అన్వేషించండి

Nara Lokesh: కర్ణాటక ప్రభుత్వం బ్లాక్ మెయిల్ కామెంట్స్, విశాఖకు రావాలని ఆ సీఈవోకు నారా లోకేష్ ఆహ్వానం

బెంగళూరులో గుంతల రోడ్లు, దుమ్ము, భారీ వర్షాలు ట్రాఫిక్ తో ఇబ్బంది అని పోస్ట్ చేసిన బ్లాక్ బక్ కంపెనీ సీఈవో రాజేశ్ యాబాజీని విశాఖకు రావాలని నారా లోకేష్ ఆహ్వానించారు.

Nara Lokesh Tries to relocate Black Buck to Vizag from Bengaluru | అమరావతి: బెంగళూరులో భారీ వర్షాలు, ట్రాఫిక్ సమస్యలు, రహదారుల్లో గుంతలు ప్రతి వర్షాకాలంలో జాతీయ స్థాయిలో చర్చకు తెరతీస్తుంటాయి. ఇటీవల ‘‘బ్లాక్‌బక్’’ అనే కంపెనీ సీఈఓ రాజేశ్ యాబాజీ చేసిన ఒక ట్వీట్ కర్ణాటక వ్యాప్తంగా దుమారం రేపింది. ఈ విషయం జాతీయ స్థాయిలో మరోసారి ప్రస్తావనకు వచ్చింది. బ్లాక్ బక్ కంపెనీ సీఈవో "రోడ్లు గుంతలతో నిండిపోయి, దుమ్ముతో ఉన్న రోడ్లతో విసిగిపోయాను. ఇది మాకు చాలా ఇబ్బందికరంగా మారింది. గత ఐదేళ్లుగా ఈ పరిస్థితిలో ఎటువంటి మార్పు కూడా కనిపించడం లేదు. ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అనుకుంటనున్నా" అని రాజేశ్ యాబాజీ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ కి కర్ణాటక ప్రభుత్వ నుంచి "బ్లాక్‌మెయిల్" అనే తరహాలో సమాధానం వచ్చింది.

విశాఖకు రావాలని ఆహ్వానించిన నారా లోకేష్

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. బ్లాక్ బక్ కంపెనీ సీఈవో రాజేశ్ యాబాజీని విశాఖపట్నం రావాలని ఆహ్వానించారు. ‘‘హాయ్ రాజేశ్, మీ కంపెనీని విశాఖకి తరలించేందుకు నేను ఆసక్తిగా ఉన్నాను.  భారతదేశంలోని టాప్ 5 పరిశుభ్రమైన నగరాల్లో విశాఖపట్నం ఒకటి కాబట్టి, ఇక్కడ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నాం. అదేవిధంగా, మహిళలకు అత్యంత సురక్షిత నగరంగా విశాఖ గుర్తింపు పొందింది. ఈ విషయంలో ఏమైనా సాయం కావలంటే దయచేసి నన్ను నేరుగా సంప్రదించండి’’ అని  ఎక్స్ వేదికగా నారా లోకేష్ పోస్ట్ చేశారు.

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇటీవల స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌ అన్న పదాలు ప్రభుత్వం పట్టించుకోదు అని వ్యాఖ్యానించారు. బెంగళూరు సిటీ ప్రపంచస్థాయి సంస్థలకు ఆకర్షణీయంగా ఉందని, రోడ్డు మరమ్మతుల కోసం రూ. 1,100 కోట్లను కేటాయించామని చెప్పారు. అలాగే, కాంట్రాక్టర్లకు నవంబర్ చివరి వరకు గడువు ఇచ్చామని, ఎవరి బ్లాక్ మెయిల్ కు మేం భయపడేది లేదన్నారు. 

ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నారా లోకేష్ తాజాగా స్పందించారు. ‘ఇతర రాష్ట్రాలకు, ప్రత్యేకంగా ఏపీకి ఉన్న తేడా ఇదే. మా ప్రజల ఫిర్యాదులను మేము పట్టించుకుంటాం. కానీ బ్లాక్‌మెయిల్ అని పదాలు వాడుతూ తోసిపుచ్చం. మేం వారి ఫిర్యాదులను, అభిప్రాయాలను  మర్యాదపూర్వకంగా స్వీకరించి, పరిష్కారం కోసం ప్రయత్నిస్తాం’’ అని నారా లోకేష్ ఎక్స్ వేదికగా మరో పోస్ట్ చేశారు.

బ్లాక్ బక్ సీఈవో ఏమన్నారంటే..
గత 9 సంవత్సరాలుగా ORR (బెల్లందూర్) మా ఇల్లు, ఆఫీసుగా ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ కొనసాగడం చాలా కష్టంగా మారింది. మేం బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. గత కొంతకాలం నుచి నా సహోద్యోగుల సగటు ప్రయాణ సమయం 1.5+ గంటలకు పెరిగింది (కేవలం ఒకవైపు ప్రయాణం).  గుంతలు, దుమ్ముతో నిండిన రోడ్లు, వాటిని సరిదిద్దాలనే ఉద్దేశ్యం తక్కువగా ఉండటంతో ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నాకు ఏ మార్పు కనిపించలేదు అని రాజేశ్ యాబాజీ తన పోస్టులో రాసుకొచ్చారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Embed widget