By: ABP Desam | Updated at : 16 Feb 2022 03:19 PM (IST)
అంజనాద్రిలో అభివృద్ధి పనులకు శ్రీకారం
కలియుగ వైకుంఠ నాథుడు శ్రీనివాసుడు కొలువైయున్న ఏడు కొండల్లోని అంజనాద్రే హనుమన్ జన్మస్ధలంగా నిర్దారించిన తిరుమల తిరుపతి దేవస్థానం... అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. శాస్త్రోక్తంగా తిరుమలలోని అంజనాద్రి క్షేత్రం అభివృద్ధి పనులు ప్రారంభించింది. మాఘ పౌర్ణమి పర్వదినంలో ఉదయం 9:30 గంటలకు వేద పండితుల వేదోచ్ఛరణ మధ్య క్రతువు సాగింది. ఈ కార్యక్రమాలలో విశాఖ స్వరూపానంద స్వామి, చిత్రకూట పీఠాధిపతి ఇతర పీఠాధిపతులు హాజరయ్యారు. ఆకాశగంగ తీర్ధం ఆలయ అభివృద్ధి నమూనా చిత్రాన్ని, హనుమన్ జన్మవృత్తాంతం చారిత్రక నిరూపణ పుస్తకాన్ని టిటిడి విడుదల చేసింది.
అంజనాద్రిలో పనులు వేగంగా పూర్తి చేస్తామన్నారు టీటీడీ ఈవో జవహర్రెడ్డి. శంకుస్థాపన రద్దు చేయాలని కోర్టు నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని ఎవరైనా కోర్టు ఆర్డర్ చూపిస్తే కచ్చితంగా స్పందిస్తామన్నారాయన.
శ్రీ ఆంజనేయస్వామి జన్మస్థానం తిరుమల అంజనాద్రి లో
అభివృద్ధి పనులకు టీటీడీ శ్రీకారం.
శంఖు స్థాపన సుముహూర్తం
మీ శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ యూట్యూబ్ ఛానల్ నందు ప్రత్యక్ష ప్రసారం.
" ఓం నమో వేంకటేశాయ "
watch in youtube: https://t.co/B9olD4Jptw pic.twitter.com/8L3DUHDhde — SVBCTTD (@svbcttd) February 16, 2022
హనుమంతుడి జన్మస్థలంలో ఎన్నో వివాదాలు మరెన్నో ఆరోపణలు. చివరకు తిరుపతిలోని అంజనాద్రి.. మారుతీ జన్మస్థానంగా టీటీడీ తేలించింది. వీలైనంత త్వరగా దాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు వేగవంతం చేసింది.
తిరుమలలో హనుమాన్ జన్మస్థలం భూమి పూజ పనులను పరిశీలించిన అదనపు ఈవో pic.twitter.com/yaav8uE2gW
— SVBCTTD (@svbcttd) February 15, 2022
ఆంజనేయుడి జన్మస్థలంపై హింపీ పీఠం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. టీటీడీ ఎన్ని సార్లు వివరణ ఇచ్చినా వాళ్లు సంతృప్తి చెందలేదు. అందుకే టీటీడీ శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేద అధ్యయన సంస్థ ఆధ్వర్యంలో హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రి అనే అంశంపై ఈ మధ్యకాలంలో అంతర్జాతీయ వెబినార్ నిర్వహించింది. ఇందులో దేశ విదేశాల్లోని పీఠాధిపతులు, మఠాధిపతులు, పురాణ, ఇతిహాస, భౌగోళిక పరిశోధనల్లో నిపుణులు, నిష్ణాతులు పాల్గొన్నారు. వెబినార్ అనంతరం అప్పటి టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి పురాణాలు, శాసనాలు.. భౌగోళిక ఆధారాలకు అనుగుణంగా ఆంజనేయుడి జన్మ స్థలం తిరుమల అని చెబుతున్నాయని చెప్పారు. ఇందులో ఎలాంటి ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.
జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం ప్రొఫెసర్ రాణి సదాశివమూర్తి కూడా దీన్ని ధ్రువీకరించారు. అంజనాద్రి దాస క్షేత్రమని, వేంకటాచల మహాత్యం అనేది వివిధ పురాణాల సంకలనమని చెప్పారు. కృత యుగంలో వృషాద్రి, త్రేతాయుగంలో అంజనాద్రి, కలియుగంలో వెంకటాచలంగా పిలుస్తున్నారని చెప్పారు. పద్మ, స్కంద, బ్రహ్మాండ పురాణంలో ఈ విషయం ఉందని ఆమె వివరించారు.
ఇలా అందరి అంగీకారంతో తిరుమలలోని అంజనాద్రే హనుమంతుడి జన్మస్థానంగా టీటీడీ తేల్చి చెప్పింది. ఈ మేరకు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. వైభవంగా శంకుస్థాపన ప్రక్రియను కూడా పూర్తి చేసింది.
JC Prabhakar Reddy : రేయ్ పోలీస్ మీపై నమ్మకం పోయింది, జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Breaking News Live Telugu Updates: గవర్నర్ వివాదంపై వెనక్కి తగ్గిన తెలంగాణ సర్కారు
Tirupati News: కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు - నలుగురు అరెస్ట్
AP News Developments Today: నేడే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా ‘ఉక్కు ప్రజా గర్జన’
Ramana Dikshitulu : ఏపీలో ఆలయాల పరిస్థితి దయనీయం, రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు
Lokesh Yuvagalam ; ఏపీ , కర్ణాటక మధ్య పెట్రోల్ ధరల్లో ఎంత తేడా అంటే ? పాదయాత్రలో లోకేష్ చూపించారు...
టీడీపీ నేతలకు షాక్ - పరువు నష్టం దావా వేసిన రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
Adani vs Hindenburg: ₹14 లక్షల కోట్ల నష్టం మిగిల్చిన 32 వేల పదాల నివేదిక
Dasara Teaser: నాని నెవ్వర్ బిఫోర్ - అంచనాలను మించిపోయిన‘దసరా’ టీజర్ - ఎలా ఉందో చూశారా?
Gutha Sukender Reddy On Governor : వక్రబుద్ధితో కొందరు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు- గుత్తా సుఖేందర్ రెడ్డి