అన్వేషించండి

Chittoor: తల్లీకుమార్తె హత్య, మరో బాలికను గర్భవతిని చేసిన వ్యక్తి - చిత్తూరు కోర్టు సంచలన తీర్పు

తంబళ్లపల్లెలో జంట హత్యల కేసు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ నిందితుడికి  చిత్తూరు జిల్లా కోర్టు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.

జంట హత్య కేసులో నేరం‌ నిరూపణ కావడంతో నిందితుడికి చిత్తూరు జిల్లా న్యాయస్ధానం సంచలన తీర్పు వెల్లడించింది. గత ఏడాది తంబళ్లపల్లెలో జంట హత్యల కేసు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ నిందితుడికి  చిత్తూరు జిల్లా కోర్టు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఇద్దరి చావుకు కారణమై, మరో మైనర్ బాలిక భవిష్యత్తును అంధకారం చేసిన కర్కోటకుడికి తగిన శిక్ష పడిందని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.

ఫిర్యాదుదారు ధనమ్మ వెల్లడించిన వివరాల మేరకు. చిత్తూరు జిల్లా, తంబళ్లపల్లె మండలం, ఏటిగడ్డ తాండా సమీపంలోని పొలం వద్ద రేకుల షెడ్ లో నివాసం ఉన్న గంగులమ్మ, సరళమ్మ, ముగ్గురు మైనర్ పిల్లలు శ్రావణి (14), శశికళ (12), శ్యామ్ (8) మొత్తం ఐదు మంది కనిపించడం లేదని, చిత్తూరులోని ఇందిరానగర్ లో నివసిస్తున్న శివ భార్య ధనమ్మ ఫిర్యాదు చేసింది. ఆ మేరకు 28-01-2021 లో cr no 12/2021 మహిళ, పిల్లలు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ధనమ్మ అన్న వెంకటరమణ అనారోగ్యంతో మరణించిన కొంతకాలం తర్వాత తన వదిన సరళమ్మ(40), తన ముగ్గురు పిల్లలను తీసుకొని తన పుట్టినిల్లు అయిన తంబళ్లపల్లె మండలం, గోవిందువారిపల్లెలో నివసిస్తున్న అమ్మ గంగులమ్మ వద్దకు వెళ్లి అక్కడే కూలీ పనులు చేసుకొంటూ జీవిస్తుంది.

వివాహేతర సంబంధం

అప్పుడప్పుడు వెళ్లి పిల్లలను చూసుకొని వచ్చే క్రమంలో సరళమ్మ గంగిరెడ్డిపల్లె కి చెందిన సయ్యద్ మౌలాతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నట్లు తెలిసింది. అయితే గ్రామంలో వీరి గురించి చెప్పుకొంటున్నందున మౌలా పెద్దేరు ప్రాజెక్టు సమీపంలోని తన పొలంలో రేకుల షెడ్ నిర్మించి వీరందరినీ అక్కడే నివాసం ఉంచినట్లు తెలిసింది. అయితే అక్కడికి కూడా వెళ్లి పిల్లలను పలకరించే దానిని అని ధనమ్మ తెలిపారు. అప్పట్లో కరోనా వ్యాప్తి కారణంగా వెళ్లలేదని, ఫోన్ చేసినా ఫోన్ కలవలేదని కరోనా ఆంక్షల సడలింపు ఇచ్చిన తర్వాత వెళ్లగా సదరు రేకుల షెడ్ కు తాళం వేసి ఉందని తెలిపింది. గ్రామంలోకి వెళ్లి విచారణ చేస్తే, వారు 3 నెలలుగా కనిపించలేదని చెప్పడంతో మౌలాపై అనుమానం వ్యక్తం చేస్తూ తంబళ్లపల్లె పోలీసులకు 28-01-2021న ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. దీనిపై Cr no 12/2021 గా మహిళ , పిల్లలు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

