అన్వేషించండి

Jagan Siddham Meeting: జనం మళ్లీ చొక్కాలు మడతేసి, చంద్రబాబు కుర్చీ మడతపెట్టాలి: రాప్తాడు సభలో సీఎం జగన్

Siddham Meeting In Raptadu: ఫ్యాన్ ఎప్పుడూ ప్రతి ఇంట్లో ఉండాలని, సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాలంటూ జనసేన, టీడీపీ గుర్తులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

Jagan Speech At Raptadu Meeting: రాప్తాడు: వచ్చే ఎన్నికలు కేవలం రెండు సిద్ధాంతాలకు మధ్య జరగుతున్న ఎన్నికలని.. కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు కాదన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy). ఈ అయిదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఇంటింటికీ అందించిన సంక్షేమం మరో 5 ఏళ్లు కొనసాగాలని మనం భావిస్తున్నాం. కానీ ఈ పథకాలు రద్దు చేయడమే టార్గెట్ గా డ్రామాలు ఆడుతున్న చంద్రబాబు (Chandrababu)కు జరిగే యుద్ధమే ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికలన్నారు. ఫ్యాన్ ఎప్పుడూ ప్రతి ఇంట్లో ఉండాలని, సైకిల్ ఎప్పుడూ బటయే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాలన్నారు. గత ఎన్నికల్లోనే జనం చొక్కాలు మడతపెట్టి, చంద్రబాబు కుర్చీలు 23కి మడతపెట్టారంటూ జగన్ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ జనం మరోసారి చంద్రబాబు కుర్చీలు మడతపెట్టాలంటూ ప్రజలకు జగన్ పిలుపునిచ్చారు.

250 ఎకరాల విస్తీర్ణంలో రాయలసీమ పరిధిలోని 52 నియోజకవర్గాలకు సంబంధించి అనంతపురం జిల్లాలోని రాప్తాడులో వైసీపీ నిర్వహించిన సిద్ధం భారీ బహిరంగ సభకు సీఎం జగన్ హాజరయ్యారు. వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతూ. మాట ఇచ్చి నిలబెట్టుకునే జగన్‌కు, ఇచ్చిన మాట తప్పే చంద్రబాబుకు.. విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరిగే యుద్ధంలో ప్రజలు తనతో కలిసి రావాలని, అందుకు సిద్ధమేనా అని జగన్ అడిగారు. 

వేరే రాష్ట్రంలో ఉండి, అప్పుడప్పుడు ఏపీకి వచ్చే నాన్ రెసిడెంట్స్‌ (చంద్రబాబు, పవన్ కళ్యాణ్)కు, ఈ గడ్డమీద మమకారంతో ఇక్కడి ప్రజల మధ్య ఉండే తమకు మధ్య జరగబోయే యుద్ధమే ఎన్నికలన్నారు. 14 ఏళ్లు, మూడు పర్యాయాలు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్క పథకమైనా ఉందని చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్ విసిరారు. చంద్రబాబు పేరు చెబితే అక్కాచెల్లెమ్మలకు గుర్తొచ్చే పథకం ఒక్కటీ లేదన్నారు. విద్యార్థులకు సైతం చంద్రబాబు పథకం ఒక్కటీ గుర్తురాదన్నారు. చంద్రబాబు ఏదో వర్గానికైనా మేలు చేశాడా అని ఆలోచిస్తే ఒక్క పథకం కూడా గుర్తుకురాదన్నారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు చూస్తే.. ఏ ఒక్కగ్రామంలోనైనా చంద్రబాబు మార్క్ పాలన ఉందా అని జగన్ ప్రశ్నించారు. ఎన్నికల్లో విడుదల చేసే మేనిఫెస్టోల్లోని హామీలను నెరవేర్చడం ఆయనకు అలవాటు లేదంటూ సెటైర్లు వేశారు. 

1995, 1999, 2014 మేనిఫెస్టోలలో టీడీపీ ఇచ్చిన హామీలను కనీసం 10 శాతం అమలు చేయలేదంటూ జగన్ మండిపడ్డారు. బాబు వంచన, మోసాలు చూడలేక ప్రజలు ఆయన కుర్చీ మడతపెట్టి ఇంటికి పంపించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూడుసార్లు సీఎం అయ్యాక.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చని నేత చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు సంగతి అర్థమై 102 నుంచి 23 సీట్లకు తగ్గించారని.. మరోసారి అదే సీన్ రిపీట్ చేయాలని ప్రజలకు జగన్ పిలుపునిచ్చారు. చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోట్లు, మోసాలు తప్పా, ప్రజలకు అవసరమయ్యే పథకాలు ఏవీ లేవన్నారు. సామాన్యులే వైసీపీకి స్టార్ క్యాంపెయినర్లు అని, తమ ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని, పథకాలకు వివరిస్తే సరిపోతుందన్నారు.

‘2019లో ఒక్కసారి అధికారం ఇస్తే రైతులకు రైతు భరోసా ఇచ్చాం. గ్రామ స్థాయిలో ఆర్బీకేలను తీసుకొచ్చాం. రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ నిరంతరాయంగా అందించాం. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించాం. రైతులకు ఉచిత పంటల బీమా ఇచ్చింది వైసీపీ సర్కారే. 87 వేల కోట్ల రుణమాఫీని చంద్రబాబు ఓ మోసంలా మార్చారో రైతులందరికీ తెలుసు. వైసీపీ ప్రభుత్వంలో అక్కాచెల్లెమ్మలకు అమ్మ ఒడి, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం. 31 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ, లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. మహిళల రక్షణ కోసం దిశా పోలీస్ యాక్ట్. పిల్లలకు ఇంగ్లీష్ చదవులు తీసుకొచ్చాం. పెత్తందార్ల పిల్లలతో సామాన్యుల పిల్లలు పోటీ పడాలన్నా, ఇంగ్లీష్ లో మాట్లాడాలన్నా మరోసారి జగన్ అధికారంలోకి రావాలి. అప్పుడే పేదల పిల్లలకు ఇతర రాష్ట్రాల్లోనే కాదు, విదేశాల్లోనూ ఉపాధి అవకాశాలు లభిస్తాయని’ జగన్ పేర్కొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!

వీడియోలు

Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget