అన్వేషించండి

Tirupati Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

Tirumala Laddu Controversy | తిరుమలలో ప్రసాదాలను కల్తీ నెయ్యితో తయారుచేశారని, టీటీడీలో ఇంకా జరిగిన అపచారాలపై సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

SIT to investigate on Tirumala ghee adulteration | అమరావతి: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమలలో ప్రసాదాల కల్తీ అంశంపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తిరమలలో కల్తీ నెయ్యితో ప్రసాదాల తయారీతో స్వామివారి పవిత్రతను దెబ్బతీయడాన్ని సీఎం చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. తిరుమల వివాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టేందుకు సిట్ ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) ప్రకటించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో తిరుమలలో ఇంకా ఏం తప్పిదాలు జరిగాయో ఐజీ స్థాయి అధికారితో దర్యాప్తు చేపిస్తామని చెప్పారు. సిట్ నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వెంకటేశ్వరస్వామి పవిత్ర క్షేత్రం తిరుమలకు పూర్వవైభవం తీసుకొస్తామన్నారు.

ఆలయాలపై, అధికార దుర్వినియోగంపై సిట్ దర్యాప్తు

ఐజీ లేక అంతకంటే ఉన్నతస్థాయి అధికారితో ఏర్పాటు చేయనున్న ఈ సిట్ తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వు, అధికార దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. భవిష్యత్తులో ఆలయాలపై, ప్రసాదాలపై ఇలాంటి తప్పిదాలు, అపచారం జరగకుండా.. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఆలయానికి ఓ నియమం, కొన్ని నిబంధనలు ఉంటాయి. కనుక వాటిని గౌరవిస్తూనే, అంతా సక్రమంగా ఉండేలా నిబంధనలు తీసుకొస్తాం. ఏ మతానికి సంబంధించిన ప్రార్థనాలయాలు, ఆలయాలలో ఆ మతానికి సంబంధించిన వారినే నియమించాలి. ఆ మతంపై నమ్మకం ఉన్నవారే, మతానికి చెందిన వారిని మేనేజ్ మెంట్ బోర్డులో ఉండేలా చూస్తాం. నేరస్తులు, సంఘ విద్రోహక శక్తులకు ఇలాంటి పవిత్రమైన ప్రార్థనాలయాలు ఆలయాలు, మసీదులు, చర్చిలలో చోటు లేకుండా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. మతసామరస్యాన్ని కాపాడుకుంటూనే ఇతర మతాల వారిని ఇబ్బంది పెట్టకుండా అవసరమైతే ఓ ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని పేర్కొన్నారు. 

పాపపరిహారం కోసం నిర్ణయంపై సీఎం ప్రకటన
స్వామివారే తన పూర్వవైభవం కాపాడుకుంటారు. మనం ఇందుకోసం చేయాల్సిందేమీ లేదు. టీటీడీ ఇప్పటికే రెండు పార్టులు. ఆగస్టు 15న బ్రహ్మోత్సవాలకు మునుపే ఓ పవిత్రమైన యాగం చేస్తారు. తెలిసో తెలియకో చేసిన తప్పిదాలను మన్నించాలని స్వామివారిని ప్రార్థిస్తూ మూడు రోజులపాటు యాగం చేస్తారు. అప్పటికే ఏఆర్ కంపెనీ నుంచి వచ్చిన నెయ్యిని వాడారు. ఆ నెయ్యి శాంపిల్స్ పంపిస్తే పరీక్షించిన అనంతరం తప్పిదం జరిగిందని తేలింది. దాంతో ఆగమసలహా మండలి సమావేశమై ఆలయప్రోక్షణపై ఏం చేస్తే బాగుంటుందని సుదీర్ఘంగా చర్చించారు. శాంతిహోమం చేయాలని ఓ నిర్ణయానికి వచ్చారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, పంచగవ్య ప్రోక్షణ నిర్వహించనున్నారు. గోవు నెయ్యి, పాలతో ప్రోక్షణ చేయాలని నిర్ణయించినట్లు చంద్రబాబు తెలిపారు. అన్ని ఆలయాలలో తనిఖీలు చేసి, ఎక్కడైనా తప్పిదం జరిగితే పరిహారం చేయాలని సూచించారు. గతంలో యాగాలు, ప్రత్యేక పూజలు చేయకపోతే ఇప్పుడు చెక్ చేసుకుని చర్యలు తీసుకోవాలని మంత్రికి సూచించినట్లు చెప్పారు.

Also Read: Chandrababu On Tirumala Laddu: వెంకటేశ్వరస్వామి వాళ్ల అకౌంట్స్ సెటిల్ చేస్తాడు - లడ్డూ వివాదంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget