అన్వేషించండి

Totapuri mango Bans: మూడు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్న "మామిడి పండు"; అందులో ఏపీ కూడా...!

Totapuri mango Bans: ఓ రకమైన మామిడి పండు మూడు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టింది. ఏకంగా సీఎంల మధ్య లేఖల రాయబారాలు నడిచాయి.

Totapuri mango Bans: 'తోతాపురి '  మామిడి పండు.. 'S' షేపులో ఆకర్షణీయం గా ఉండే  ఈ రకం మామిడిని "కలెక్టర్ మామిడి " అని ఆంధ్రా ప్రాతంలో పిలుస్తారు. నార్త్‌లో బాగా ఫేమస్ అయిన ఈ పండు ఏపీలో రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరులో ఎక్కువగా సాగులో ఉంది. ఆంధ్రా ప్రాంతంలో దీన్ని పెద్దగా తినరు. అక్కడ ఎక్కువగా బంగినపల్లి, రసాలు, పంచదార కల్తీ, పండూరు రకాలకు డిమాండ్. అయితే "కలెక్టర్ కాయ' రకం మామిడిని మ్యాంగో పల్ప్ (గుజ్జు ) తయారు చేయడంలో ఎక్కువగా వాడతారు. ఎక్కువకాలం నిలువ ఉండడంతపాటు గుజ్జు ఎక్కువగా ఉండడంతో 'తోతాపురి "ని ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ "తోతాపురి" మామిడి ఏకంగా మూడు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టింది.  ఆంధ్రా, కర్ణాటకతోపాటు తమిళనాడు మామిడి రైతులు, ప్రాసెసింగ్ వ్యాపారుల మధ్య  ఇది వివాదం రేపింది. చివరకు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి " తోతాపురి " మామిడి దిగుమతులను అధికారుల నిషేదించడంతో  ఇది  ప్రభుత్వాల స్థాయిలో  వివాదం రేపే స్థాయికి చేరిపోయింది.

ఇతర రాష్ట్రాల నుంచి"తోతాపురి" మామిడి దిగుమతిని ఏపీ ఎందుకు వద్దు అంటోంది 

ఏపీలోని కృష్ణా జిల్లాతో సమానంగా మామిడి సాగులో పోటీ పడేది చిత్తూరు జిల్లా. చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు తీసి ఎగుమతి చేసే పరిశ్రమలు 47 ఉన్నాయి. వీటిలో చాలా వరకూ 2014-19 మధ్య కాలం లో తెరిచినవే. ఈ సీజన్‌లో వాటిలో 16 పరిశ్రమలను ఓపెన్ చేసి మామిడి గుజ్జు తయారుచేస్తున్నారు. దీనికోసం జిల్లా రైతుల నుంచి మామిడి పళ్ళను సేకరించడం మొదలు పెట్టారు. అయితే రైతులు కేజీ "తోతాపురి' మామిడి పళ్లకి కనీసం 12 రూపాయల మద్దతు ధర డిమాండ్ డిమాండ్ చేయడంతో ప్రభుత్వం వారికి పరిశ్రమలు 8 రూపాయలు ప్రభుత్వం తరపున 4 రూపాయలు కలిపి 12 రూపాయలు అందేలా నిర్ణయం తీసుకుంది. దీనిపై  మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు అడ్డు చెప్పారు. ఓపెన్ మార్కెట్ లో "తోతా పురి " మామిడి రేటు కేజీ 5 రూపాయల కంటే ఎక్కువ లేదు. అలాంటప్పుడు తాము 8 రూపాయల చొప్పున ఎందుకు ఇవ్వాలనేది వారి అభ్యంతరం. పైపెచ్చు ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉండే "గుడిపాల " మండలం ద్వారా ఏపీలోకి పక్క రాష్ట్రాల రైతులు తమ మామిడిపండ్లను తక్కువ రేటుకే చిత్తూరులోని పరిశ్రమలకు తరలిస్తున్నారు. దీనికి చిత్తూరు జిల్లా మామిడి రైతులు అడ్డు చెప్పడంతో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమీత్ కుమార్ జిల్లా లోని పరిశ్రమ లు వేరే రాష్ట్రాల నుంచి మామిడి కొనకుండా పరిశ్రమలను ఆదేశించారు. పైగా షిఫ్టింగ్ పద్దతిలో పరిశ్రమల వద్ద ఉద్యోగులకు డ్యూటీ లు వేసి మామిడి పళ్ళని అమ్మడానికి వచ్చే రైతుల ఆధార్ కార్డులు, పాస్ బుక్ జిరాక్స్ లు, ఈ క్రాప్ బుకింగ్ వివరాలు, రాయితీ నమోదు వివరాలు చెక్ చేస్తున్నారు. స్థానిక రైతుల మంచి కోసమే ఈ ఆంక్షలు తెచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.

చంద్రబాబు కి లేఖ రాసిన కర్ణాటక సీఎం 

అయితే ఈ పరిణామంపై పక్క రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటక అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య  ఈ నిర్ణయంపై మరోసారి ఆలోచించాలని ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఇతర జిల్లాల్లో లేని ఆంక్షలు ఒక్క చిత్తూరులోని ఎందుకు అని  ఆయన లేఖలో అడిగారు. ఇక కర్ణాటక చీఫ్ సెక్రటరీ శాలిని రాజనీష్ కూడా ఏపీ చీఫ్ సెక్రటరీకి లేఖ రాస్తూ నిర్ణయం " చిరకాల సెంటిమెంట్" లను దెబ్బతీసేలా ఉందని పేర్కొన్నట్టు తెలుస్తోంది. కోలార్ లోని మూడు గుజ్జు పరిశ్రమలు, తుముకూరు దగ్గర మరో పరిశ్రమ తెరవని కారణం వల్లనే వారు చిత్తూరు జిల్లాలోని గుజ్జు పరిశ్రమలకు తమ మామిడిపళ్ళను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో అలా పక్క రాష్ట్రం నుంచి వచ్చే మామిడిపండ్లపై  బ్యాన్ విధించడం తో అక్కడ వివాదం రాజుకుంది. 

టమాటా  మార్కెట్ పై ప్రభావం 

ఏషియాలోనే అతిపెద్ద టమాట మార్కెట్ లు తమిళనాడులోని కోయంబేడు, చిత్తూరులోని మదనపల్లి, కర్ణాటకలోని కోలార్ లలో ఉన్నాయి. ఇప్పుడు ఇలా పక్క రాష్ట్రం నుంచి వచ్చే మామిడి పళ్ళపై చిత్తూరు జిల్లాలో బ్యాన్ విధిస్తే రేపు దీని ప్రభావం జిల్లాలోని టమాట రైతులపై  పడే ప్రభావం ఉందని వ్యాపారులు గుర్తు చేస్తున్నారు. మరి ఈ వివాదం రానున్న రోజుల్లో మరెన్ని పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

టాప్ హెడ్ లైన్స్

RK Roja: మాజీ మంత్రి ఆర్‌కే రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు.. ఈ 30న విచారణ
మాజీ మంత్రి ఆర్‌కే రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు.. ఈ 30న విచారణ
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
Tirumala Laddu Ghee Adulteration Case: తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో కీలక మలుపు! అధికారులపై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశం!
తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో కీలక మలుపు! అధికారులపై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశం!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget