అన్వేషించండి

కృష్ణా, గుంటూరు, నెల్లూరు ఎపిసోడ్స్‌పై జగన్ వ్యూహమేంటి? జిల్లా కోఆర్డినేటర్లకు ఏం చెప్పనున్నారు?

వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్లతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన పార్టీ నేతల్లో విభేదాలు బయటపడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఎలాంటి స్ట్రాటజీ ప్రకటిస్తారనేది తేలనుంది.

సీఎం జగన్ నేడు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జిల్లాల వారీగా రీజనల్ కో ఆర్డినేటర్లతో సమావేశం కానున్నారు. గడప గడప మన ప్రభుత్వం ప్రోగ్రామ్‌తోపాటు తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలతో సీఎం జగన్ చర్చించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సొంత పార్టీ నేతలు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దీన్ని వెలుగులోకి తీసుకొచ్చిన కోటంరెడ్డిపై ఇప్పటికే తీవ్ర స్థాయిలో మండిపడుతున్న వైసీపీ కీలక నేతలు మండిపడుతున్నారు. ఈ భేటీ తర్వాత ఇంకా ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారన్న చర్చ నడుస్తోంది. నేడు జరగనున్న సమావేశంలో పార్టీలో ఉన్న కొన్ని సమస్యలు, జనంలో ఎక్కువగా తిరగడం వచ్చే ఎన్నికల ప్రధాన ఎజెండాపై చర్చించనున్నారని అంటున్నారు. 

జిల్లాలా వారీగా బయట పడుతున్న విభేదాలు..

ఇప్పటికే గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం అవుతోంది. వరుసగా రోజుకో వివాదం జిల్లాల్లో బయటకు వస్తుంది. కృష్ణా జిల్లాలో మైలవరం, పెడన నియోజకవర్గాలకు సంబంధించిన అంశం అత్యంత కీలకంగా మారింది. మంత్రిగా వ్యవహరిస్తున్న జోగి రమేష్ తన నియోజకవర్గంలో వేలు పెట్టి ఇస్టానుసారంగా వ్యవహరాలు సాగించటంపై పార్టీ నేతల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. అయినా ఈ వ్యవహరంలో పార్టీ పెద్దలు స్దానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ను లెక్క చేయకుండా బీసీ మంత్రి అయన జోగి రమేష్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారనే టాక్ ఉంది. ఈ వ్యవహరంలో సీరియస్ అయిన వసంత, పూర్తిగా సైలెంట్ అయిపోయారు. దీంతో పార్టీ నాయకులు కూడా రెండు వర్గాలుగా విడిపోయారు. పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి, స్థానికంగా బలంగా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమాను ఢీకొట్టటానికి వసంతను వాడుకొని వదిలేశారనే ప్రచారం కూడా మొదలైంది. 


గుంటూరులో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తాడికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీదేవిని కాదని, అక్కడ నియోజకవర్గానికి మరొక పర్యవేక్షుడిని నియమించటంతో మొదలైన వివాదం ఇప్పటికి నివురుగప్పిన నిప్పులానే ఉంది. గుంటూరు పశ్చిమంలో కూడా ఇదే పరిస్థితి. గుంటూరు పశ్చిమంలో టీడీపీ అభ్యర్థి మద్దాలి గిరి విజయం సాధించారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ డీఐజీ ఏసురత్నం ఇంచార్జ్ గా ఉన్నారు. అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా లేళ్ళ అప్పిరెడ్డిని పార్టీ నియమించింది. అక్కడ కూడా పార్టీ అంతర్గత విభేదాలు నడుస్తున్నాయి. ఇంచార్జ్‌గా ఉన్న ఏసురత్నంను కాదని టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే మద్దాలి గిరికి ప్రాధాన్యత ఇవ్వటం, అదే నియోజకవర్గంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి కూడా చక్రం తిప్పటంతో విభేదాలు కామన్ అయ్యాయి. దీంతో పార్టీ కార్యకర్తలు మూడు గ్రూపుల్లో దగ్గరకు వెళితే ఏం అవుతుందో అనే సంకోచంలో పడ్డారని అంటున్నారు.


తాజాగా నెల్లూరు ఎపిసోడ్ 

తాజాగా నెల్లూరు జిల్లాలో కోటం రెడ్డి శ్రీదర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కామెంట్స్‌తో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో ఆనం వ్యవహరం కూడా పార్టీకి మింగుడు పడనీయకుండా చేసింది. దీనిపై రాష్ట్ర హోం శాఖకు చెందిన అధికారులు కూడా రంగంలోకి దిగారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల, హోంశాఖ వర్గాలు కూడా జగన్‌తో సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించారు. ఈ విషయంలో ఎప్పటికప్పుడు అలర్ట్‌గా వ్యవహరించాలని జగన్ అటు హోం శాఖ అధికారులకు, పార్టీ నేతలకు ఆదేశించారని చెబుతున్నారు. ఈ పరిస్థితిలో పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లతో నేడు మధ్యాహ్నం జరగనున్న సమావేశంలో ఇంకా ఏం చెప్తారనే ఉత్కంఠ ఉంది. అందుకే అందరి ఫోకస్ ఈ భేటీపై ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
AP Matsyakara Bharosa 2026 : మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!
మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget