అన్వేషించండి

Madanapalle News: మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ ఆర్డీవో అరెస్ట్

Madanapalle RDO Murali Arrest | మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ దగ్ధం కేసులో మదనపల్లె మాజీ ఆర్డీవో మురళిని ఏపీ సీఐడీ పోలీసులు తిరుపతిలో అరెస్ట్ చేశారు.

తిరుపతి: మదనపల్లె మాజీ ఆర్డీవో మురళిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతిలోని తన నివాసంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సుప్రీంకోర్టు మురళికి ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేసిన క్రమంలో ఈ అరెస్ట్ జరిగింది. గతేడాది జులై 21న మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో జరిగిన దస్త్రాల దహనం కేసులో మురళి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ ఫైల్స్ దగ్ధం ఘటనలో పలు ముఖ్యమైన రికార్డులు, దస్త్రాలు దగ్ధమయ్యాయి. ఈ కేసులో మురళి పాత్రపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.

2022 అక్టోబర్ నుండి 2024 ఫిబ్రవరి 5 వరకు మదనపల్లెలో ఆర్డీవోగా పని చేసిన మురళి, సబ్‌కలెక్టర్ కార్యాలయంలో మంటలు చెలరేగి పలు దస్త్రాలు దగ్ధం అయ్యాయి. ఈ కేసులో పలు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. మురళి జూన్ 2న సుప్రీంకోర్టు నుండి మధ్యంతర బెయిల్ పొందగా, తాజాగా సుప్రీంకోర్టు ఆ బెయిల్‌ను రద్దు చేయడంతో పోలీసులు మాజీ ఆర్డీఓ మురళిని అరెస్ట్ చేశారు.

కేసు పరిణామాలు
2024 జులై 21న మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో మంటలు చెలరేగి ఫైల్స్ దగ్ధం అయ్యాయి. ఈ కేసులో మురళి నిందితుడిగా ఉన్నాడు. పోలీసులు ఈ కేసును తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నా, పూర్తి స్థాయిలో సాక్ష్యాలు లభ్యం కాలేదు. మరిన్ని వివరాలను సేకరించడం కోసం మాజీ ఆర్డీఓ మురళిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాల్సి ఉందని అధికారులు భావిస్తున్నారు. 

ఆర్థిక మోసాలు, దస్త్రాల దహనం:
ఈ కేసులో ఆర్థిక మోసాలకు సంబంధించి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రికార్డులు దగ్ధం కావడంతో, ఆ డాక్యుమెంట్లలో ఉన్న కీలక సమాచారం దొరకకపోవడంతో వివిధ శాఖలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో అప్పటి ఆర్డీవో మురళి అరెస్టు కీలకంగా మారింది. మురళి త్వరలోనే కోర్టులో విచారణకు హాజరుకావాల్సి ఉంది.

సుప్రీంకోర్టు బెయిల్ రద్దు
సుప్రీంకోర్టు జూన్ 2న ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. గురువారం నాడు మధ్యంతర బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో శుక్రవారం నాడు సీఐడీ పోలీసులు మురళీని అరెస్ట్ చేశారు. మరోవైపు సీఐడీ పోలీసులు మురళి పై దర్యాప్తు కొనసాగిస్తుండగా, కస్టడీకి తీసుకున్నాక ఫైల్స్ దగ్దం కేసులో అతని పాత్రపై క్లారిటీ రానుంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Montha Cyclone Damage: తెలంగాణ రైతులను దెబ్బకొట్టిన ‘మొంథా’ తుపాను - 4.47 లక్షల ఎకరాల్లో పంట నష్టం, పరిహారంపై సాయంత్రానికి ప్రకటన!  
తెలంగాణ రైతులను దెబ్బకొట్టిన ‘మొంథా’ తుపాను - 4.47 లక్షల ఎకరాల్లో పంట నష్టం, పరిహారంపై సాయంత్రానికి ప్రకటన!  
Khammam Crime News: ఖమ్మంలో దారుణం - సిపీఎం నేతను గొంతు కోసి చంపిన దుండగులు  
ఖమ్మంలో దారుణం - సిపీఎం నేతను గొంతు కోసి చంపిన దుండగులు  
Jemimah Rodrigues: ఐదు నిమిషాల ముందు ఆర్డర్ మార్చారు…. అయినా అదరగొట్టేసింది. చిరకాలం గుర్తుండే ఇన్సింగ్స్ ఆడిన చిరుత జెమీమా
ఐదు నిమిషాల ముందు ఆర్డర్ మార్చారు…. అయినా అదరగొట్టేసింది. ఆసీస్‌ను చిరుతలా వేటాడిన జెమీమా
Mohammad Azharuddin: మొహమ్మద్ అజారుద్దీన్ కంటే ముందు ఈ నలుగురు క్రికెటర్లు మంత్రులు అయ్యారు!
మొహమ్మద్ అజారుద్దీన్ కంటే ముందు ఈ నలుగురు క్రికెటర్లు మంత్రులు అయ్యారు!
Advertisement

