అన్వేషించండి

బెజవాడ దుర్గమ్మ ఆలయానికి కొత్త ట్రస్ట్ బోర్డ్- 15మంది సభ్యులతో జీవో జారీ చేసిన ప్రభుత్వం

బెజవాడ దుర్గమ్మ ఆలయానికి నూతన ట్రస్ట్ బోర్డ్ ను నియామకం జరిగింది. కమిటి నియమిస్తూ ప్రభుత్వం 111 జీవోను విడుదల చేసింది.

బెజవాడ దుర్గమ్మ ఆలయానికి ట్రస్ట్ బోర్డ్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పదిహేను మంది కమిటి సభ్యులను నియమిస్తూ జీవోను జారీ చేసింది.

బెజవాడ దుర్గమ్మ ఆలయానికి నూతన ట్రస్ట్ బోర్డ్ ను నియామకం జరిగింది. కమిటి నియమిస్తూ ప్రభుత్వం 111 జీవోను విడుదల చేసింది. బోర్డ్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి రెండు సంవత్సరాలపాటు పదవిలో ఉంటారని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. మొత్తం పదిహేను మంది సభ్యులతో దేవస్థానం ప్రధాన అర్చకుడిగా ఉన్న వ్యక్తి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా కూడా కమిటిలో ఉంటారని జీవోలో ప్రభుత్వం వెల్లడించింది. 

గత దసరా ఉత్సవాలకు ముందు ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ పదవి కాలం ముగింది. అయితే అప్పటి నుంచి నూతన కమిటి నియామకం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాల మేరకు అధికార పార్టీకి చెందిన నాయకుల్లో ఉత్సాహం నెలకొంది.

కులాల వారీగా ప్రాధాన్యత

గతంలో ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్‌గా బీసీ వర్గానికి చెందిన పైలా సొమినాయుడును నియమించారు. ఇప్పుడు కూడా పూర్తిగా అధికార పార్టీకి చెందిన నాయకులు, వారి కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వటంతోపాటుగా, కులాల వారీగా సభ్యుల నియామకం జరిగిందనే ప్రచారం జరుగుతుంది. ఈసారి కూడా ఛైర్మన్ పదవిలో బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని నియమించారు. అంతేకాదు గతంలో పని చేసిన ఛైర్మన్ కూడా విజయవాడకు చెందిన వ్యక్తి కాగా ఇప్పుడు కూడా విజయవాడకు చెందిన వ్యక్తికే ఛైర్మన్ పదవిని కేటాయించారు. బీసీ వర్గానికి చెందిన కర్నాటి రాంబాబు ఛైర్మన్‌గా ప్రచారం జరుగతుంది. 

ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో మాత్రం రాంబాబును సభ్యుడిగానే ప్రభుత్వం పేర్కొంది. కమిటి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఛైర్మన్‌ని ఎన్నుకొని అధికారికంగా ప్రకటిస్తారని చెబుతున్నారు. పదిహేను మంది గల కమిటిలో పూర్తి సామాజిక వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ నియామకాలు జరిగినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పూర్తిగా మాజీ మంత్రి మార్క్

దేవాదాయ శాఖలో మాజీ మంత్రి వెలంపల్లి మార్క్ ఇప్పటికి కంటిన్యూ అవుతుందనే ప్రచారం జరుగుతుంది. తాజాగా విడుదలైన దుర్గగుడి పాలక మండలి జాబితా విషయంలో కూడా ఈ విషయం మరోసారి స్పష్టం అయ్యిందని పార్టీలో ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ప్రస్తుతం దేవదాయ శాఖ మంత్రిగా కొట్టు సత్యనారాయణ వ్యవహరిస్తున్నారు. అయితే దుర్గగుడి పాలక మండలి సభ్యుల నియామకంలో ప్రస్తుత మంత్రి జోక్యం లేకుండానే సభ్యుల నియామకం జరిగిందని కూడా చర్చ మొదలైంది. 

దుర్గగుడి ఛైర్మన్ పదవిని విజయవాడకు చెందిన వ్యక్తికి రెండోసారి ఇవ్వటం చర్చకు దారి తీసింది. అది కూడా పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వ్యక్తికే మరోసారి ఛైర్మన్ గిరిని అప్పగించటంపై పార్టీ నేతలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఛైర్మన్ పదవిని అమ్మవారి భక్తులు ఎక్కువగా వచ్చే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేయాలని గతంలో కూడా చాలా డిమాండ్లు వచ్చాయి. అయినా మరోసారి కూడా విజయవాడకు చెందిన వ్యక్తికే ఛైర్మన్ పదవిని కేటాయిచటంపై పార్టీ నేతల్లో  భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధతపై తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం..
ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధతపై తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం..
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
RCB VS SRH Highlights: ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్, చివర్లో అనికేత్ వర్మ మెరుపులు.. RCBకి SRH బిగ్ టార్గెట్
ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్, చివర్లో అనికేత్ వర్మ మెరుపులు.. RCBకి SRH బిగ్ టార్గెట్
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Family Entertainers : వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Revanth Reddy: అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
Embed widget