దర్యాప్తులో సయ్యద్ మౌలా తాను సరళమ్మ, వారి తల్లి గంగులమ్మను హత్య చేసినట్లు, మైనర్ బాలికపై అత్యాచారం చేశానని మిగిలిన ఇద్దరు పిల్లలను కర్ణాటకలోని ఓ పల్లెలో దాచి ఉంచానని ఒప్పుకున్నాడు. వారి మృతదేహాలను సమీపంలోని చెరువులో పాతి పెట్టానని నేరం అంగీకరించాడు. దీంతో స్థానిక రెవెన్యూ, వైద్య సిబ్బంది సహకారంతో మృతదేహాలను వెలికి తీశారు. తమ వదిన సరళమ్మ, వారి అమ్మ గంగులమ్మ మృతదేహాలను ఫిర్యాదుదారు ధనమ్మ గుర్తించింది. శవ పరీక్షల నివేదికలో హత్య కేసు, మైనర్ బాలికపై అత్యాచారం చేశాడని మైనర్ బాలిక వాగ్మూలం, డాక్టర్ల పరీక్షల నివేదిక ఆధారంగా ఫోక్సో కేసు పెట్టారు. మొత్తం రెండు కేసులుగా మార్పు చేసిన పోలీసులు, సుదీర్ఘ వాదోపవాదాల తర్వాత ఫోక్సో కేసులో ముద్దాయి సయ్యద్ మౌలాకు జీవిత ఖైదు విధించారు. రూ.5 వేలు చెల్లించాలని తీర్పు వెలువరించింది. అయితే జంట హత్యలు, ఎస్సీ, ఎస్టీ కేసులో జీవిత ఖైదుతో పాటు ఉరిశిక్షను అదనపు న్యాయమూర్తి రమేష్ విధించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Parvesh Verma BJP: కేజ్రీవాల్‌నే ఓడించిన బీజేపీ అభ్యర్థి.. ఇంతకీ ఎవరీ పర్వేశ్ వర్మ?
కేజ్రీవాల్‌నే ఓడించిన బీజేపీ అభ్యర్థి.. ఇంతకీ ఎవరీ పర్వేశ్ వర్మ?
Arvind Kejriwal: మోదీనే వణికించిన మొనగాడు కేజ్రీవాల్, కానీ నాలుగోసారి ఎందుకు ఓడాడంటే!
మోదీనే వణికించిన మొనగాడు కేజ్రీవాల్, కానీ నాలుగోసారి ఎందుకు ఓడాడంటే!
Anna Hazare On AAP Loss: హెచ్చరించినా పట్టించుకోలేదు- కేజ్రీవాల్ ఓటమికి కారణాలపై అన్నా హజారే ఘాటు వ్యాఖ్యలు
హెచ్చరించినా పట్టించుకోలేదు- కేజ్రీవాల్ ఓటమికి కారణాలపై అన్నా హజారే ఘాటు వ్యాఖ్యలు
Delhi Elections 2025: ‘బీజేపీని మళ్లీ గెలిపించిన రాహుల్​ గాంధీకి కంగ్రాట్స్’​.. కేటీఆర్​ పోస్ట్​
Delhi Elections 2025: ‘బీజేపీని మళ్లీ గెలిపించిన రాహుల్​ గాంధీకి కంగ్రాట్స్’​.. కేటీఆర్​ పోస్ట్​
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Delhi Elections Results 2025 | మాస్టర్ మైండ్ Manish Sisodia ను వీక్ చేశారు..ఆప్ ను గద్దె దింపేశారు | ABP DesamDelhi Elections Results 2025 | Delhi గద్దె Arvind Kejriwal దిగిపోయేలా చేసింది ఇదే | ABP DesamArvind Kejriwal Lost Election | ఆప్ అగ్రనేతలు కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా ఓటమి | ABP DesamDarien Gap Crossing in Telugu | మానవ అక్రమరవాణాకు దారి చూపెడుతున్న మహారణ్యం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Parvesh Verma BJP: కేజ్రీవాల్‌నే ఓడించిన బీజేపీ అభ్యర్థి.. ఇంతకీ ఎవరీ పర్వేశ్ వర్మ?
కేజ్రీవాల్‌నే ఓడించిన బీజేపీ అభ్యర్థి.. ఇంతకీ ఎవరీ పర్వేశ్ వర్మ?
Arvind Kejriwal: మోదీనే వణికించిన మొనగాడు కేజ్రీవాల్, కానీ నాలుగోసారి ఎందుకు ఓడాడంటే!
మోదీనే వణికించిన మొనగాడు కేజ్రీవాల్, కానీ నాలుగోసారి ఎందుకు ఓడాడంటే!
Anna Hazare On AAP Loss: హెచ్చరించినా పట్టించుకోలేదు- కేజ్రీవాల్ ఓటమికి కారణాలపై అన్నా హజారే ఘాటు వ్యాఖ్యలు
హెచ్చరించినా పట్టించుకోలేదు- కేజ్రీవాల్ ఓటమికి కారణాలపై అన్నా హజారే ఘాటు వ్యాఖ్యలు
Delhi Elections 2025: ‘బీజేపీని మళ్లీ గెలిపించిన రాహుల్​ గాంధీకి కంగ్రాట్స్’​.. కేటీఆర్​ పోస్ట్​
Delhi Elections 2025: ‘బీజేపీని మళ్లీ గెలిపించిన రాహుల్​ గాంధీకి కంగ్రాట్స్’​.. కేటీఆర్​ పోస్ట్​
Bandi Sanjay: అవినీతి, అక్రమాల ఆప్‌ను ఢిల్లీ ప్రజలు ఊడ్చిపారేశారు - బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
అవినీతి, అక్రమాల ఆప్‌ను ఢిల్లీ ప్రజలు ఊడ్చిపారేశారు - బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Delhi Elections 2025: ఢిల్లీలో మ్యాజిక్​ ఫిగర్​ దాటిన బీజేపీ, హస్తినలో ఆప్ కోటకు బీటలు!
ఢిల్లీలో మ్యాజిక్​ ఫిగర్​ దాటిన బీజేపీ, హస్తినలో ఆప్ కోటకు బీటలు!
Delhi Election Results: మనం మనం కొట్లాడుకుంటే ఇట్లుంటాది - ఢిల్లీ ఫలితాలపై ఒమర్ అబ్దుల్లా మీమ్ రిప్లై
మనం మనం కొట్లాడుకుంటే ఇట్లుంటాది - ఢిల్లీ ఫలితాలపై ఒమర్ అబ్దుల్లా మీమ్ రిప్లై
PM Modi: 'ANR భారతదేశానికి గర్వ కారణం' - అక్కినేని ఫ్యామిలీ మీట్‌పై ప్రధాని మోదీ ట్వీట్
'ANR భారతదేశానికి గర్వ కారణం' - అక్కినేని ఫ్యామిలీ మీట్‌పై ప్రధాని మోదీ ట్వీట్
Embed widget