అన్వేషించండి

Tirumala New Prasadam: భక్తుల కానుకను ప్రసాదంగా తిరిగిస్తున్న టీటీడీ ! చిల్లర కష్టాలు మరి..

శ్రీవారి భక్తులకు టీటీడీ మరో అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. తిరుమలేశుడి కోసం భక్తులు ఇచ్చిన చిల్లరను ధన ప్రసాదంగా అందివ్వాలని నిర్ణయించింది.


కలియుగ వైకుంఠానికి నిత్యం వేలాదిగా భక్తులు దర్శించుకుంటుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కోనేటిరాయునికి ముడుపుల రూపంలోనూ, నగదు, బంగారు వెండి, ఇతర విలువైన వస్తువుల రూపంలో ముడుపులు చెల్లించుకుంటుంటారు. ఇలా స్వామికి భక్తులు సమర్పించే కానుకులు శ్రీవారి ప్రధాన ఆదాయ వనరు.  హుండీ ఆదాయంలో ప్రతీ రోజూ చిల్లర నాణేలు 10 నుంచి 20 లక్షల వరకు లభిస్తుంటాయి. హుండీలో భక్తులు సమర్పించే నగదులో చిల్లర నాణేలు అధికంగా ఉంటాయి. ఇలా భక్తులు ఎంతో భక్తితో సమర్పించే నాణేలే టీటీడీకి పెద్ద కష్టాన్ని తెచ్చి పెడుతున్నాయి. భక్తులు సమర్పించే నాణేలు గుట్టలుగుట్టలుగా పేరుకుపోతున్నాయి. వీటిని ఏమి చేయలో తెలియక టీటీడీ తలలు పట్టుకుంటోంది.
Tirumala New Prasadam: భక్తుల కానుకను ప్రసాదంగా తిరిగిస్తున్న టీటీడీ !  చిల్లర కష్టాలు మరి..

గతంలో శ్రీవారికి భక్తులు సమర్పించిన నాణేలను బ్యాంకుల ద్వారా లెక్కింపు చేసి టీటీడీ పేరున బ్యాంకు ఖాతాలలో డిపాజిట్ చేసేది. అలా ఖాతాలో డిపాజిట్ చేసుకున్న నగదుకు వడ్డీ కూడా బ్యాంకులు చెల్లించేవి. అయితే టీటీడీ అధికారులు 2010లో విధానాన్ని మార్చుకున్నారు. 2010 వరకు తమకు సేవలు అందిస్తూ వస్తున్న బ్యాంకులలో డిపాజిట్ చేస్తు వచ్చిన టీటీడీ.. టెండర్ విధానంలో ఎవరు ఎక్కువ వడ్డీ చెల్లిస్తారో వారి బ్యాంకులలో నగదు డిపాజిట్ చేసే విధానానికి నాంది పలికింది. దీనితో బ్యాంకుల మధ్య పోటీతత్వం పెరిగింది. టీటీడీకి మంచి వడ్డీ వచ్చింది. కానీ అప్పటి వరకూ ఉచితంగా సేవలు అందించిన బ్యాంకులు  తమను వ్యాపార సంస్థలుగా చుస్తున్నపుడు తమెందుకు ఉచితంగా సేవలు అందించాలని బ్యాంకులు తమ సేవలను విరమించుకున్నాయి. 2010 వరకు నెలకు ఒక బ్యాంకు పరకామణిలో లెక్కింపు చేసి తమ బ్యాంకుల్లో టీటీడీ ఖాతాలలో డిపాజిట్ చేసుకొనే వారు.. మారిన నిబంధనలతో ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకులలో నగదును డిపాజిట్ చేస్తుండటంతో ఇతర బ్యాంకుల వద్ద నుంచి టీటీడీకి సహకారం తగ్గింది. అప్పటి పాలకమండలి నిర్ణయాలతో గుట్టలుగా పేరుకుపోయిన చిల్లర నాణేలను తీసుకునేందుకు బ్యాంకులు ముందుకు రాలేదు.
Tirumala New Prasadam: భక్తుల కానుకను ప్రసాదంగా తిరిగిస్తున్న టీటీడీ !  చిల్లర కష్టాలు మరి..

2009లో ఆర్బీఐ బ్యాంకు 25 పైసలు వరకు ఉన్న నాణేలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 25 పైసలలోపు ఉన్న చిల్లర నాణేలను బ్యాంకులలో డిపాజిట్ చేయాలని ఆర్బీఐ సూచించింది. అప్పటి పాలకమండలి, అధికారులు పట్టించుకోలేదు. ఆర్బీఐ గడువు ముగిశాక 30టన్నుల చిల్లర నాణేలు ఉండి పోయాయి.  చేసేది లేక మరో మార్గాని అన్వేషించింది టీటీడీ. నాణేలను కరిగించి స్టీల్ రూపంలో విక్రయించాలని టీటీడీ అధికారులలో ఆలోచన మొదలైంది. ఆర్బీఐ కూడా అనుమతి ఇచ్చింది. టన్నుకు 28 వేల రూపాయలకు చొప్పున సెయిల్ సంస్థకు ఇచ్చింది టీటీడీ.  విదేశీ నాణేలది ఇదే పరిస్థితి దాదాపు 30 టన్నుల నాణేలు గౌడన్ లలో పేరుకు పోయాయి. వాటి విలువ కంటే వాటి తరలింపుకి అయ్యే ఖర్చే ఎక్కువ కావడంతో అలాగే ఉంచేశారు అధికారులు.  ఎన్ని సార్లు ఆర్బీఐని, విదేశీ ఎంబసీ అధికారును టీటీడీ సంప్రదించిన ఫలితం లేకుండా పోయింది. ఇటీవల కొత్త రూల్స్ వచ్చాయి. నోడల్ బ్యాంక్‌కే చిల్లరను తరలించాలి. యూనియన్ బ్యాంక్‌లో విలీనమైన ఆంధ్రాబ్యాంక్ చిల్లర డిపాజిట్ తీసుకునేది. ఆ బ్యాంక్ చిల్లర చెస్ట్ నిండిపోవడంతో 2019 ఏప్రిల్ నెల నుంచి చిల్లర నాణేలు తీసుకోవడం  నిలిపివేసింది.. ఇప్పటికే 30 కోట్ల రూపాయలు విలువ చేసే చిల్లర నాణేలు నిల్వ పేరుకుపోయింది.
Tirumala New Prasadam: భక్తుల కానుకను ప్రసాదంగా తిరిగిస్తున్న టీటీడీ !  చిల్లర కష్టాలు మరి..
   
ఇక ఏ బ్యాంకులోనూ డిపాజిట్ చేసే పరిస్థితి లేకపోవడంతో దీంతో భక్తుల నుంచి వచ్చిన నాణేలను తిరిగి భక్తులకే ఇవ్వాలని టిటిడి నిర్ణయించింది. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు సమర్పించే చిల్లర నాణెలను శ్రీవారి ధనప్రసాదం పేరిట భక్తులకే తిరిగి పంపిణే చేసే వినూత్న కార్యక్రమాన్ని టీటీడీ ప్రారంభించింది.    అతిథి గృహాల రిసెప్షన్ కేంద్రాల్లో చిల్లర నాణెలను 100 రూపాయలు ప్యాకెట్ల రూపంలో ప్రత్యేక కవర్‌లలో ప్యాక్ చేసి భక్తులకు అందజేస్తోంది. భక్తులు గదికి అద్దెను చెల్లించిన సమయంలో అదనంగా కాషన్ డిపాజిట్ కూడా చెల్లిస్తూ ఉండడంతో భక్తులు గదిని ఖాళీ చేసే సమయంలో కాషన్ డిపాజిట్‌ను శ్రీవారి ధనప్రసాదం రూపంలో చెల్లించేలా చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ఒక్క రూపాయి కాయిన్స్‌ ఇస్తుండగా, రానున్న రోజుల్లో 2,5 రూపాయలను  ప్యాకెట్ లను కూడా టీటీడీ భక్తులకు అందుబాటులోకీ తీసుకురానుంది. ఒక వేళ భక్తులు చిల్లర నాణెలను తీసుకునేందుకు ఆసక్తి చూపకపోతే నోట్ల రూపంలో కాషన్ డిపాజిట్‌ను భక్తులకు టిటీడి చెల్లిస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konaseema Politics: తండ్రికి షాక్, కూతురికి టీడీపీ పగ్గాలు! రాజోలులో ర‌స‌వ‌త్త‌రంగా మారిన రాజ‌కీయం..
తండ్రికి షాక్, కూతురికి టీడీపీ పగ్గాలు! రాజోలులో ర‌స‌వ‌త్త‌రంగా మారిన రాజ‌కీయం..
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ ఏరియాలలో తాగునీటి సరఫరా బంద్
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ ఏరియాలలో తాగునీటి సరఫరా బంద్
CAG Report: రెవెన్యూ మిగులు రాష్ట్రాల్లో తెలంగాణ, లోటు రాష్ట్రాల్లో ఏపీ- 2022-23 ఆర్థిక పరిస్థితిపై కాగ్ రిపోర్ట్
రెవెన్యూ మిగులు రాష్ట్రాల్లో తెలంగాణ, లోటు రాష్ట్రాల్లో ఏపీ- 2022-23 ఆర్థిక పరిస్థితిపై కాగ్ రిపోర్ట్
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇటువంటి సర్ప్రైజ్... మిడ్ వీక్ బుర్రబద్దలయ్యే ట్విస్ట్... హౌస్‌లోకి ముగ్గురు కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ
బిగ్ బాస్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇటువంటి సర్ప్రైజ్... మిడ్ వీక్ బుర్రబద్దలయ్యే ట్విస్ట్... హౌస్‌లోకి ముగ్గురు కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ
Advertisement

