అన్వేషించండి

TTD Workers: జగనన్న మాట నిలబెట్టుకో...రెగ్యులరైజ్ చేయాలని టీటీడీ కార్మికుల ఆందోళన... ముగ్గురు ఉద్యోగులపై వేటు

అధికారంలోకి రాగానే టైం స్కేల్ ఇస్తానని సీఎం జగన్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని టీటీడీ కార్మికులు డిమాండ్ చేశారు. టీటీడీ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్నారు.

ఎన్నికలకు ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని టీటీడీ కార్మికులు డిమాండ్ చేశారు. టీటీడీ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని ఆందోళన చేపట్టారు. నేడు, రేపు సీఎం జగన్ తిరుపతి పర్యటనలో ఉన్నారు. టీటీడీ కార్మికుల సమస్యలపై సీఎం జగన్ స్పందించాలని కార్మికులు కోరారు. టీటీడీ పరిపాలనా భవనం ముందు కార్మికులు చేపట్టిన ఆందోళన నేటితో ఐదో రోజుకు చేరింది. కార్మికులు మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభానికి ముందు రోజు తిరుమల కొండపై టీటీడీ కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో టైం స్కేల్ ఇస్తానన్న మాట నిలబెట్టుకోవాలన్నారు. కార్మికుల విషయంలో మాట తప్పడం ఎంత వరకూ సమంజసమన్నారు. TTD Workers: జగనన్న మాట నిలబెట్టుకో...రెగ్యులరైజ్ చేయాలని టీటీడీ కార్మికుల ఆందోళన... ముగ్గురు ఉద్యోగులపై వేటు

Also Read: ఉత్తరాంధ్రపై విరుచుకుపడనున్న జవాద్ తుఫాన్.. ముందు జాగ్రత్తలపై సీఎం జగన్ సమీక్ష

సీఎం జగన్ వీరాభిమాని ఆవేదన

టీటీడీ ఛైర్మన్, ఈవో, జేఈవో, పాలకమండలి పెద్దలు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి భిన్నంగా వ్యవహరిస్తూ కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని కార్మికులు విమర్శించారు. ధరలు పెరిగి బతుకులు దుర్భరంగా ఉన్న సమయంలో కార్మికులకు ఊరట కల్పించాల్సిన టీటీడీ యాజమాన్యం తేలిక భావంతో మాట్లాడుతూ ఉన్నారని విమర్శించారు. అనంతరం టీటీడీ‌ కార్మికురాలు రాధా మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ కార్మికులను కాంట్రాక్టర్ల బారి నుంచి కాపాడాలని, కార్పొరేషన్ లో కలపాలని డిమాండ్ చేశారు. సీఎం కార్మికుల సమస్యలపై జోక్యం చేసుకుని మేలు చేయక పోతే కార్మికులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ తాను వీరాభిమాని అని తాను నాలుగు సార్లు సీఎంను కలిసి తమ గోడు విన్నవించుకునేందుకు తాడేపల్లికి వెళ్లి కలిసే ప్రయత్నం చేసిన అక్కడి అధికారులు కోవిడ్ కారణంగా కలవనీయలేదని టీటీడీ కార్మికురాలు రాధ ఆవేదన వ్యక్తం చేసింది. 

Also Read: వరద బాధితులకు సీఎం జగన్ పరామర్శ... మృతుల కుటుంబాల్లో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం.. ఇళ్లు కోల్పోయిన వారికి 5 సెంట్ల స్థలం

ముగ్గురు ఉద్యోగులపై వేటు

కార్మికులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపిన ముగ్గురు ఉద్యోగులపై టీటీడీ సస్పెషన్ వేటు చేసింది. టీటీడీ కార్మికుల ధర్నాకు మద్దతు పలికారని చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న నాగార్జున్, గుణశేఖర్, వేంకటేశం లను సస్పెండ్ చేశారు. గత ఐదు రోజులుగా తిరుపతి ఏడీ బిల్డింగ్ ముందు కాంట్రాక్ట్ నుంచి కార్పొరేషన్ లో కలపాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. 

Also Read: ఏపీ, ఒడిశాపై జవాద్ తుపాను ప్రభావం... 100కు పైగా రైళ్ల రద్దు... ప్రధాని మోదీ సమీక్ష

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

టాప్ హెడ్ లైన్స్

PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
Rajamahendravaram News: రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్
రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget