అన్వేషించండి

DNA Test For Cheetah: చిరుతకు డీఎన్ఏ పరీక్షలు ఎన్ని దశలలో చేస్తారు, మ్యాన్ ఈటరా కాదా ఇలా గుర్తిస్తారంటే!

DNA Test For Cheetah: తిరుమలలో బంధించిన చిరుతపులికి డీఎన్ఏ టెస్టులు నిర్వహించి అది మ్యాన్ ఈటరా కాదా అని గుర్తించేందుకు పలు పరీక్షలు నిర్వహించనున్నారు.

DNA Test For Cheetah: తిరుపతి: కాలి నడక మార్గంలో ఆరేళ్ళ బాలికపై చిరుత పులి దాడి చేసి చంపేసిన ఘటనలో చిరుతపులి మ్యాన్ ఈటర్ ఆ కాదా అనేది నిర్ధారించుకునేందుకు నమూనాలను ఐసర్ కి తిరుపతి ఎస్వీ జూ పార్క్ అధికారులు పంపారు. అలిపిరి నడక మార్గంలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి సమీపంలో‌ తల్లిదండ్రులతో కలిసి తిరుమలకు వెళ్తున్న ఆరేళ్ళ బాలిక లక్షితపై చిరుత పులి దాడి చేసి చంపేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం‌ సృష్టించింది. 

చిన్నారులపై వరుస దాడులతో అప్రమత్తం అయిన టిటిడి అటవీ శాఖ అధికారులు అలిపిరి నడక మార్గంలోని ఏడోవ మైలు నుంచి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వరకూ హై అలర్ట్ జోన్ గా ప్రకటించారు. అంతే కాకుండా ఆ ప్రాంతంలో చిరుతల జాడలను గుర్తించేందుకు ట్రాప్స్ ను ఏర్పాటు చేసి ఈ నెల 14వ తారీఖున చిరుతను అటవీ శాఖ అధికారులు పట్టుకోగా, మరో చిరుతను సైతం అదే ప్రాంతంలో పట్టుకుని ఈ రెండు చిరుతలను తిరుపతిలోని ఎస్వీ జూపార్క్ కు తరలించారు అధికారులు. అయితే ఆ చిరుతపులి మ్యాన్ ఈటర్ కాదా అనేది తెలుసుకునేందుకు నమూనాలను సేకరించారు. 

చిరుతపులి డీఎన్ఏ పరీక్షలు ఎన్ని దశలు ఉంటాయంటే..
శేషాచలం‌ అటవీ ప్రాంతంలో బోనుకు చిక్కిన రెండు చిరుతలను ఎస్వీ జూపార్క్ లో ఉంచి సంరక్షిస్తున్నట్లు తిరుపతి‌ ఎస్వీ జూపార్క్ క్యూరేటర్ సెల్వం వెల్లడించారు. తిరుపతి ఐసర్ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌ అండ్ రిసర్చ్ కాలేజ్ ఆఫ్ రీజనల్ ) నుండి వచ్చి శాస్త్రవేత్తలు ఆ రెండు చిరుతల నమూలనాలను స్వీకరించి డీఎన్‌ఏ పరీక్షల నిమిత్తం పంపడం జరిగిందన్నారు. 
బాలిక శరీరం నుంచి నమూనాలను, అదే విధంగా ఘటన స్ధలంలో సేకరించిన చిరుతపులి లాంటి వెంట్రుకలు, రక్తం, యూరిన్ నమూనాలను సేకరించిన తర్వాత, జూపార్క్ తరలించిన చిరుత పులి వెంట్రుకలను, యూరిన్, మోషన్ నమూనాలను సేకరించి ఐసర్ శాస్త్రవేత్తల ద్వారా ల్యాబ్ కు పంపామన్నారు. డీఎన్‌ఏ పరీక్షలు మూడు దశల్లో ఉంటుందని, ఈ పరీక్షలకు రెండు వారాలు సమయం పడుతుందని ఐసర్ శాస్త్రవేత్తలు తెలియజేశారని, అయితే చిరుతపులి బాలికను చంపిందా అనేది ఐసర్ శాస్త్రవేత్తలు ఇచ్చే నివేదిక వచ్చిన తర్వాత తేలనుందన్నారు. 
ఇందులో మూడు దశల్లో నమూనాలను పరీక్షిస్తారని, ఇందులో ముందుగా డీఎన్ఏ సారం గుర్తించే ప్రక్రియ, రెండోవది మాల్యూక్లర్ మార్కర్ బట్టీ ఆ నమూనాలు చిరుతపులిదా లేక వేరే వన్యమృగమా అనేది గుర్తిస్తారు. మైక్రో శాటిలైట్ మార్క్స్ బట్టీ వచ్చే నమూనాలు ఒక్కటైతే ఆ జంతువు మ్యాన్ ఈటర్ అవునా,‌ కాదా అనేది నిర్ధారణ అవుతుందని, అయితే ఐసర్ శాస్త్రవేత్తలు పూర్తి స్ధాయిలో ఇచ్చిన నివేదిక ప్రకారమే ఆ చిరుత మ్యాన్ ఈటర్ ఐతే ఎస్వీ జూపార్క్ లో ఉంచుతామని, మ్యాన్ ఈటర్ కాకపోతే అటవీ ప్రాంతంలో వదిలేస్తాం అని ఎస్వీ జూపార్క్ క్యూరేటర్ సెల్వం చెప్పారు. తిరుమలలో 50 రోజుల వ్యవధిలో మూడు చిరుతలను అటవీశాఖ అధికారులు బంధించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
AP CM Chandrababu: రాయలసీమ ఇక ‘రాయల్’ సీమ.. ఏపీకి దిగ్గజ సంస్థ రావడంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
రాయలసీమ ఇక ‘రాయల్’ సీమ.. ఏపీకి దిగ్గజ సంస్థ రావడంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
TTD Adulterated Ghee Issue: కల్తీ నెయ్యి విషయంలో తప్పు చేసిన వారిపై చర్యలకు సిద్ధం - త్రిసభ్య కమిటీని నియమించిన ఏపీ ప్రభుత్వం
కల్తీ నెయ్యి విషయంలో తప్పు చేసిన వారిపై చర్యలకు సిద్ధం - త్రిసభ్య కమిటీని నియమించిన ఏపీ ప్రభుత్వం
ATM Theft in Dharmavaram: ధర్మవరంలో ఏటీఎం మెషీన్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు.. ఇలా ఉన్నారేంట్రా బాబు!
ధర్మవరంలో ఏటీఎం మెషీన్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు.. ఇలా ఉన్నారేంట్రా బాబు!

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget