అన్వేషించండి

Chandrababu On Tirumala Laddu: వెంకటేశ్వరస్వామి వాళ్ల అకౌంట్స్ సెటిల్ చేస్తాడు - లడ్డూ వివాదంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh News | తిరుమలలో గత ఐదేళ్లలో అన్ని వ్యవస్థల్ని నాశనం చేశారని, వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Chandrababu sensational comments on Tirumala Laddu controversy | అమరావతి: తిరుమల శ్రీవారి ప్రసాదాలలో కల్తీ చేసి ఘోరమైన అపచారం చేశారని గత వైసీపీ పాలకులపై ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. టీటీడీ అధికారులు గుజరాత్ కు పంపిన నెయ్యి శాంపిల్స్ పరీక్షించగా ఆవు కాకుంగా ఇతర జంతువుల కొవ్వు కలిసినట్లు రిపోర్టులో బహిర్గతమైంది. కూటమి ప్రభుత్వం తమపై దుష్ప్రచారం చేస్తోందని మాజీ సీఎం జగన్ సైతం ఘాటుగానే స్పందించారు. ప్రధాని మోదీ స్పందించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి తిరుమలపై జరుగుతున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ రాసిన లేఖలో కోరారు.

ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతి వివాదంపై మరోసారి స్పందించారు. ఆదివారం రాత్రి ఉండవల్లిలోని ఆయన నివాసంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వెళ్తుండగా అప్పుడే నామీద దాడి జరిగింది. అదొక మిరాకిల్. 24 క్లైమోర్ మైన్స్ తో దాడి జరిగితే సాక్షాత్తూ భగవంతుడే నన్ను కాపాడాడు. లేకపోతే బతికే అవకాశమే లేదు. దాన్ని నేను పునర్జన్మగా భావిస్తాను. అందుకే ఏ పనిచేసినా రెండు నిమిషాలు వెంకటేశ్వరస్వామిని తలుచుకుంటాను. స్వామి వారితో ఇలాంటి అనుబంధం, భక్తి ఉన్న సమయంలో అపచారం జరిగింది. వెంకటేశ్వరస్వామి అకౌంట్స్ సెటిల్ చేస్తాడు. వైఎస్సార్ హయాంలో 7 కొండలను 5 కొండలు అనడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాను. ఆ తరువాత నేను పాదయాత్ర చేశాను. 

వెంకటేశ్వరస్వామి అంటే ఓ అద్భుతం. తిరుమల వెళ్లి కొండెక్కితే ఓ గమ్మత్తు. మైమరచిపోతాం. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవకు వెళ్తే వైకుంఠం ఇంత ప్రశాంతంగా ఉంటుందా అనిపిస్తుంది. అలాంటి స్ఫూర్తిని ఇచ్చే పవిత్రమైన ప్రదేశం, క్షేత్రం తిరుమల. అలాంటి పవిత్రమైన క్షేత్రం తిరుమలలో గత ఐదేళ్లు రాజకీయాలకు పునరావాసం. భక్తుల మనోభావాలకు విలువ లేదు. ప్రసాదంలో, నాణ్యతలో ఎక్కడికక్కడా అపవిత్రం చేశారు. భక్తులు ఎన్నోసార్లు ఆందోళన చేశారు. ముఖ్యమంత్రిగా కాదు, ఓ భక్తుడిగా చెబుతున్నాను. వెంకటేశ్వరస్వామి లడ్డూకు ప్రత్యేకత ఉంది. 300 ఏళ్ల నుంచి భక్తులు పవిత్రంగా స్వీకరిస్తున్నారు. నాణ్యతలేని సరుకులు ఎక్కడా వాడరు. ఇచ్చేవారు సైతం దేవుడికి అని పవిత్రమైన భక్తి భావనతో సరుకులు ఇస్తారు. మంచి వాసనతో లడ్డూనే కాదు జిలేబి, వడ, పొంగలి.. ఇలా దేనికదే ప్రత్యేకత ఉంటుంది.

