By: ABP Desam | Updated at : 27 Dec 2021 02:15 PM (IST)
రాజధాని ఫిటిషన్లపై విచారణ జనవరి 28కి వాయిదా
మూడు రాజధానుల బిల్లులను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకున్నప్పటికీ.. మళ్లీ బిల్లులు తెస్తామని చెబుతున్నందున విచారణ కొనసాగించాల్సిందేనని రైతుల తరపు లాయర్లు హైకోర్టు ధర్మాసనానికి విన్నవించారు. రాజధానిపై పిటిషన్లపై విచారణ సోమవారం హైకోర్టులో జరిగింది. విచారణ ప్రారంభమైన తర్వాత రైతుల తరపు న్యాయవాది శ్యామ్ దివాన్ ప్రభుత్వ వైఖరిని వివరించి... పిటిషన్లపై విచారణ కొనసాగించాల్సిందేననికోరారు. అమరావతి మాస్టర్ ప్లాన్ అమలు చేయాల్సిందేనన్నారు. రైతులకు సంబంధించి వాదనలు వినిపించిన లాయర్లు కూడా దాదాపుగా ఇదే కోరారు.
Also Read: ఆనందయ్య ఇంటి ఎదుట గ్రామస్థుల ధర్నా.. అందరూ వెళ్లిపోవాలని డిమాండ్, ఎందుకంటే..
ప్రభుత్వం విచారణ జరుగుతున్న సమయంలోనే కన్ని సంస్థలను బయటకు తరలిస్తోందని రైతుల తరపున మరో న్యాయవాది మురళీధర్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. సెలక్ట్ కమిటీ ఆమోదం లేకుండానే బిల్లును ఆమోదించినట్లు పేర్కొన్నారని ఇది రాజ్యాంగ విరుద్ధమని మరో న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. విచారణ కొనసాగింపు... ఇతర అంశాలపై పది రోజుల్లో పూర్తి స్థాయి కౌంటర్ వేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
అదే సమయంలో పిటిషనర్ల తరపున లాయర్లు తమ అఫిడవిట్లను పది రోజుల్లో దాఖలుచేయాలని సూచించింది. తదుపరి విచారణ జనవరి ఇరవై ఎనిమిదో తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ రోజున పూర్తి స్థాయి వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల బిల్లు, అలాగే సీఆర్డీఏబిల్లును రద్దు చేయడంపై రైతులు పిటిషన్లు వేశారు. దీనిపైరోజు వారీ విచారణ జరుగుతున్న సమయంలో ఏపీ ప్రభుత్వం అనూహ్యంగా బిల్లులు ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకుంది.
Also Read: రాజ్ భవన్ లో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు గవర్నర్ తేనీటి విందు... హాజరైన సీఎం జగన్ దంపతులు
వెంటనే అసెంబ్లీలో ఉపసంహరణ బిల్లులు ప్రవేశపెట్టి ఆ విషయాన్ని హైకోర్టుకు తెలియచేశారు. విచారణ ముగించాలని కోరారు. అయితే వైఎస్ఆర్సీపీ మంత్రులు, ఇతరులు మళ్లీ మూడు రాజధానులు తీసుకు వస్తామని చెబుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వం కూడా ఓ అదనపు అఫిడవిట్లో మళ్లీ మూడు రాజధానులు తీసుకు వస్తామని కోర్టుకు తెలిపింది. దీంతో హైకోర్టులో పిటిషన్లపై విచారణ కొనసాగించాలన్న డిమాండ్ను రైతులు మళ్లీ వినిపిస్తున్నారు.
Also Read: నాడు ఫిర్యాదులు.. నేడు అత్యంత గౌరవం.. ! సీజేఐ ఎన్వీ రమణ విషయంలో సీఎం జగన్ మనసు మారిందా ?
Attack On Satya Kumar : పోలీసులు కారు ఆపారు - వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు : సత్యకుమార్
Attack On Satya Kumar : బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్పై ఎటాక్ - మందడంలో తీవ్ర ఉద్రిక్తత !
Breaking News Live Telugu Updates: బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్పై ఎటాక్ - మందడంలో తీవ్ర ఉద్రిక్తత !
ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నిజంగా పార్టీ మారుతున్నారా? ఏపీబీ దేశంతో ఏమన్నారు?
Kotamreddy Sridhar: ఆయన ఒక్కమాట చెబితే అమరావతి ఎక్కడికీ పోదు - ఎమ్మెల్యే కోటంరెడ్డి
GT vs CSK: గుజరాత్, చెన్నై ఏ ఆటగాళ్లతో బరిలోకి దిగుతాయి - మొదటి మ్యాచ్కు మరికొద్ది గంటలే!
Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు
Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?
PM Modi Degree Certificate: మోదీ ఎడ్యుకేషన్ గురించి అడిగిన కేజ్రీవాల్కు జరిమానా- ఆరాలు అనవసరమన్న గుజరాత్ హైకోర్టు