అన్వేషించండి

Tirumala RTC Charges : శ్రీవారి భక్తులకు అలెర్ట్, భారీగా పెరిగిన తిరుమల-తిరుపతి ఆర్టీసీ బస్సుల ఛార్జీలు

Tirumala RTC Charges : తిరుమల శ్రీవారి భక్తులపై మరింత భారం పడనుంది. డీజిల్ సెస్ ఛార్జీల పెంపుతో తిరుమల తిరుపతి మధ్య నడిచే ఆర్టీసీ బస్సుల ఛార్జీలు భారీగా పెరిగాయి.


Tirumala RTC Charges : తిరుమల శ్రీవారి భక్తులకు ఆర్టీసీ ప్రయాణం మరింత భారంగా మారనుంది. ఏపీఎస్ఆర్టీసీ డీజిల్ సెస్ పెంపుతో ఛార్జీలు పెరిగాయి. దీంతో తిరుమల-తిరుపతి మధ్య నడిచే ఆర్టీసీ బస్సుల ఛార్జీలు కూడా పెరిగాయి. తిరుమల, తిరుపతి మధ్య తిరిగే ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో ప్రతి టికెట్ పై అదనంగా రూ. 15 భారం పడనుంది. ప్రస్తుత ఛార్జీ రూ. 75 ఉండగా తాజా పెరుగుదలతో రూ. 90లకు చేరింది. పిల్లల టికెట్ ధర రూ. 45 నుంచి రూ. 50 పెరిగింది. కొండపైకి రానుపోను టికెట్ ధర రూ.130 ఉండగా తాజా పెంపుతో రూ. 160లకు చేరింది.  ధరల పెరుగులతో సామాన్యులపై మరింత భారం పడనుంది. ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచింది. ఇవాళ్టి నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. డీజిల్‌ సెస్‌ పెంపుతో ఛార్జీలు పెంచడం తప్పడం లేదని ఆర్టీసీ అధికారులు తెలిపారు. 

ఏపీఎస్ఆర్టీసీ ఛార్జీలు పెంపు

ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు మరోసారి పెరిగాయి. డీజిల్‌ సెస్‌ పెంపుతో ఛార్జీలు పెంచాల్సి వస్తుందని అధికారులు అంటున్నారు. డీజిల్‌ సెస్‌ పెంపు నుంచి సిటీ బస్సులకు మినహాయింపు ఇస్తున్నట్టు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. డీజిల్‌ సెస్‌ పెంపుతో పలు రాష్ట్రాలు ఆర్టీసీ ఛార్జీలు పెంచుతున్నాయి. టీఎస్ఆర్టీసీ కూడా డీజిల్ సెస్ కారణంగా పలుమార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచింది. తాజాగా ఏపీఎస్‌ఆర్టీసీ తాజాగా ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి పెంచిన టికెట్‌ ధరలు అమల్లోకి వచ్చాయి. ఏపీలో సిటీ సర్వీసులు మినహా అన్ని బస్సుల్లో డీజిల్ సెస్‌ను ఆర్టీసీ పెంచింది. 

తప్పనిసరి పరిస్థితుల్లో

తప్పనిసరి పరిస్థితుల్లో డీజిల్ సెస్ పెంచుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది. జూన్ 29న డీజిల్ మార్కెట్(బల్క్) ధర 131 రూపాయలకు  పెరిగిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. పెరుగుతున్న డీజల్ ధరల వలన ఆర్టీసీకి ప్రతి రోజు రూ.2.50 కోట్ల అధిక ఖర్చు అవుతుందన్నారు. బస్సుల నిర్వహణ ఖర్చులు పెరగడం, అవసరమైన టైర్లు, స్పేర్ పార్టుల ధర పెరగడంతో ఛార్జీల పెంపు అనివార్యమైందన్నారు. ఇది ప్రయాణికులపై వేసే భారం కాదన్నారు. అత్యవసర డీజిల్ పై వేసే సెస్ మాత్రమేనని వెల్లడించారు. స్లాబ్ పద్ధతిలో ప్రయాణికులు ప్రయాణం చేసే కిలోమీటర్ల ఆధారంగా డీజల్ సెస్ విధిస్తామన్నారు. వీటితో పాటు విద్యార్థుల బస్సు పాస్ ఛార్జీలు కూడా స్వల్పంగా పెరుగుతాయని ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జున రెడ్డి, ఎండీ ద్వారకా తిరుమల రావు ఓ ప్రకటనలో తెలిపారు. 

