అన్వేషించండి

Tirumala తిరుమల శ్రీవారి దర్శనంతో మొదలుపెట్టిన సిట్, 2 గంటలపాటు తొలి సమావేశం

Andhra Pradesh News | తిరుమల శ్రీవారి ప్రసాదాలతో కల్తీ నెయ్యి వివాదంపై చంద్రబాబు ప్రభుత్వం సర్వశ్రేష్ణ త్రిపాఠి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు శనివారం స్వామివారి దర్శించుకున్నారు.

తిరుమల: తిరుమల శ్రీవారి పవిత్ర ప్రసాదమైన లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న విషయం కొన్ని రోజుల నుంచి సంచలనంగా మారింది. టీటీడీ అధికారులు తిరుమలకు వచ్చిన నెయ్యిని గుజరాత్‌లోని ఎన్‌డీడీబీకి పంపగా, అక్కడ జరిగిన టెస్టుల్లో నెయ్యి కల్తీ అయినట్లు గుర్తింంచడం తెలిసిందే. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్ చీఫ్‌గా నియమించారు. తిరుమలలో నెయ్యి కల్తీ ఘటనపై విచారణ జరిపి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం సిట్ ను ఆదేశించింది. ఇందులో భాగంగా సిట్ చీఫ్ సర్వశ్రేష్ట త్రిపాఠి తన టీమ్‌తో కలిసి శనివారం విజయవాడ నుంచి తిరుపతికి వెళ్లారు. అక్కడ పద్మావతి గెస్ట్ హౌస్ కు మొదటగా వెళ్లారు. అటు నుంచి కొండమీదకు వెళ్లి తిరుమల శ్రీవారిని సిట్ టీమ్ దర్శించుకుంది. స్వామివారి ఆలయంలో తీర్థప్రసాదాలను అర్చకులు అందించారు. 

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యిపై దర్యాప్తు చేపట్టడానికి వచ్చిన సిట్ టీమ్ శ్రీవారి దర్శనం చేసుకుని, స్వామివారి ఆశీర్వాదం తీసుకుంది. అనంతరం సర్వశ్రేష్ట త్రిపాఠి నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) దర్యాప్తు చేయడానికి సిద్ధం అయింది. స్వామివారి దర్శనం అనంతరం తిరుపతి పోలీస్‍ గెస్ట్ హౌస్‌లో సిట్‍ సభ్యులు సమావేశమయ్యారు. తిరుమల శ్రీవారి పవిత్ర ప్రసాదమైన లడ్డూ అపవిత్రం కావడానికి గల కారణాలను తెలుసుకునేందుకు అనుసరించాల్సిన విధానాలు, దర్యాప్తు తీరుపై సిట్ టీంతో చీఫ్ త్రిపాఠి చర్చించారు. దాదాపు 2 గంటలకు పాటు సిట్ అధికారుల తొలి సమావేశం కొనసాగింది. ఇది కోట్లాది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయంతో పాటు సున్నితమైన అంశం కనుక ఏ పొరపాటు జరగకుండా దర్యాప్తు చేయాలని సమావేశంలో అధికారులు చర్చించారు. 
మూడు బృందాలతో దర్యాప్తు
ముగ్గురు ఐపీఎస్‌ నేతృత్వంలో పోలీస్ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి లడ్డూలో కల్తీ నెయ్యి సహా టీటీడీ వివాదంపై దర్యాప్తు చేయనున్నారు. సిట్‍ చీఫ్ సర్వశ్రేష్ట త్రిపాఠి ఈ టీమ్స్ దర్యాప్తును పర్యవేక్షించనున్నారు. ఎప్పటికప్పుడూ వారితో సమావేశమై దర్యాప్తును ముందుకు తీసుకెళతారు. సిట్‍ బృందం మూడు రోజుల పాటు తిరుమల, తిరుపతిలోనే ఉండి దర్యాప్తు కొనసాగించనుంది. సిట్‍ కార్యకలాపాల కోసం టీటీడీ శ్వేతభవనంలో ఆఫీసు ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. గత ప్రభుత్వంలో నెయ్యి డెలివరీ పరీక్షలు, ప్రస్తుతం తిరుమలలో నెయ్యి డెలివరీతో పాటు ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారని సిట్ ఫోకస్ చేస్తోంది. నెయ్యి డెలివరీకి టీటీడీ ఏ విధంగా టెండర్లను ఆహ్వానించింది, ఇతర అంశాల వివరాలను సిట్ సేకరిస్తోంది.

Also Read: Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ 

మాజీ సీఎం జగన్ తిరుమలకు వెళ్లాల్సి ఉండగా, డిక్లరేషన్ ఇవ్వాల్సిన కారణంగా తిరుమల పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఏపీ ప్రభుత్వం మాజీ సీఎంను అయిన తననే ఆలయానికి వెళ్లనివ్వడం లేదని, దళితుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. గతంలో ఎన్నోసార్లు తిరుమలకు వెల్లి సీఎంగా పట్టు వస్త్రాలు సైతం సమర్పించిన తాను శ్రీవారిని దర్శించుకోకుండా ఆంక్షలు పెట్టారని జగన్ ఆరోపించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
Embed widget