అన్వేషించండి

Tirumala News: నేటి నుంచి భక్తులకు అందుబాటులోకి తిరుమల శ్రీవారి పుష్కరిణి

Srivari Pushkarini: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్బంగా ఆగష్టు 1న మూసివేసిన శ్రీవారి పుష్కరిణి నెల రోజుల తరువాత పునప్రారంభం కానుంది. పుష్కరిణి హరతితో పాటు భక్తులను పుష్కరిణి లోకి అనుమతిస్తారు.

Tirumala News | తిరుమల శ్రీవారి పుష్కరిణి నెల రోజుల తరువాత భక్తులకు అందుబాటులోకి రానుంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 1 నుంచి పుష్కరిణి లోకి భక్తులను అనుమతించడం నిలిపివేసారు. స్వామి వారి పుష్కరిణిలోని నీటిని తీసివేసి అడుగు భాగంలో ఉన్న ఇసుక, పాచిని సుమారు 100 మంది పారిశుధ్య కార్మికులు రాత్రి పగలు కష్టపడి శుభ్రం చేశారు.  పుష్కరిణి మెట్లకు బంగారు రంగులు వేయడంతో కొత్త అందం వచ్చింది. అనంతరం కోటి లీటర్ల నీటితో పుష్కరిణిని నింపారు.

పుష్కరిణి హారతి
తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి రోజు పుష్కరిణి హారతి జరిగేది. పుష్కరిణి మరమ్మతులు కారణంగా ఆగస్టు 1 నుంచి 31 వ తేదీ వరకు పుష్కరిణి హారతి ని టీటీడీ నిలిపివేసింది. సెప్టెంబర్ 1 నుంచి భక్తులను పుష్కరిణిలో స్నానం కోసం అనుమతించడం తో పాటు పుష్కరిణి హారతిని తిరిగి ప్రారంభించనున్నారు.

4వ విడత శుక్ల యజుర్వేద పారాయణం

లోక కళ్యాణార్థం టీటీడీ నిర్వహిస్తున్న చతుర్వేద పారాయణం లో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో 4వ విడత శుక్ల యజుర్వేద పారాయణం ప్రారంభించనున్నారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ప్రతిరోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు మధ్య వేద పండితులు శుక్ల యజుర్వేద పారాయణం చేయనున్నారు. జులై 1న ప్రారంభమైన సామవేద పారాయణం ఆగస్టు 31తో ముగిసింది.

తిరుమలలో విశేష పర్వదినాలు

కలియుగ వైకుంఠమైన తిరుమలలో సెప్టెంబరు నెలలో విశేష పర్వదినాలు వివరాలు ఇలా  ఉన్నాయి. 

- సెప్టెంబరు 5న బలరామ జయంతి, వరాహ జయంతి.

- సెప్టెంబరు 7న వినాయక చవితి. తిరుమల రెండు ఘాట్ రోడ్స్ లోని వినాయక స్వామి వారి ఆలయాలో చవితి వేడుకలు జరుగుతాయి.

- సెప్టెంబరు 17న అనంత ప‌ద్మ‌నాభ వ్ర‌తం.

- సెప్టెంబరు 18న పౌర్ణమి శ్రీవారి గరుడసేవ.

- సెప్టెంబరు 28న సర్వ ఏకాదశి జరుగుతుంది. 

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

 తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో సెప్టెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. -  సెప్టెంబరు 3న అమావాస్య సందర్భంగా ఉదయం 8 గంటలకు సహస్ర కలశాభిషేకం చేపడతారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.

 - సెప్టెంబరు 7, 14, 21, 28వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు.

-    సెప్టెంబరు 18న పౌర్ణమి సందర్భంగా ఉదయం 8.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు ఆస్థానం చేపడతారు.

-   సెప్టెంబరు 26న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం జరుగనుంది. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6.30 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Viral News:
"గుండెల నిండా దమ్ముతో ఎదురించాలి, జెండా ఎగరేయాలి" జనసేన ఆవిర్భావం రోజున ఓ బామ్మ కామెంట్స్ వైరల్‌!
Kadapa Crime News: ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి.. భార్యకు చెబుతూ సూసైడ్ వీడియో రికార్డు చేసిన భర్త !
ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి.. భార్యకు చెబుతూ సూసైడ్ వీడియో రికార్డు చేసిన భర్త !
Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు, CBIకి చెప్పాలని సూచన
తిరుమల లడ్డూ వివాదంపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు, CBIకి చెప్పాలని సూచన

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget