాతం ఓట్లు సాధిస్తారని (ABP CVoter Exit Poll 2024) ఎగ్జిట్ పోల్ లో తేలింది. ఏపీలో కూటమికి కనిష్టంగా 21 సీట్లు, గరిష్టంగా 25 సీట్లు వస్తాయని, వైఎస్సార్ సీపీకి 0-4 సీట్లు గెలిచే అవకాశం ఉందని సర్వేలో వచ్చింది. 2019లో వైసీపీ 22 ఎంపీ సీట్లు సాధించగా, టీడీపీ 3 ఎంపీ సీట్లకే పరిమితమైంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Ration Shops: ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Devansh Birthday:శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు ఫ్యామిలీ! దేవాన్ష్ పుట్టిన రోజున తిరుమలలో అన్నదాన కార్యక్రమం! స్వయంగా వడ్డించిన సీఎం!
శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు ఫ్యామిలీ! దేవాన్ష్ పుట్టిన రోజున తిరుమలలో అన్నదాన కార్యక్రమం! స్వయంగా వడ్డించిన సీఎం!
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన! రెండు రోజులు బీభత్సం! పిడుగులతో జనం బెంబేలు!
ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన! రెండు రోజులు బీభత్సం! పిడుగులతో జనం బెంబేలు!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget