అన్వేషించండి

Tirumala News: తిరుమలలో శాంతి హోమం ఎలా నిర్వహిస్తారు, పంచగవ్యాలతో ప్రోక్షణం

Tirumala News: తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డూ కల్తీ వివాదంపై టీటీడీ ఆగమ సలహా మండలి ఏ నిర్ణయం తీసుకుని శాంతి హోమం ఒక్కరోజు నిర్వహించేందుకు సిద్దమైంది.

Tirumala News: తిరుమల శ్రీవారి దర్శనం కోసం పరితపించే భక్తులకు.. స్వామి వారి లడ్డూ ప్రసాదం కల్తీ అయ్యింది అంటేనే తట్టుకోవడం కష్టం. అలాంటిది ఏకంగా లడ్డూలు వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని చెప్పడం అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. భక్తులకు వాటి నుంచి పరిష్కారం చూపేందుకు టీటీడీ ఆగమ సలహా మండలి నిర్ణయం ప్రకటించింది.

మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏడాది పాటు అర్చకుల, ఉద్యోగులు, సిబ్బంది, భక్తుల వల్ల తెలిసి లేదా తెలియక జరిగే అపచారాలకు పరిష్కారం గా టీటీడీ వైఖానస ఆగమ సాంప్రదాయ పద్ధతిలో మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు 15 నుంచి 17 వరకు ఆలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలిరోజు పవిత్ర ప్రతిష్ట, రెండో రోజు పవిత్ర సమర్పణ, మూడో రోజు పూర్ణాహుతి, పవిత్ర వితరణ చేపట్టారు. లడ్డూ వివాదం చోటు చేసుకుందని టీటీడీ వారు చెబుతున్న ప్రకారం జులై నెలలో కాబట్టి ఆగస్టు నెల లో జరిగిన పవిత్రోత్సవాలతో ఆ దోషం పోయింటుందని ఆగమ సలహా మండలి, జీయంగార్లు, అర్చకులు టీటీడీ ఈవో శ్యామల రావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడుకి తెలియజేశారు.

త్వరలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో త్వరలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అంతకుముందు వచ్చే మంగళవారం అంటే అక్టోబర్ 1వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఆలయం లోని ప్రతి వస్తువు, గర్భాలయం, గోడలు, పై కప్పు, ఉప ఆలయాలు ఇలా అన్నింటిని నీటితో శుభ్రం చేస్తారు. ఆ తరువాత వివిధ సుగంధ ద్రవ్యాలతో కలగలిపిన మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణ చేస్తారు. ఇది కూడా ఆలయ శుద్ధి కిందకి వస్తుంది. అయితే లడ్డూ వివాదం శాస్త్ర బద్దంగా తొలగిపోయినా.. శ్రవణం ( వినడం) ద్వారా పాప దోషం పోవడానికి, భక్తుల్లో ధైర్యం నింపేందుకు టీటీడీ ఆగమ సలహా మండలి శాంతి హోమం నిర్వహించాలని తలపెట్టింది.
Also Read: Chandrababu On Tirumala Laddu: వెంకటేశ్వరస్వామి వాళ్ల అకౌంట్స్ సెటిల్ చేస్తాడు - లడ్డూ వివాదంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

శాంతి హోమం నిర్వహణ
తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి సమీపంలో ఉన్న యాగశాలలో ఈ 23న సోమవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఈ శాంతి హోమం నిర్వహిస్తారు. ఇందులో మూడు హోమం గుండాలను ఏర్పాటు చేసి అందులో శాంతి హోమం చేపడుతారు. వాస్తు హోమం జరగనుంది. లడ్డూ తయారు చేసే పోటులోని శ్రీకృష్ణ స్వామి వారి సహా పోటును, అన్నప్రసాదాల తయారీ వద్ద పంచగవ్యాలతో ప్రోక్షణం చేయనున్నారు. ఇందుకోసం 8 మంది తిరుమల శ్రీవారి ఆలయంలోని అర్చకులు, ఆగమ సలహాదారులు హోమం నిర్వహిస్తారు. టీటీడీ అధికారులు వాటిని పర్యవేక్షిస్తారు.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 వ తేదీ వరకు జరుగుతాయి. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను వేరువేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు టీటీడీ ఈవో శ్యామల రావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి అందజేసి ఆహ్వానం పలుకారు. 

Also Read: Tirupati Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Gujarat stock market scam: స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
Kalvakuntla Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
Embed widget