వీడియోలు

Moon Water Wars : VIPER, Blue Origin & NASA సీక్రెట్ పాలిటిక్స్ | ABP Desam
Quantum Valley Chandrababu Naidu's Next Big Vision | క్వాంటమ్ వ్యాలీ గురించి ఫుల్ డీటైల్స్ ఇదిగో | ABP Desam
Suryakumar Press Meet Ind vs Pak | Asia Cup 2025 | ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Sahibzada Gun Firing Celebration | Asia Cup 2025 | సాహిబ్‌జాదా ఫర్హాన్ గన్ షాట్ సెలబ్రేషన్స్‌
India Pakistan Match | పాక్ కెప్టెన్‌కు చేయి ఇవ్వని సూర్య
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konaseema Politics: తండ్రికి షాక్, కూతురికి టీడీపీ పగ్గాలు! రాజోలులో ర‌స‌వ‌త్త‌రంగా మారిన రాజ‌కీయం..
తండ్రికి షాక్, కూతురికి టీడీపీ పగ్గాలు! రాజోలులో ర‌స‌వ‌త్త‌రంగా మారిన రాజ‌కీయం..
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ ఏరియాలలో తాగునీటి సరఫరా బంద్
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ ఏరియాలలో తాగునీటి సరఫరా బంద్
CAG Report: రెవెన్యూ మిగులు రాష్ట్రాల్లో తెలంగాణ, లోటు రాష్ట్రాల్లో ఏపీ- 2022-23 ఆర్థిక పరిస్థితిపై కాగ్ రిపోర్ట్
రెవెన్యూ మిగులు రాష్ట్రాల్లో తెలంగాణ, లోటు రాష్ట్రాల్లో ఏపీ- 2022-23 ఆర్థిక పరిస్థితిపై కాగ్ రిపోర్ట్
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇటువంటి సర్ప్రైజ్... మిడ్ వీక్ బుర్రబద్దలయ్యే ట్విస్ట్... హౌస్‌లోకి ముగ్గురు కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ
బిగ్ బాస్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇటువంటి సర్ప్రైజ్... మిడ్ వీక్ బుర్రబద్దలయ్యే ట్విస్ట్... హౌస్‌లోకి ముగ్గురు కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ
Maruti WagonR మళ్ళీ దేశంలో నంబర్-1 హ్యాచ్‌బ్యాక్‌ - టాప్‌ 5 లిస్ట్‌ చెక్ చేయండి
Maruti WagonR మళ్లీ నంబర్‌ 1 - టాప్‌ 5 హ్యాచ్‌బ్యాక్‌లు ఇవే!
Acharya Balkrishna Record: ఆచార్య బాలకృష్ణ అరుదైన ఘనత, ప్రపంచంలోని టాప్ సైంటిస్టులలో చోటు- చారిత్రాత్మకమని బాబా రాందేవ్ కితాబు
ఆచార్య బాలకృష్ణ అరుదైన ఘనత, ప్రపంచంలోని టాప్ సైంటిస్టులలో చోటు- చారిత్రాత్మకమని బాబా రాందేవ్ కితాబు
OG Collection: 'ఓజీ' కలెక్షన్స్ @ 50 కోట్లు... విడుదలకు రెండు రోజుల ముందు రికార్డ్స్ బద్దలు!
'ఓజీ' కలెక్షన్స్ @ 50 కోట్లు... విడుదలకు రెండు రోజుల ముందు రికార్డ్స్ బద్దలు!
Nara Lokesh ChitChat: పరకామణి దొంగతనంపై సిట్ విచారణ - అన్నీ బయటకు వస్తాయి - నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
పరకామణి దొంగతనంపై సిట్ విచారణ - అన్నీ బయటకు వస్తాయి - నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
Embed widget