వీడియోలు

Montha Cyclone Effect | ఖమ్మం జిల్లాలో లారీతో సహా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన డ్రైవర్ | ABP Desam
Mumbai Kidnapper Rohit Arya Incident | ఆడిషన్ కి వచ్చిన పిల్లల్ని కిడ్నాప్ చేస్తే...ముంబై పోలీసులు పైకి పంపించారు | ABP Desam
India vs Australia 2025 | Shafali Verma | సెమీస్‌కు ముందు భారత జట్టులో షెఫాలీ
India vs Australia | Womens World Cup 2025 | నేడు ఆస్ట్రేలియాతో భారత్ ఢీ
Rohit Sharma | ICC ODI Rankings | ప్రపంచ నంబర్ 1 బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Montha Cyclone Damage: తెలంగాణ రైతులను దెబ్బకొట్టిన ‘మొంథా’ తుపాను - 4.47 లక్షల ఎకరాల్లో పంట నష్టం, పరిహారంపై సాయంత్రానికి ప్రకటన!  
తెలంగాణ రైతులను దెబ్బకొట్టిన ‘మొంథా’ తుపాను - 4.47 లక్షల ఎకరాల్లో పంట నష్టం, పరిహారంపై సాయంత్రానికి ప్రకటన!  
Khammam Crime News: ఖమ్మంలో దారుణం - సిపీఎం నేతను గొంతు కోసి చంపిన దుండగులు  
ఖమ్మంలో దారుణం - సిపీఎం నేతను గొంతు కోసి చంపిన దుండగులు  
Jemimah Rodrigues: ఐదు నిమిషాల ముందు ఆర్డర్ మార్చారు…. అయినా అదరగొట్టేసింది. చిరకాలం గుర్తుండే ఇన్సింగ్స్ ఆడిన చిరుత జెమీమా
ఐదు నిమిషాల ముందు ఆర్డర్ మార్చారు…. అయినా అదరగొట్టేసింది. ఆసీస్‌ను చిరుతలా వేటాడిన జెమీమా
Mohammad Azharuddin: మొహమ్మద్ అజారుద్దీన్ కంటే ముందు ఈ నలుగురు క్రికెటర్లు మంత్రులు అయ్యారు!
మొహమ్మద్ అజారుద్దీన్ కంటే ముందు ఈ నలుగురు క్రికెటర్లు మంత్రులు అయ్యారు!
Sai Durgha Tej : ఫోకస్ ఓన్లీ ఆన్ 'సంబరాల ఏటిగట్టు' - ఆ రూమర్స్‌కు చెక్ పెట్టేసిన సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్
ఫోకస్ ఓన్లీ ఆన్ 'సంబరాల ఏటిగట్టు' - ఆ రూమర్స్‌కు చెక్ పెట్టేసిన సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్
పిఎం కిసాన్ యోజన తదుపరి వాయిదా ఎప్పుడు రావచ్చు? ఎవరికి ప్రయోజనం లభిస్తుంది ? స్టాటస్‌ ఎలా చెక్‌ చేయాలి?
పిఎం కిసాన్ యోజన తదుపరి వాయిదా ఎప్పుడు రావచ్చు? ఎవరికి ప్రయోజనం లభిస్తుంది ? స్టాటస్‌ ఎలా చెక్‌ చేయాలి?
MS Raju Bhagavad Gita Issue: భగవద్గీతపై వివాదాస్పద వ్యాఖ్యలు - హిందూ సంస్థల ఆగ్రహం - క్షమాపణ చెప్పిన  TTD బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు
భగవద్గీతపై వివాదాస్పద వ్యాఖ్యలు - హిందూ సంస్థల ఆగ్రహం - క్షమాపణ చెప్పిన TTD బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు
EPS Pension Eligibility : PFలో 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేస్తే చాలట.. పెన్షన్ కూడా వస్తుందట, రూల్స్ ఇవే
PFలో 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేస్తే చాలట.. పెన్షన్ కూడా వస్తుందట, రూల్స్ ఇవే
Embed widget