అన్వేషించండి

Delhi Elections 2025: ‘బీజేపీని మళ్లీ గెలిపించిన రాహుల్​ గాంధీకి కంగ్రాట్స్’​.. కేటీఆర్​ పోస్ట్​

బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మాజీ మంత్రి కేటీఆర్​ సోషల్​ మీడియా ఎక్స్​ వేదికగా ఆసక్తికర పోస్ట్​ చేశారు. ‘బీజేపీని మరోసారి గెలిపించిన రాహుల్​ గాంధీకి కంగ్రాట్స్​’ అంటూ పోస్ట్​ పెట్టారు.

బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మాజీ మంత్రి కేటీఆర్​ సోషల్​ మీడియా ఎక్స్​ వేదికగా ఆసక్తికర పోస్ట్​ చేశారు. ‘బీజేపీని మరోసారి గెలిపించిన రాహుల్​ గాంధీకి కంగ్రాట్స్​’ అంటూ పోస్ట్​ పెట్టారు. దీనికి రాహుల్​ గాంధీ గురించి ఆయన  గతంలో మాట్లాడిన ఓ వీడియోను ట్యాగ్​ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలోనే కేటీఆర్​ ఈ పోస్ట్​ పెట్టినట్లు తెలుస్తోంది.

బీజేపీకి అతిపెద్ద కార్యకర్త రాహుల్​ గాంధీనే..
మరోసారి బీజేపీని గెలిపించిన రాహుల్​ గాంధీకి కంగ్రాట్స్​ అంటూ కేటీఆర్​ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్​ ఎక్స్​లో ట్రెండ్​ అవుతోంది. ఈ పోస్ట్​కు గతంలో తాను ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూను కేటీఆర్​ జతచేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీకి అతిపెద్ద కార్యకర్త ఎవరైనా ఉంటే అది రాహుల్​ గాంధీనే అని ఎద్దేవా చేశారు.

బీజేపీని నిలువరించే సత్తా రాహుల్​కు లేదు
ఆ వీడియోలో కేటీఆర్​ మాట్లాడుతూ..  ‘రాహుల్​ గాంధీకి బీజేపీని నిలువరించే సత్తా లేదు. ఒకవేళ ఆయనకు ఆ దమ్ము ఉంటే వెళ్లి ఉత్తర్​ప్రదేశ్​లో, గుజరాత్​లో, బిహార్​లో ఆ పార్టీతో కొట్లాడాలి. కానీ అలా చేయకుండా తెలంగాణకు వచ్చి బీజేపీని నిలువరించే సత్తా ఉన్న నేతలతో పోరాడతానంటారు. ​దేశంలో మోదీకి ఉన్న అతి పెద్ద కార్యకర్త రాహుల్​ గాంధీనే. ఆయన లాంటి వ్యక్తి ఉన్నంతకాలం నరేంద్ర మోదీ ఏమైనా చేయలరు. ఎంతకాలమైనా దేశాన్ని పాలించగరు’ అని అన్నారు.

అస్త్రసన్యాసం చేసే రాహుల్​ గాంధీ అసలు నాయకుడేనా? 
ప్రస్తుతం దేశంలో బీజేపీని నిలువరించేవి అవి కేవలం రీజినల్​ పార్టీలు, స్ట్రాంగ్​ లీడర్లైన కేసీఆర్​, కేజ్రీవాల్​, మమతా బెనర్జీ స్టాలిన్​ లాంటి వారు మాత్రమేనన్నారు. దేశమంతా భారత్​ జోడో యాత్ర చేపట్టిన రాహుల్​ గాంధీ గుజరాత్​లో ఎందుకు చేయలేదని అడిగారు. మ్యాచ్​ ఫిక్సింగా లేక మోదీ అంటే రాహుల్​కు భయమా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు అస్త్రసన్యాసం చేసే రాహుల్​ గాంధీ అసలు నాయకుడేనా అని ఎద్దేవా చేశారు. ఇలాంటి నేత ముందుండి నడిపిస్తున్న కాంగ్రెస్​ పార్టీ మోదీని ఏం ఎదుర్కొంటుంది, బీజేపీని ఎలా ఓడిస్తుందని ప్రశ్నించారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా పయనిస్తున్న నేపథ్యంలో కేటీఆర్​ చేసిన ఈ పోస్ట్​ వైరల్​ అవుతోంది.

బీజేపీ 45.. ఆమ్​ ఆద్మీ 5
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్​ కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి బీజేపీ 45 స్థానాల్లో ఆధిక్యంతో దూసుకుపోతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 36 స్థానాల మ్యాజిక్​ ఫిగర్​ను దాటేసింది. బీజేపీ 45 స్థానాల్లో లీడింగ్​లో ఉంటే ఆమ్​ ఆద్మీ పార్టీ 25 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. కాంగ్రెస్​తోపాటు ఇతర పార్టీలు ఇంకా ఖాతా కూడా తెరవకపోవడం గమనార్హం.

వెనుకబడ్డ కేజ్రీవాల్​, సీఎం ఆతిషీ
ఆమ్​ ఆద్మీ పార్టీ ప్రముఖులు కూడా వెనుకంజలో ఉండడం గమనార్హం. ఆ ఆప్​ పార్టీ చీఫ్​ అరవింద్ కేజ్రీవాల్​, ముఖ్యమంత్రి ఆతిషీతోపాటు మరికొందరు మంత్రులు కూడా కౌంటింగ్​లో వెనుకబడిపోయారు. మరి కొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

NEET-UG Paper Leak: నాసిక్‌ ప్రింటింగ్ ప్రెస్ నుంచి సీకర్ హాస్టల్ వరకు! నీట్‌ పేపర్ లీకేజీలో షాకింగ్‌ నిజాలు ఇవే!
నాసిక్‌ ప్రింటింగ్ ప్రెస్ నుంచి సీకర్ హాస్టల్ వరకు! నీట్‌ పేపర్ లీకేజీలో షాకింగ్‌ నిజాలు ఇవే!
TVK strict announcement: బ్యానర్లు, ఫ్లెక్సీలపై టీవీకే నిషేధం..క్యాడర్‌కు విజయ్ వార్నింగ్- ఇంత స్ట్రిక్ట్‌గా ఉన్నారేంటి?
బ్యానర్లు, ఫ్లెక్సీలపై టీవీకే నిషేధం..క్యాడర్‌కు విజయ్ వార్నింగ్- ఇంత స్ట్రిక్ట్‌గా ఉన్నారేంటి?
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
CM Vijay OSD Astrologer: ఎవరీ జ్యోతిష్యుడు రాధన్ పండిట్‌! ఆయన్ని విజయ్‌ ఎందుకు OSDగా తీసుకున్నారు?
ఎవరీ జ్యోతిష్యుడు రాధన్ పండిట్‌! ఆయన్ని విజయ్‌ ఎందుకు OSDగా తీసుకున్నారు?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget