అన్వేషించండి

TTD Workers: జగనన్న మాట నిలబెట్టుకో...రెగ్యులరైజ్ చేయాలని టీటీడీ కార్మికుల ఆందోళన... ముగ్గురు ఉద్యోగులపై వేటు

అధికారంలోకి రాగానే టైం స్కేల్ ఇస్తానని సీఎం జగన్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని టీటీడీ కార్మికులు డిమాండ్ చేశారు. టీటీడీ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్నారు.

ఎన్నికలకు ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని టీటీడీ కార్మికులు డిమాండ్ చేశారు. టీటీడీ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని ఆందోళన చేపట్టారు. నేడు, రేపు సీఎం జగన్ తిరుపతి పర్యటనలో ఉన్నారు. టీటీడీ కార్మికుల సమస్యలపై సీఎం జగన్ స్పందించాలని కార్మికులు కోరారు. టీటీడీ పరిపాలనా భవనం ముందు కార్మికులు చేపట్టిన ఆందోళన నేటితో ఐదో రోజుకు చేరింది. కార్మికులు మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభానికి ముందు రోజు తిరుమల కొండపై టీటీడీ కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో టైం స్కేల్ ఇస్తానన్న మాట నిలబెట్టుకోవాలన్నారు. కార్మికుల విషయంలో మాట తప్పడం ఎంత వరకూ సమంజసమన్నారు. TTD Workers: జగనన్న మాట నిలబెట్టుకో...రెగ్యులరైజ్ చేయాలని టీటీడీ కార్మికుల ఆందోళన... ముగ్గురు ఉద్యోగులపై వేటు

Also Read: ఉత్తరాంధ్రపై విరుచుకుపడనున్న జవాద్ తుఫాన్.. ముందు జాగ్రత్తలపై సీఎం జగన్ సమీక్ష

సీఎం జగన్ వీరాభిమాని ఆవేదన

టీటీడీ ఛైర్మన్, ఈవో, జేఈవో, పాలకమండలి పెద్దలు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి భిన్నంగా వ్యవహరిస్తూ కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని కార్మికులు విమర్శించారు. ధరలు పెరిగి బతుకులు దుర్భరంగా ఉన్న సమయంలో కార్మికులకు ఊరట కల్పించాల్సిన టీటీడీ యాజమాన్యం తేలిక భావంతో మాట్లాడుతూ ఉన్నారని విమర్శించారు. అనంతరం టీటీడీ‌ కార్మికురాలు రాధా మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ కార్మికులను కాంట్రాక్టర్ల బారి నుంచి కాపాడాలని, కార్పొరేషన్ లో కలపాలని డిమాండ్ చేశారు. సీఎం కార్మికుల సమస్యలపై జోక్యం చేసుకుని మేలు చేయక పోతే కార్మికులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ తాను వీరాభిమాని అని తాను నాలుగు సార్లు సీఎంను కలిసి తమ గోడు విన్నవించుకునేందుకు తాడేపల్లికి వెళ్లి కలిసే ప్రయత్నం చేసిన అక్కడి అధికారులు కోవిడ్ కారణంగా కలవనీయలేదని టీటీడీ కార్మికురాలు రాధ ఆవేదన వ్యక్తం చేసింది. 

Also Read: వరద బాధితులకు సీఎం జగన్ పరామర్శ... మృతుల కుటుంబాల్లో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం.. ఇళ్లు కోల్పోయిన వారికి 5 సెంట్ల స్థలం

ముగ్గురు ఉద్యోగులపై వేటు

కార్మికులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపిన ముగ్గురు ఉద్యోగులపై టీటీడీ సస్పెషన్ వేటు చేసింది. టీటీడీ కార్మికుల ధర్నాకు మద్దతు పలికారని చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న నాగార్జున్, గుణశేఖర్, వేంకటేశం లను సస్పెండ్ చేశారు. గత ఐదు రోజులుగా తిరుపతి ఏడీ బిల్డింగ్ ముందు కాంట్రాక్ట్ నుంచి కార్పొరేషన్ లో కలపాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. 

Also Read: ఏపీ, ఒడిశాపై జవాద్ తుపాను ప్రభావం... 100కు పైగా రైళ్ల రద్దు... ప్రధాని మోదీ సమీక్ష

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

టాప్ హెడ్ లైన్స్

Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. లిక్కర్ కేసులో ఇరికించే ప్రయత్నమన్న వైసీపీ నేత
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. లిక్కర్ కేసులో ఇరికించే ప్రయత్నమన్న వైసీపీ నేత
Atchannaidu: జలధార జలహారతితో 79,826 పనులు పూర్తి.. భూగర్భ జలాలు 0.79 మీటర్లు పెరుగుదల: అచ్చెన్నాయుడు
జలధార జలహారతితో 79,826 పనులు పూర్తి.. భూగర్భ జలాలు 0.79 మీటర్లు పెరుగుదల: అచ్చెన్నాయుడు
Land For Poor People: దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
AP News : నంది అవార్డ్స్‌కు సీఎం గ్రీన్ సిగ్నల్! - వారికి లక్ష పురస్కారం... ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
నంది అవార్డ్స్‌కు సీఎం గ్రీన్ సిగ్నల్! - వారికి లక్ష పురస్కారం... ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Land For Poor People: దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
Sharmila Daughter Wedding: కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. YSRకు ఫస్ట్ కార్డ్
కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. నాన్న YSRకు ఫస్ట్ కార్డ్
TMC New Name And Logo: టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.. మమతా బెనర్జీ పార్టీ పేరు, వివరాలు
టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.. మమతా బెనర్జీ పార్టీ పేరు, వివరాలు
Vijayasai Reddy: ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
The India Story OTT : ఓటీటీలోకి సడన్‌గా కాజల్ అగర్వాల్ కొత్త మూవీ - కోర్ట్ రూమ్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి సడన్‌గా కాజల్ అగర్వాల్ కొత్త మూవీ - కోర్ట్ రూమ్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' ఎందులో చూడొచ్చంటే?
AP Congress : ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
రూ.10 లక్షల లోపు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌.. బలెనో, i20లో మీకు ఏది సరిపోతుందంటే?
బలెనో vs i20.. టాప్‌ వేరియంట్లలో ఏ కారు ఎక్కువ ఫీచర్లు ఇస్తుందో తెలుసా?
Embed widget