తిరుమల కొండపై భోజనం చేస్తే ఓ మంచి అనుభూతి కలుగుతుంది. ఎలాంటి పదార్థాలు వాడతారు, హెలికాప్టర్ తో సీడ్ బాల్స్ వేపించాను. 9 ఏళ్లు ఎప్పుడు వెళ్లినా సమీక్షలు చేపించి వివరాలు సేకరించాను. రాందేవ్ బాబాతో తిరుపతి ఆయుర్వేదాన్ని లింక్ చేసి మెడిసిన్ ప్లాంటింగ్ చేశాం. వెంకటేశ్వరస్వామి వద్ద ఎటు చూసినా ఆ చెట్లతో పచ్చదనం, ఆధ్యాత్మిక ఉంటుంది. తిరుమల లడ్డూకు చాలా డిమాండ్.  155 గ్రాముల లడ్డూ తయారీకి 40 గ్రాముల ఆవు నెయ్యి, 40 గ్రాముల శనగపిండి, ఇతర పదార్థాలతో చేయగా సువాసన వస్తుంది. జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ గా తిరుమల లడ్డూకు 2009లో పేటెంట్ పొందాం. ఇలాంటి పదార్థాన్ని మరెక్కడా ఉండదు. ఆ పవిత్రతను మనం కాపాడాలి.

అలాంటి తిరుమల శ్రీవారి వద్ద ఇష్టానుసారంగా ట్రస్ట్ బోర్డ్ నియామకం గ్యాంబ్లింగ్ గా మారింది. 50 వరకు నామినేషన్లకు వెళ్తే హైకోర్టులో స్టే వచ్చే పరిస్థితి. తిరుమల కొండపై వ్యాపారం చేశారు. స్వామివారి టికెట్లు ఇష్టానుసారంగా అమ్మి సొమ్ముచేసుకున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ సైతం పోరాటం చేశారు. మేం వెళితే అలిపిరి వద్దే ఆపితే నిరసన తెలిపామని గుర్తు చేశారు. అన్యమతస్తులకు టీటీడీలో ప్రాధాన్యం ఇచ్చారు. టీటీడీ ఛైర్మన్ లుగా నియమించారు. రాజకీయ పలుకుబడికి టీటీడీలో వినియోగించారు. వైసీపీ అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ పేరుతో కండీషన్ 18 పేరుతో 3 ఏళ్లు అనుభవం ఉండాలన్న దాన్ని 1 ఏడాదికి తగ్గించారు. డైరీ పెట్టిన ఏడాదిలోనే నెయ్యి సరఫరా చేపించారు. 4 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి చేయాలన్న నిబంధన ఉంటే, ఎవరైనా సరఫరా చేసేలా మార్చేశారు. 8 టన్నుల మార్కెట్ లో ఉత్పత్తి చేయాలన్న నిబంధన ఉంటే దాన్ని తొలగించాలి. 12 టన్నుల ఉత్పత్తిని 8 టన్నులుగా మార్చారు. 3 ఏళ్ల అనుభవం ఉండాలన్న నిబంధనను ఏడాదికి తీసుకొచ్చారు. రూ.250 కోట్ల కనీసం టర్నోవర్ ఉండాలన్న రూల్ ను రూ.150 కోట్లకు తగ్గించారని’ సీఎం చంద్రబాబు వివరించారు. 

Also Read: Tirumala Laddu News: తప్పు చేస్తే రక్తం కక్కుకుని చావాలి - తిరుమల లడ్డూ వివాదంపై భూమన సంచలన వ్యాఖ్యలు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

RS 20000 Subsidy For BCs: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..సోలార్ ప్యానల్ ఏర్పాటుపై 20వేల రాయితీ!
బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..సోలార్ ప్యానల్ ఏర్పాటుపై 20వేల రాయితీ!
Breaking News: తెలంగాణలో డోర్స్ ఓపెన్ చేయండి! బీజేపీ నేతలకు నడ్డా దిశానిర్దేశం!
తెలంగాణలో డోర్స్ ఓపెన్ చేయండి! బీజేపీ నేతలకు నడ్డా దిశానిర్దేశం!
MS Raju vs Thopudurthi Prakash Reddy: అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
Chandra Babu On Ravan: రావణ్ లాంటి వ్యక్తులకు గొడ్డలి పార్టీ ఆర్థిక సాయం చేస్తోంది! బనగానపల్లెలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
రావణ్ లాంటి వ్యక్తులకు గొడ్డలి పార్టీ ఆర్థిక సాయం చేస్తోంది! బనగానపల్లెలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MS Raju vs Thopudurthi Prakash Reddy: అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Sai Pallavi : కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
Embed widget