అన్వేషించండి

Chandrababu On Tirumala Laddu: వెంకటేశ్వరస్వామి వాళ్ల అకౌంట్స్ సెటిల్ చేస్తాడు - లడ్డూ వివాదంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh News | తిరుమలలో గత ఐదేళ్లలో అన్ని వ్యవస్థల్ని నాశనం చేశారని, వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Chandrababu sensational comments on Tirumala Laddu controversy | అమరావతి: తిరుమల శ్రీవారి ప్రసాదాలలో కల్తీ చేసి ఘోరమైన అపచారం చేశారని గత వైసీపీ పాలకులపై ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. టీటీడీ అధికారులు గుజరాత్ కు పంపిన నెయ్యి శాంపిల్స్ పరీక్షించగా ఆవు కాకుంగా ఇతర జంతువుల కొవ్వు కలిసినట్లు రిపోర్టులో బహిర్గతమైంది. కూటమి ప్రభుత్వం తమపై దుష్ప్రచారం చేస్తోందని మాజీ సీఎం జగన్ సైతం ఘాటుగానే స్పందించారు. ప్రధాని మోదీ స్పందించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి తిరుమలపై జరుగుతున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ రాసిన లేఖలో కోరారు.

ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతి వివాదంపై మరోసారి స్పందించారు. ఆదివారం రాత్రి ఉండవల్లిలోని ఆయన నివాసంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వెళ్తుండగా అప్పుడే నామీద దాడి జరిగింది. అదొక మిరాకిల్. 24 క్లైమోర్ మైన్స్ తో దాడి జరిగితే సాక్షాత్తూ భగవంతుడే నన్ను కాపాడాడు. లేకపోతే బతికే అవకాశమే లేదు. దాన్ని నేను పునర్జన్మగా భావిస్తాను. అందుకే ఏ పనిచేసినా రెండు నిమిషాలు వెంకటేశ్వరస్వామిని తలుచుకుంటాను. స్వామి వారితో ఇలాంటి అనుబంధం, భక్తి ఉన్న సమయంలో అపచారం జరిగింది. వెంకటేశ్వరస్వామి అకౌంట్స్ సెటిల్ చేస్తాడు. వైఎస్సార్ హయాంలో 7 కొండలను 5 కొండలు అనడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాను. ఆ తరువాత నేను పాదయాత్ర చేశాను. 

వెంకటేశ్వరస్వామి అంటే ఓ అద్భుతం. తిరుమల వెళ్లి కొండెక్కితే ఓ గమ్మత్తు. మైమరచిపోతాం. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవకు వెళ్తే వైకుంఠం ఇంత ప్రశాంతంగా ఉంటుందా అనిపిస్తుంది. అలాంటి స్ఫూర్తిని ఇచ్చే పవిత్రమైన ప్రదేశం, క్షేత్రం తిరుమల. అలాంటి పవిత్రమైన క్షేత్రం తిరుమలలో గత ఐదేళ్లు రాజకీయాలకు పునరావాసం. భక్తుల మనోభావాలకు విలువ లేదు. ప్రసాదంలో, నాణ్యతలో ఎక్కడికక్కడా అపవిత్రం చేశారు. భక్తులు ఎన్నోసార్లు ఆందోళన చేశారు. ముఖ్యమంత్రిగా కాదు, ఓ భక్తుడిగా చెబుతున్నాను. వెంకటేశ్వరస్వామి లడ్డూకు ప్రత్యేకత ఉంది. 300 ఏళ్ల నుంచి భక్తులు పవిత్రంగా స్వీకరిస్తున్నారు. నాణ్యతలేని సరుకులు ఎక్కడా వాడరు. ఇచ్చేవారు సైతం దేవుడికి అని పవిత్రమైన భక్తి భావనతో సరుకులు ఇస్తారు. మంచి వాసనతో లడ్డూనే కాదు జిలేబి, వడ, పొంగలి.. ఇలా దేనికదే ప్రత్యేకత ఉంటుంది.

తిరుమల కొండపై భోజనం చేస్తే ఓ మంచి అనుభూతి కలుగుతుంది. ఎలాంటి పదార్థాలు వాడతారు, హెలికాప్టర్ తో సీడ్ బాల్స్ వేపించాను. 9 ఏళ్లు ఎప్పుడు వెళ్లినా సమీక్షలు చేపించి వివరాలు సేకరించాను. రాందేవ్ బాబాతో తిరుపతి ఆయుర్వేదాన్ని లింక్ చేసి మెడిసిన్ ప్లాంటింగ్ చేశాం. వెంకటేశ్వరస్వామి వద్ద ఎటు చూసినా ఆ చెట్లతో పచ్చదనం, ఆధ్యాత్మిక ఉంటుంది. తిరుమల లడ్డూకు చాలా డిమాండ్.  155 గ్రాముల లడ్డూ తయారీకి 40 గ్రాముల ఆవు నెయ్యి, 40 గ్రాముల శనగపిండి, ఇతర పదార్థాలతో చేయగా సువాసన వస్తుంది. జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ గా తిరుమల లడ్డూకు 2009లో పేటెంట్ పొందాం. ఇలాంటి పదార్థాన్ని మరెక్కడా ఉండదు. ఆ పవిత్రతను మనం కాపాడాలి.

