అన్వేషించండి

Sitaram Yechury : నేడు పార్టీ కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్‌కు సీతారాం ఏచూరి పార్థివదేహం- నిన్న రాత్రి నివాళి అర్పించిన చంద్రబాబు

AP CM Chandra Babu : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం రాత్రి సీతారాం ఏచూరి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేశారు.

Sitaram Yechury: అనారోగ్య సమస్యలతో మృతి చెందిన సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి పార్థివదేహాన్ని ఇవాళ పార్టీ కార్యాలయానికి తీసుకురానున్నారు. శుక్రవారం సాయంత్రం ఎయిమ్స్ నుంచి జేఎన్‌యూకు తీసుకొచ్చారు. అక్కడ విద్యార్థులు, ప్రొఫెసర్స్‌ నివాళి అర్పించారు. అనంతరం వసంత్ కుంజ్‌లోని ఏచూరి నివాసానికి మృతదేహాన్ని తీసుకెళ్లారు. అనంతరం మృతదేహాన్ని పార్టీ కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్‌కుతరలించనున్నారు. పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు వచ్చి నివాళి అర్పిస్తారు. సాయంత్రం నాలుగు గంటల వరకు అక్కడే మృతదేహాన్ని ఉంచుతారు. సాయంత్రం నాలుగు తర్వాత మృతదేహాన్ని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలిస్తారు.

ఏచూరి భౌతికఖాయం ఆయన నివాసంలో ఉండగానే సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నా ఆయనకు  టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీతారాం ఏచూరి నివాసానికి చేరుకున్నారు చంద్రబాబు. సీఎం చంద్రబాబుతోపాటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు,అప్పల నాయుడు, కృష్ణ ప్రసాద్, మాజీ ఎంపీలు కంభంపాటి రామ్మోహన్ రావు, రవీంద్ర కుమార్ అంతా ఏచూరి పార్ధివదేహానికి శ్రద్ధాంజలి ఘటించారు.

Also Read: సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?

సీఎం చంద్రబాబుతోపాటు మంత్రి నారా లోకేష్, పలువురు మంత్రులు సీతారం ఏచూరి మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న ప్రత్యేక అనుబంధంతో చంద్రబాబు నేరుగా వెళ్లి సీతారాం ఏచూరి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. రాత్రికి అక్కడే బస చేసి, ఉదయం హైదరాబాద్‌కు బయల్దేరారు. 

దివికెగసిన ఎర్ర సూరీడు
వామపక్ష నేత, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దశాబ్దాలుగా పార్టీలోనూ, జాతీయ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. కమ్యూనిస్టుగానే కాకుండా ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా, కాలమిస్టుగా కూడా ఆయన విస్తృత గుర్తింపు పొందారు. దాదాపు 50 ఏళ్ల సీపీఎం పాలన తర్వాత ఈ ఎర్రటి సూర్యుడు అస్తమించాడు. రాజ్యసభ సభ్యుడిగా సుదీర్ఘకాలం కొనసాగారు. తెలుగు గడ్డపై పుట్టిన సీతారాం ఏచూరి విద్యార్థి దశలోనే ఎడమవైపు మొగ్గు చూపారు. ఈ క్రమంలో ఢిల్లీలోని జేఎన్‌యూలో చదువుతున్నప్పుడే సీపీఎంలో చేరారు. మరోవైపు బాల్యం అంతా హైదరాబాద్‌లోనే గడిచింది. ఆయన పూర్తి పేరు ఏచూరి సీతారామరావు. రావును తీసేసి సీతారాం గానే కొనసాగారు. శ్వాసకోశ సంబంధిత, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆగస్ట్ 19 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్సం పొందుతున్నారు. వెంటిలేటర్‌పై ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. చివరికి ఆయన పరిస్థితి విషమించడంతో సెప్టెంబర్ 12 గురువారం తుది శ్వాస విడిచారు.

Also Read: వామపక్ష యోధుడు సీతారాం ఏచూరి కన్నుమూత, చికిత్స పొందుతూ ఆస్పత్రిలో తుదిశ్వాస

టాప్ హెడ్ లైన్స్

AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Embed widget