ఛార్జీల పెంపు 

పల్లె వెలుగు బస్సుల్లో కనీస ఛార్జీ రూ.10, తొలి 30 కిలోమీటర్ల వరకు డీజిల్ సెస్‌ పెంపులేదు. 35 నుంచి 60 కి.మీ వరకు అదనంగా రూ.5 లు సెస్‌ ఉంటుంది. 60 నుంచి 70 కి.మీ వరకు రూ.10 సెస్, 100 కి.మీ దాటితే రూ.120 సెస్‌ విధించారు. ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌ బస్సుల్లో ప్రస్తుతం టికెట్‌ ధరలపై రూ.5లు సెస్ వసూలు చేస్తున్నారు. ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో 30 కి.మీ వరకు డీజిల్ సెస్‌ పెంపు లేదు. 31 నుంచి 65 కి.మీ వరకు మరో రూ.5 సెస్‌, 66 నుంచి 80 కి.మీ వరకు  రూ.10 సెస్ పెంపు ఉంటుంది. సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో టికెట్‌పై రూ.10 డీజిల్ సెస్ వసూలు చేస్తారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో 55 కి.మీ వరకు సెస్ పెంపు లేదని అధికారులు తెలిపారు.  విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.70 సెస్ పెంపు ఉంటుంది. హైదరాబాద్ వెళ్లే అమరావతి బస్సుల్లో రూ.80 చొప్పున డీజిల్‌ సెస్‌ వసూలు చేస్తారు.

టాప్ హెడ్ లైన్స్

Annadata Sukhibhava Status Check Online: ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
Breaking News: మహారాష్ట్రలో విషాదం.. హనుమాన్ ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి
మహారాష్ట్రలో విషాదం.. హనుమాన్ ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి
Anantapur Temple Hundi Note Viral: అత్తను లేపేయాలని దేవుడికి రూ.20 సుపారీ ఇచ్చారు - కోడలా? అల్లుడా?
అత్తను లేపేయాలని దేవుడికి రూ.20 సుపారీ ఇచ్చారు - కోడలా? అల్లుడా?
Chandra Babu Naidu Yoga With Ramdev Baba: అమరావతిలోని ఉండవల్లి గుహల్లో యోగాంధ్ర వైబ్స్! రామ్‌దేవ్ బాబాతో కలిసి సీఎం చంద్రబాబు యోగాసనాలు!
అమరావతిలోని ఉండవల్లి గుహల్లో యోగాంధ్ర వైబ్స్! రామ్‌దేవ్ బాబాతో కలిసి సీఎం చంద్రబాబు యోగాసనాలు!

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Annadata Sukhibhava Status Check Online: ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
Hanuman Temple Tragedy: మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
PM Modi Wearing Baagh Watch: ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
NEET Re-Exam: నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
KTR Latest News:
"కాంగ్రెస్ నేతల కాలర్ పట్టుకోండి - ఆత్మహత్యలు చేసుకోవద్దు" రైతులకు కేటీఆర్ సూచన! 
Allu Arjun : ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
Barmer Instagram Influencer Murder Case: నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
IND vs AFG 3rd ODI Records: రోహిత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ కాంబో హ్యాట్రిక్ వికెట్లు, అఫ్గాన్‌తో 3వ వన్డేలో అరుదైన రికార్డ్
రోహిత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ కాంబో హ్యాట్రిక్ వికెట్లు, అఫ్గాన్‌తో 3వ వన్డేలో అరుదైన రికార్డ్
Embed widget