అన్వేషించండి

Tirumala Hundi Collection: కరోనా తర్వాత భారీగా పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం!

Tirumala Hundi Collection: టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శ్రీవారి హుండీ ఆదాయం విపరీతంగా పెరిగిపోయింది. గత కొన్ని నెలలుగా వంద కోట్ల మార్కును దాటింది. 

Tirumala Hundi Collection: ఆపద్భాంధవుడు అనాథ రక్షకుడైన వేంకటేశ్వరుడి దర్శనార్ధం ప్రతి నిత్యం దేశ విదేశాల నుంచి భక్తులు వివిధ రూపాల్లో తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. ఇలా చేరుకున్న భక్తులు తమ కోరిన కోర్కెలు నెరవేరడంతో ముందుగా తలనీలాలు సమర్పించి, స్వామి వారిపై భక్తి భావంతో తమ స్ధోమతకు తగ్గట్టుగా కానుకలు సమర్పిస్తుంటారు. హుండీ ద్వారా మాత్రమే కాకుండా భారీ విరాళాలు, భూములు, బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, స్ధిరాస్తులు సైతం శ్రీవారికి కానుకగా అందిస్తుంటారు.

కరోనా సమయంలో పరిమిత సంఖ్యలోనే భక్తులను స్వామి దర్శనం భాగ్యం కల్పించింది టిటిడి. పూర్తి స్ధాయిలో కరోనా ఉపధృవం తగ్గడంతో భారీగా భక్తులు తిరుమల యాత్రకు క్యూ కడుతున్నారు. దీంతో ఏడుకొండలు ప్రతినిత్యం భక్త జన సంద్రంగా మారుతుంది. కిలోమీటర్ల మేర భక్తులు స్వామి వారి క్షణకాల దర్శన భాగ్యం కోసం గంటల తరబడి వేచి ఉండి స్వామి వారి ఆశీస్సులు పొంది ముడుపులు చెల్లించుకుంటున్నారు. ఇక కరోనా తర్వాత అంతకంతకూ శ్రీవారి హుండీ ఆదాయం పెరుగుతూ వస్తోంది. ఈ నేపధ్యంలోనే గత కొన్ని నెలలుగా నెలకు వంద కోట్ల మార్కును దాటి టీటీడీ అధికారులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

కరోనా సమయంలో వార్షిక బడ్జెట్ అంచనాను చేరుకోలేకపోయిన టీటీడీ

ప్రతి ఏడాది భక్తుల సంఖ్యను అంచనా వేస్తూ టీటీడీ వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెడుతుంది. హుండీ ఆదాయం‌ బట్టి టీటీడీ బడ్జెట్ మారుస్తూ వస్తుంటుంది. ఇక ఎవరూ ఊహించని కరోనా ఉపద్రవం టీటీడీని అతలాకుతలం చేసింది. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు ఎనభై రోజులకుపైగా స్వామి వారి దర్శనంకు భక్తుల అనుమతిని రద్దు చేస్తూ ఏకాంతంగా స్వామి వారికి కైంకర్యాలు నిర్వహించాల్సి వచ్చింది. దీంతో భక్తుల రాక తగ్గడంతో కరోనా సమయంలో టీటీడీ వార్షిక బడ్జెట్ అంచనా చేరుకోలేక పోయింది. ప్రతి ఏడాది టీటీడీ వార్షిక బడ్జెట్ పెంచుతూ వస్తోంది. 2019-20 సంవత్సరంలో టీటీడీ వార్షిక బడ్జెట్ అంచనాను అందుకుంది. ముఖ్యంగా శ్రీవారికి హుండీ ద్వారా వ‌చ్చే ఆదాయంతోపాటుగా ద‌ర్శ‌న టికెట్లు, ల‌డ్డూ ప్ర‌సాదం, వ‌స‌తి గదులు, క‌ల్యాణ క‌ట్టలు, కళ్యాణ మండపాలు, వంటి ద్వారా టిటిడికి ఆదాయం చేకూరుతుంది. టీటీడీ అధికారిక లెక్క‌ల ప్ర‌కారం 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రంలో కేవ‌లం హుండీ ద్వారా రూ. 1231 కోట్ల ఆదాయం ల‌భించింది. అంటే నెల‌కు వంద కోట్ల‌కుపైగా ఆదాయం లెక్కన స‌గ‌టున రోజుకి రూ. 3 కోట్ల‌కు త‌గ్గ‌కుండా ఆదాయం వస్తుంది.

13 వందల కోట్ల అంచనా..

ఇక 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను టీటీడీ రూ.3,116.25 కోట్లతో అంచనా బడ్జెట్‌ను రూపొందించగా, రూ.3,243.19 కోట్లుగా టీటీడీ పాలక మండలి సభ్యులు బడ్జెట్ ను సవరించారు. ఇందులో శ్రీవారి హుండీ ఆదాయాన్ని రూ.1,231 కోట్లుగా అంచనా వేసింది టీటీడీ. అంచనా కన్నా 50 కోట్ల రూపాయలు అధికంగా భక్తులు హుండీలో సమర్పించారు. తద్వారా రూ.1,285 కోట్లు సమకూరింది. ఇవన్నీ కరోనా రాక ముందు పద్దులు అయినప్పటికీ.. కరోనా సమయంలో ఎవరూ ఊహించని స్ధాయిలో టిటిడికి హుండీ ఆదాయం సమకూరింది. పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తూ ఉండడంతో 2020-21వ వార్షిక సంవత్సరానికి హుండీ ఆదాయం 13 వందల కోట్లు అంచనా వేయగా టీటీడీ అంచనాలను చేరుకోలేక పోయింది. ఏమాత్రం ఊహించని విధంగా కేవలం 721 కోట్లు రూపాయల ఆదాయం లభించింది. దీంతో టీటీడీ వార్షిక బడ్జెట్ సైతం రివైజ్డ్ చేసి 2,553 కోట్లకు కుదించింది. ఇక 2020-21 ఆర్థిక సంవత్సరానికి 2,837 కోట్ల రూపాయలు అంచనా వేసిన టీటీడీ, 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పై సుదీర్ఘ చర్చ జరిపి ఆమోదం తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 2,937.85 కోట్ల రూపాయలకు పాలకమండలి సభ్యులు ఆమోదించారు.

8 నెలల్లోనే వంద కోట్ల మార్కును దాటిన టీటీడీ

కరోనా నుంచి బయట పడిన తర్వాత క్రమేపి శ్రీనివాసుడి కరుణా కటాక్షాల కోసం దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమలకు చేరుకున్నారు. దీంతో స్వామి వారి దర్శన భాగ్యం కోసం రోజుల తరబడి భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఏడు కొండల్లో భక్తుల సందడి నెలకొనడంతో క్రమేపి హుండీ ఆదాయం పెరుగుతూ వచ్చింది. ఈక్రమంలోనే మార్చి మాసం నుంచి శ్రీవారి హుండీ ఆదాయం రూ. 100 కోట్ల మార్క్ దాటి రావడంతో పాటుగా, వరుసగా 8 మాసాలు రూ. 100 కోట్ల మార్క్ ను దాటి టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. మార్చి మాసంలో 19,72,656 లక్షల మంది దర్శించుకుంటే, హుండీలో రూ. 128.61 కోట్ల రూపాయల నగదు కానుకలుగా సమర్పించారు. ఇక ఏప్రిల్ నెలలో 20,62,323 లక్షల మంది దర్శించుకుంటే, హుండీలో రూ. 127.63 కోట్లు కానుకలుగా సమర్పించారు. మే నెలలో 22.68 లక్షల మంది దర్శించుకుని రూ‌. 130.20 కోట్లు కానుకలుగా సమర్పించారు. జూన్ నెలలో 23,18,829 లక్షల మంది దర్శించుకుని  హుండీలో రూ.123.74 కోట్లు కానుకలుగా సమర్పించారు. 

1450 కోట్ల పైనే వచ్చే అవకాశం..

జూలై నెలలో 23,37,324 లక్షల మంది దర్శించుకుని హుండీలో రూ.139.46 కోట్లు కానుకలుగా సమర్పించారు. ఇక ఆగస్టు నెలలో 22,80,084 లక్షల మంది దర్శించుకుని రూ. 140.07 కోట్లు కానుకలను హుండీలో వేశారు. తిరుమల హుండీ ఆదాయం చరిత్రలోనే 140 కోట్ల మార్క్ దాటడం ఇదే ఇదే ప్రథమం. సెప్టెంబరు నెలలో 22.12 లక్షల మంది దర్శించుకుని హుండీలో రూ.122.19 కోట్లు కానుకలుగా సమర్పించారు. అక్టోబరులో హుండీ ద్వారా శ్రీవారికి భక్తులు రూ.122.8 కోట్లు సమర్పించుకున్నారు. గత నెలలో 23వ తేదీ ఒక్కరోజే రూ. 6.31 కోట్లు హుండీ కానుకలు లభించాయి. ఇప్పటికే హుండీ ఆదాయం రూ.100 కోట్లు దాటిన మాసాలకు లెక్కలు వేసుకుంటే హుండీ ఆదాయం రూ. 1034.7 కోట్ల రూపాయలు దాటుతుంది. ఇక జరుగుతున్న నవంబర్ రాబోయే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసాలను అంచనా వేసుకుంటే మొత్తం 1450 కోట్ల రూపాయల పైన హుండీ ఆదాయం వచ్చే అవకాశం ఉందని టీటీడీ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. 

ఇక రోజు రోజుకి భక్తుల సంఖ్యతోపాటుగా, ఘననీయంగా పెరుగుతున్న హుండీ ఆదాయం రావడంతో రాబోవు ఏడాది బడ్జెట్ సైతం భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి మాసంలో ప్రవేశ పెట్టె బడ్జెట్ రూ. 3500 కోట్లు పైగా ఉండే అవకాశం ఉందని టీటీడీ ఆర్ధిక నిపుణులు అంచనాకు వచ్చారని తెలుస్తోంది. ఏదీ ఏమైనప్పటికీ కరోనా తర్వాత హుండీ ఆదాయం వంద కోట్ల మార్కును దాటుతూ రావడంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
AP CM Chandrababu: రాయలసీమ ఇక ‘రాయల్’ సీమ.. ఏపీకి దిగ్గజ సంస్థ రావడంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
రాయలసీమ ఇక ‘రాయల్’ సీమ.. ఏపీకి దిగ్గజ సంస్థ రావడంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
TTD Adulterated Ghee Issue: కల్తీ నెయ్యి విషయంలో తప్పు చేసిన వారిపై చర్యలకు సిద్ధం - త్రిసభ్య కమిటీని నియమించిన ఏపీ ప్రభుత్వం
కల్తీ నెయ్యి విషయంలో తప్పు చేసిన వారిపై చర్యలకు సిద్ధం - త్రిసభ్య కమిటీని నియమించిన ఏపీ ప్రభుత్వం
ATM Theft in Dharmavaram: ధర్మవరంలో ఏటీఎం మెషీన్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు.. ఇలా ఉన్నారేంట్రా బాబు!
ధర్మవరంలో ఏటీఎం మెషీన్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు.. ఇలా ఉన్నారేంట్రా బాబు!

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold Import Duty: బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. సామాన్యులకు భారంగా మారనున్న ధరలు
బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. సామాన్యులకు భారంగా మారనున్న ధరలు
Lockdown Rumors: దేశంలో మళ్లీ లాక్‌డౌన్ భయాలు - ప్రధాని సూచనలపై పానిక్ - అసలు ఏం జరగబోతోంది?
దేశంలో మళ్లీ లాక్‌డౌన్ భయాలు - ప్రధాని సూచనలపై పానిక్ - అసలు ఏం జరగబోతోంది?
AP Local Body Elections: మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
LPG Gas Subsidy: ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కావాలంటే ప్రతి ఏడాది E-KYC తప్పనిసరి.. లేకపోతే సబ్సిడీ బంద్
ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కావాలంటే ప్రతి ఏడాది E-KYC తప్పనిసరి.. లేకపోతే సబ్సిడీ బంద్
ఒకే ఛార్జ్‌పై 490 కి.మీ రేంజ్ ఇచ్చే Kia Carens Clavis Ev పై 2 లక్షలకు పైగా బెనిఫిట్స్.. ఫీచర్లు చూసి కొనేయండి
ఒకే ఛార్జ్‌పై 490 కి.మీ రేంజ్ ఇచ్చే Kia Carens Clavis Ev పై 2 లక్షలకు పైగా బెనిఫిట్స్.. ఫీచర్లు చూసి కొనేయండి
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Embed widget