అన్వేషించండి

Avinash Bail Case : అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ మళ్లీ శనివారం - వాదనలు వినిపించనున్న సీబీఐ !

అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ శనివారానికి వాయిదా పడింది. శనివారం సీబీఐ తరపు లాయర్లు వాదనలు వినిపించనున్నారు.

 

Avinash Bail Case :  వైఎస్ వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ పై విచారణ శనివారానికి వాయిదా పడింది. శుక్రవారం ఉదయం పదిన్నరకు ప్రారంభమైన విచారణలో మొదట అవినాష్ రెడ్డి తరపు లాయర్లు వాదనలు వినిపించారు. ఐదున్నర గంటల పాటు వాదనలు వినిపించిన తర్వాత..  సునీతారెడ్డి తరపు లాయర్లు గంట పాటు తమ వాదనలు వినిపించారు. ఇక సీబీఐ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించాల్సి ఉంది. దీంతో శనివారం ఉదయానికి విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. 

అవినాష్ రెడ్డి తరపు లాయర్లు ఏమని వాదించారంటే ? 

ఫోన్ కాల్స్ ఆధారంగా  అవినాష్ రెడ్డిని కేసులో ఇరికించాలని చూస్తున్నారని ఆయన తరపు లాయర్లు వాదించారు. వివేకానందరెడ్డిది హత్యో, గుండెపోటో చెప్పడానికి అవినాష్ రెడ్డి లాయరో, డాక్టరో కాదన్నారు.  2020 జులై 9న సీబీఐ FIR నమోదు చేసి 2021 జులై 21న రంగన్నను సీబీఐ విచారించిందని అవినాష్ రెడ్డి లాయర్‌ కోర్టుకు తెలిపారు. రంగన్న స్టేట్‌మెంట్‌ రికార్డు చేసి సంవత్సరం పాటు వదిలేశారని, స్టేట్‌మెంట్‌లో క్లియర్‌గా నలుగురి వివరాలు చెప్పాడని అవినాష్ లాయర్‌ అన్నారు. కానీ సీబీఐ నెలరోజుల పాటు దస్తగిరిని విచారణకు పిలవలేదని, దస్తగిరిని ఒక్కసారి కూడా అరెస్ట్ చేయలేదని అవినాష్ లాయర్‌ వాదించారు. మున్నా దగ్గర డబ్బు దొరికినా ఛార్జ్‌షీట్‌లో సాక్షిగా పేర్కొనలేదని, దస్తగిరి స్టేట్‌మెంట్‌లో అవినాష్ పేరు ఎక్కడైనా చెప్పాడా? అని జడ్జి ప్రశ్నించారు. దస్తగిరి దగ్గర 3 సార్లు 161 కింద సీబీఐ స్టేట్‌మెంట్‌ తీసుకుందని, మొదటి స్టేట్‌మెంట్‌లో ఎక్కడ అవినాష్ గురించి చెప్పలేదని అవినాష్ లాయర్‌ చెప్పారు. చివరి స్టేట్‌మెంట్‌లో గంగిరెడ్డి తనతో చెప్పిన వ్యాఖ్యలలో అవినాష్ తమ వెనుకాల ఉన్నాడని చెప్పినట్టు స్టేట్‌మెంట్‌ ఇచ్చారని లాయర్‌ పేర్కొన్నారు.

సునీత తరపు లాయర్ ఏం వాదించారంటే ?

వివేకా గుండె పోటుతో చనిపోయాడని చెప్పారని, రక్తపు వాంతులతో మృతి చెందినట్లు చెప్పారని, హత్య జరిగితే.. గుండె పోటు అని ఎలా చెపుతారని సునీతారెడ్డి తరుపు న్యాయవాది వాదించారు. ఇందులో కుట్ర దాగి ఉందని, రాజారెడ్డి, గంగి రెడ్డి హాస్పిటల్ నుంచి వచ్చి కుట్లు వేశారని న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు అవినాష్ రెడ్డి, కృష్ణారెడ్డి, గంగిరెడ్డి, శంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు ఉన్నారని సునీతారెడ్డి తరుపు న్యాయవాది రవిచంద్ వాదించారు. దాదాపుగా గంట సేపు సునతారెడ్డి తరపు లాయర్.. న్యాయమూర్తికి తన వాదనలు వినిపించారు. 

శనివారం సీబీఐ తరపు వాదనలు

సీబీఐ లాయర్ వాదనలు శనివారం వింటామని న్యాయమూర్తి తెలిపారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన అదనపు వివరాలను న్యాయమూర్తి ముందు సీబీఐ అధికారులు ఉంచారు. మరో వైపు అవినాష్ రెడ్డి  హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి చేరుకున్నారు. కర్నూలు నుంచి ఆమెను డిశ్చార్జ్ చేశారు వైద్యులు. అక్కడ్నుంచి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. తల్లి వెంట అవినాష్ రెడ్డి కూడా హైదరాబాద్ వచ్చారు. మరో వైపు జైల్లో ఉన్న  అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి  బీపీ పెరగడంతో.. నిమ్స్ లో చికిత్స చేయించి మళ్లీ జైలుకు తరలించారు. 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind vs Pak Final Tickets Available: భారత్, పాక్ మ్యాచ్ ఆసియా కప్ ఫైనల్ టికెట్లు ఇంకా ఉన్నాయి.. ధర, పూర్తి వివరాలు
భారత్, పాక్ మ్యాచ్ ఆసియా కప్ ఫైనల్ టికెట్లు ఇంకా ఉన్నాయి.. ధర, పూర్తి వివరాలు
Telangana Assembly Speaker: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ప్రత్యక్ష విచారణ - డేట్, టైం ఫిక్స్ చేసిన స్పీకర్ !
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ప్రత్యక్ష విచారణ - డేట్, టైం ఫిక్స్ చేసిన స్పీకర్ !
Number Plates for Old Vehicles: సెప్టెంబర్ 30లోగా నంబర్ ప్లేట్ మార్చకపోతే జరిమానాపై స్పందించిన రవాణా శాఖ
సెప్టెంబర్ 30లోగా నంబర్ ప్లేట్ మార్చకపోతే జరిమానాపై స్పందించిన రవాణా శాఖ
Modi Tour: అక్టోబర్ 16న కర్నూలులో మోదీ సహా కూటమి ముఖ్యనేతల రోడ్ షో -పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం
అక్టోబర్ 16న కర్నూలులో మోదీ సహా కూటమి ముఖ్యనేతల రోడ్ షో -పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం
Advertisement

వీడియోలు

Vijay Karur Stampede News | కరూర్ లో ఘోర విషాదం..విజయ్ సభలో 30మంది మృతి | ABP Desam
India vs Sri Lanka Asia Cup 2025 | Pathum Nissanka | నిశాంక సూపర్ సెంచరీ
India vs Sri Lanka Asia Cup 2025 | Arshdeep Singh | మలుపు తిప్పిన అర్ష్‌దీప్ సింగ్
India vs Sri Lanka Highlights Asia Cup 2025 | లంకపై విజయం సాధించిన భారత్
Asia Cup 2025 Sri Lanka Super Over | భారత్ పై పోరాడి ఓడిన లంక
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Pak Final Tickets Available: భారత్, పాక్ మ్యాచ్ ఆసియా కప్ ఫైనల్ టికెట్లు ఇంకా ఉన్నాయి.. ధర, పూర్తి వివరాలు
భారత్, పాక్ మ్యాచ్ ఆసియా కప్ ఫైనల్ టికెట్లు ఇంకా ఉన్నాయి.. ధర, పూర్తి వివరాలు
Telangana Assembly Speaker: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ప్రత్యక్ష విచారణ - డేట్, టైం ఫిక్స్ చేసిన స్పీకర్ !
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ప్రత్యక్ష విచారణ - డేట్, టైం ఫిక్స్ చేసిన స్పీకర్ !
Number Plates for Old Vehicles: సెప్టెంబర్ 30లోగా నంబర్ ప్లేట్ మార్చకపోతే జరిమానాపై స్పందించిన రవాణా శాఖ
సెప్టెంబర్ 30లోగా నంబర్ ప్లేట్ మార్చకపోతే జరిమానాపై స్పందించిన రవాణా శాఖ
Modi Tour: అక్టోబర్ 16న కర్నూలులో మోదీ సహా కూటమి ముఖ్యనేతల రోడ్ షో -పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం
అక్టోబర్ 16న కర్నూలులో మోదీ సహా కూటమి ముఖ్యనేతల రోడ్ షో -పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం
Kiran Abbavaram: థియేటర్లలో ఆ డైలాగ్స్ ఎంజాయ్ చేస్తున్నారు - 'కె ర్యాంప్' టైటిల్ వెనుక రీజన్ అదే... కిరణ్ అబ్బవరం కామెంట్స్
థియేటర్లలో ఆ డైలాగ్స్ ఎంజాయ్ చేస్తున్నారు - 'కె ర్యాంప్' టైటిల్ వెనుక రీజన్ అదే... కిరణ్ అబ్బవరం కామెంట్స్
Hyderabad to Kashmir IRCTC Package: హైదరాబాద్ నుంచి కాశ్మీర్ వెళ్లాలని ఉందా.. IRCTC 6 రోజుల టూర్ ప్యాకేజీ మీకోసం
హైదరాబాద్ నుంచి కాశ్మీర్ వెళ్లాలని ఉందా.. IRCTC 6 రోజుల టూర్ ప్యాకేజీ మీకోసం
Ind vs Pak Asia Cup Final: భారత్‌తో ఫైనల్ కు ముందు పాకిస్తాన్ కొత్త డ్రామా, చిచ్చురేపిన పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ
భారత్‌తో ఫైనల్ కు ముందు పాకిస్తాన్ కొత్త డ్రామా, చిచ్చురేపిన పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ
Congress Dues Card campaign: కాంగ్రెస్ బాకీ కార్డ్ ఉద్యమం చేపట్టిన బీఆర్ఎస్- ప్రజల చేతుల్లోకి పాశుపతాస్త్రాలు: కేటీఆర్
కాంగ్రెస్ బాకీ కార్డ్ ఉద్యమం చేపట్టిన బీఆర్ఎస్- ప్రజల చేతుల్లోకి పాశుపతాస్త్రాలు: కేటీఆర్
Embed widget