అలాంటి తిరుమల శ్రీవారి వద్ద ఇష్టానుసారంగా ట్రస్ట్ బోర్డ్ నియామకం గ్యాంబ్లింగ్ గా మారింది. 50 వరకు నామినేషన్లకు వెళ్తే హైకోర్టులో స్టే వచ్చే పరిస్థితి. తిరుమల కొండపై వ్యాపారం చేశారు. స్వామివారి టికెట్లు ఇష్టానుసారంగా అమ్మి సొమ్ముచేసుకున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ సైతం పోరాటం చేశారు. మేం వెళితే అలిపిరి వద్దే ఆపితే నిరసన తెలిపామని గుర్తు చేశారు. అన్యమతస్తులకు టీటీడీలో ప్రాధాన్యం ఇచ్చారు. టీటీడీ ఛైర్మన్ లుగా నియమించారు. రాజకీయ పలుకుబడికి టీటీడీలో వినియోగించారు. వైసీపీ అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ పేరుతో కండీషన్ 18 పేరుతో 3 ఏళ్లు అనుభవం ఉండాలన్న దాన్ని 1 ఏడాదికి తగ్గించారు. డైరీ పెట్టిన ఏడాదిలోనే నెయ్యి సరఫరా చేపించారు. 4 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి చేయాలన్న నిబంధన ఉంటే, ఎవరైనా సరఫరా చేసేలా మార్చేశారు. 8 టన్నుల మార్కెట్ లో ఉత్పత్తి చేయాలన్న నిబంధన ఉంటే దాన్ని తొలగించాలి. 12 టన్నుల ఉత్పత్తిని 8 టన్నులుగా మార్చారు. 3 ఏళ్ల అనుభవం ఉండాలన్న నిబంధనను ఏడాదికి తీసుకొచ్చారు. రూ.250 కోట్ల కనీసం టర్నోవర్ ఉండాలన్న రూల్ ను రూ.150 కోట్లకు తగ్గించారని’ సీఎం చంద్రబాబు వివరించారు. 

Also Read: Tirumala Laddu News: తప్పు చేస్తే రక్తం కక్కుకుని చావాలి - తిరుమల లడ్డూ వివాదంపై భూమన సంచలన వ్యాఖ్యలు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
Anakapalle Viral News: అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
Sajjanar Warnings: హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
Bhogapuram International Airport :
"ఉత్తరాంధ్రాకు రాజభోగాపురం" కొత్త ఎయిర్‌పోర్టులో జనవరి 4న తొలి విమానం ల్యాండింగ్

వీడియోలు

Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam
Shreyas Iyer Rapid Weight Loss | న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు అయ్యర్ దూరం.? | ABP Desam
Liam Livingstone England T20 World Cup Squad | సన్ రైజర్స్ తప్పు చేసిందా..ఇంగ్లండ్ విస్మరించిందా.? | ABP Desam
Ind w vs SL w 5th T20 Highlights | ఐదో టీ20లోనూ జయభేరి మోగించిన భారత మహిళల జట్టు | ABP Desam
Daksharamam Lord Shiva Idol Vandalised | ద్రాక్షారామం కోనేరు వద్ద శివలింగం ధ్వంసం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
Anakapalle Viral News: అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
Sajjanar Warnings: హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
Bhogapuram International Airport :
"ఉత్తరాంధ్రాకు రాజభోగాపురం" కొత్త ఎయిర్‌పోర్టులో జనవరి 4న తొలి విమానం ల్యాండింగ్
Year Ender 2025: పోస్టు కార్డు నుంచి టీవీ వరకు - డిజిటల్‌ విప్లవంతో జ్ఞాపకాల పెట్టేలో చేరిన వస్తువులు ఇవే!
పోస్టు కార్డు నుంచి టీవీ వరకు - డిజిటల్‌ విప్లవంతో జ్ఞాపకాల పెట్టేలో చేరిన వస్తువులు ఇవే!
Happy New Year 2026: ఆక్లాండ్‌లో 2026 ఎంట్రీ - మిన్నంటిని సంబరాలు - అందరి నోటా హ్యాపీ న్యూఇయర్ - వీడియోలు
ఆక్లాండ్‌లో 2026 ఎంట్రీ - మిన్నంటిని సంబరాలు - అందరి నోటా హ్యాపీ న్యూఇయర్ - వీడియోలు
Bank fraud case: ఇండియాలో బ్యాంకుల్ని ముంచి లండన్‌లో ఆస్తులు కొన్న మోసగాళ్లు - జప్తు చేసేసిన ఈడీ - విదేశాల్లోనూ వదలరు !
ఇండియాలో బ్యాంకుల్ని ముంచి లండన్‌లో ఆస్తులు కొన్న మోసగాళ్లు - జప్తు చేసేసిన ఈడీ - విదేశాల్లోనూ వదలరు !
Draksharamam Shivalingam case: పూజారిపై కోపంతో శివలింగం ధ్వంసం -ఎంత పని చేశావు శ్రీనివాసూ ?
పూజారిపై కోపంతో శివలింగం ధ్వంసం -ఎంత పని చేశావు శ్రీనివాసూ ?
Embed widget