అన్వేషించండి

TTD Chairman BR Naidu శ్రీవారి భక్తులను గందరగోళానికి గురిచేసేలా వ్యాఖ్యలు సరికాదు: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు

Lv subrahmanyam comments on Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల పడిగాపులు తప్పించాలని, వారి సౌకర్యార్థం ఏఐ టెక్నాలజీ వినియోగించాలని నిర్ణయించినట్లు బీఆర్ నాయుడు తెలిపారు.

TTD Chairman BR Naidu | తిరుమల: కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం రెండు, మూడు గంటల్లో చేయించడం అసాధ్యమని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం (Lv subrahmanyam) అభిప్రాయపడ్డారు. ఆదివారం నాడు ఆయన వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఎల్వీ సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టిఫీషియల్ ఇంజెలిజెన్స్ ద్వారా తిరుమలలో ఒక గంటలో స్వామివారి దర్శనం చేయించడం సాధ్యం కాదన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి దర్శనం రెండు, మూడు గంటల్లో చేయించడం సాధ్యం కాదని.. ఏఐ టెక్నాలజీ వేగంగా దర్శనం విధానం ఆలోచనలు విరమించుకోవాలని టీటీడీకి, ఏపీ ప్రభుత్వానికి ఆయన సూచించారు.

‘తిరుమలకు వచ్చి దర్శనం చేసుకున్న క్రమంలో కొందరు భక్తుల మాటలు విన్నాను. త్వరలోనే ఆర్టిఫీషియల్ ఇంజెలిజెన్స్ ద్వారా కేవలం రెండు, మూడు గంటల్లో శ్రీవారి దర్శనం చేయిస్తారని చర్చించుకుంటున్నారు. అయితే భక్తుల రద్దీని గమనిస్తే మూడు గంటల్లో స్వామివారి దర్శనం చేయించడం అసంభవం. మరోవైపు ఇది అంత మంచి ప్రయత్నం కాదు. ఐఏ టెక్నాలజీని ఎంత వాడినా తిరుమల ఆలయంలో కొన్ని పరిమితులు ఉంటాయి. వాటికి బదులుగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, దర్శనానికి సంబంధించిన మరిన్ని సౌలభ్యాలు కల్పించడంపై దృష్టిపెట్టాలని’ టీటీడీకి, ఏపీ ప్రభుత్వానికి ఎల్వీ సుబ్రహ్మణ్యం సూచించారు. 

ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించిన టీటీడీ ఛైర్మన్
టీటీడీ మాజీ ఈవో, మాజీ ఐఏఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. భక్తుల ఇబ్బందులను తొలగించేందుకు ఏఐ టెక్నాలజీ వినియోగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలను బీఆర్ నాయుడు తీవ్రంగా ఖండించారు. తిరుమలలో ఏఐ టెక్నాలజీ వినియోగించవద్దని ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు సరికాదని ఓ ప్రకటన విడుదల చేశారు. 

తిరుమలలో స్వామివారి దర్శనం కోసం వైకుంట క్యూ కాంప్లెక్స్ లో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు గూగుల్, టీసీఎస్ లాంటి సంస్థల సహకారంతో ఏఐ టెక్నాలజీ వినియోగించాలని టీటీడీ నిర్ణయం తీసుకుందన్నారు. కేవలం 2 గంటల్లోనే భక్తులకు శ్రీవారి దర్శనం చేయించాలని టీటీడీ చేస్తున్న ప్రయత్నాలు, ఐఏ టెక్నాలజీపై అవగాహన లేకుండా ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు బాధాకరం అన్నారు. భక్తుల్లో ఆందోళన కలిగించేలా టీటీడీ మాజీ ఈవో మాట్లాడం సమంజసం కాదన్నారు. భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండకుండా ఏఐ టెక్నాలజీ ద్వారా వారి ఇబ్బందులు తొలగించాలని చూడటంలో ఏ తప్పులేదని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

India- New Zealand Trade Deal: భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Deputy CM Pawan Kalyan: ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
Bollywood Actress: ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ
ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ

వీడియోలు

Nidhhi Agerwal Samantha Anasuya Incidents | హీరోయిన్లతో అసభ్య ప్రవర్తన..ఎటు పోతోంది సమాజం | ABP Desam
India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India- New Zealand Trade Deal: భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Deputy CM Pawan Kalyan: ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
Bollywood Actress: ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ
ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ
Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 మూవీస్... డ్యూడ్, కొన్ని వారాలుగా ట్రెండింగ్ ఫిల్మ్స్‌ లిస్ట్ ఇదుగో
నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 మూవీస్... డ్యూడ్, కొన్ని వారాలుగా ట్రెండింగ్ ఫిల్మ్స్‌ లిస్ట్ ఇదుగో
Telangana Assembly Sessions: ఈ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు? జలాల అంశంపై స్పెషల్ సెషన్.. హీటెక్కిన వాటర్ పాలిటిక్స్
ఈ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు? జలాల అంశంపై స్పెషల్ సెషన్.. హీటెక్కిన వాటర్ పాలిటిక్స్
క్రికెటర్ల జీతాలు పెంచిన BCCI, ఇప్పుడు ఒకరోజు ఆడితే ఎంత మనీ వస్తుందంటే
క్రికెటర్ల జీతాలు పెంచిన BCCI, ఇప్పుడు ఒకరోజు ఆడితే ఎంత మనీ వస్తుందంటే
Bhu Bharati Portal: భూభారతి పోర్టల్‌లో విప్లవాత్మక మార్పులు.. ఒక్క క్లిక్‌తో రైతుల‌కు పూర్తి భూ స‌మాచారం
భూభారతి పోర్టల్‌లో విప్లవాత్మక మార్పులు.. ఒక్క క్లిక్‌తో రైతుల‌కు పూర్తి భూ స‌మాచారం
Embed widget