అన్వేషించండి

Ration DBT Postpone : రేషన్ బియ్యానికి నగదు బదిలీ వాయిదా - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం !

రేషన్ బియ్యానికి నగదు బదిలీ పథకాన్ని ఏపీ ప్రభుత్వం వాయిదా వేసింది. యాప్‌లో సమస్యల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే నుంచి  ప్రయోగాత్మకంగా చేపట్టాలనుకున్న రేషన్ బియ్యానికి బదులుగా నగదు బదిలీ చేసే పథకాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది. యాప్‌లో సాంకేతిక సమస్యలు రావడంతో వాయిదా వేస్తున్నామని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేయవద్దని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఇటీవల ప్రభుత్వం  రేషన్ బియ్యానికి కూడా నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించుకుంది. రేష‌న్ బియ్యం వ‌ద్దనుకునేవారికి ఆ బియ్యం  ఖ‌రీదు మొత్తాన్ని న‌గ‌దు రూపంలో అంద‌జేస్తామ‌ని ప్రకటించారు.  ఇప్పటికే రేషన్ బియ్యానికి నగదు బదిలీ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 

అవసరమైన విధంగా లబ్ధిదారుల నుంచి అనుమతులు తీసుకోవడం, వారితో సంతకాలు పెట్టించుకోవడం వంటి పనులన్నీ ఈ నెల 25 వ తేదీలోపు పూర్తి చేయాలని పౌరసరఫరాలశాఖ కమిషనరు గిరిజా శంకర్‌ సర్క్యులర్‌ జారీచేశారు. వాలంటీర్లు మొబైల్‌ యాప్‌ను వినియోగించి నగదు బదిలీ వల్ల కలిగే ఉపయోగాలను లబ్ధిదారులకు వినిపించాల్సి ఉంటుంది. అనంతరం లబ్ధిదారుల నుంచి వ్యక్తిగతంగా అంగీకారపత్రంపై సంతకం తీసుకోవాల్సి ఉంది. 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ వాలంటీర్లు కార్డుదారులను కలిసి వారి నుంచి అంగీకార పత్రాలను తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు వాలంటీర్లు ఎంపిక చేసిన మున్సిపాలిటీల్లో లబ్దిదారుల నుంచి అంగీకార పత్రాలు తీసుకుంటున్నారు. 

తొలి దశలో ప్రయోగాత్మకంగా పట్టణ ప్రాంతాలైన విశాఖపట్నం కార్పొరేషన్‌ పరిధిలో గాజువాక, అనకాపల్లి, కాకినాడ, నరసాపురం, నంద్యాల మున్సిపాలిటీల్లో అమలు చేయాలని ఏర్పాట్లు చేసారు.  ప్రభుత్వం స్వచ్చందం అని చెప్పినప్పటికీ నర్సాపురంలో వంద శాతం అంగీకార పత్రాలు తీసుకోవాలని అదికారులు కింది స్థాయి సిబ్బందిని, వాలంటీర్లను హెచ్చరించడం కలకలం రేపింది. విపక్షాలు కూడా ఈ పథకాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు.  ఇలా చేయడం వల్ల పేదల ఆకలి చావులు పెరుగుతాయని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో పథకాన్ని తాత్కలికంగా వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకే నగదు బదిలీ పథకం అమలుకు చర్యలు తీసుకంటున్నట్టు ఏపీ ప్రభుత్వం చెబుతోంది. చండీఘర్, పాండిచ్చేరి, దాద్రానగర్ హవేలిలో ఇప్పటికే ఈ పథకం అమల్లోకి వచ్చిందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రకటించారు. కేజీ బియ్యానికి ఎంత చెల్లించాలన్నదానిపై స్పష్టత రాకపోవడం ... ఎక్కువ మంది లబ్దిదారులు బియ్యం తీసుకోవడానికే ఆసక్తి చూపడంతో తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.  మళ్లీ ఎప్పటి నుంచి నగదు బదిలీకి సన్నాహాలు ప్రారంభిస్తారన్నదానిపై  స్పష్టత లేదు. 
 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ustaad Bhagat Singh Ticket Rates : ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
Farmer admired by CM Chandrababu: ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
AP Cabinet decisions: పరిశ్రమలకు కేటాయించిన భూములు 22A నుంచి తొలగింపు -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
పరిశ్రమలకు కేటాయించిన భూములు 22A నుంచి తొలగింపు -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
Central assistance: ప్రకృతి వైపరీత్యాల సహాయం - ఏపీ సహా 6 రాష్ట్రాలకు రూ.1,930 కోట్ల అదనపు నిధులు
Central assistance: ప్రకృతి వైపరీత్యాల సహాయం - ఏపీ సహా 6 రాష్ట్రాలకు రూ.1,930 కోట్ల అదనపు నిధులు

వీడియోలు

IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Irfan Pathan Predicts Future Captain of Team India | శ్రేయాస్ పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ | ABP Desam
ICC T20 Rankings after T20WC | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustaad Bhagat Singh Ticket Rates : ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
Farmer admired by CM Chandrababu: ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
KTR Letter to Amit Shah: రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
AP Cabinet decisions: పరిశ్రమలకు కేటాయించిన భూములు 22A నుంచి తొలగింపు -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
పరిశ్రమలకు కేటాయించిన భూములు 22A నుంచి తొలగింపు -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
Movie Ticket Rates : టికెట్ రేట్స్ హైక్... పవన్ ఉస్తాద్ భగత్ సింగ్‌కు లైన్ క్లియర్!... ఆ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే
టికెట్ రేట్స్ హైక్... పవన్ ఉస్తాద్ భగత్ సింగ్‌కు లైన్ క్లియర్!... ఆ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే
Tamil Nadu Assembly Elections 2026: కొత్త పార్టీతో వచ్చేసిన శశికళ - తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక మలుపు
కొత్త పార్టీతో వచ్చేసిన శశికళ - తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక మలుపు
IAF Wing Commander commits suicide: చత్తీస్‌ఘడ్‌లో వింగ్ కమాండ్ ఆత్మహత్య - భార్యతో గొడవలే కారణమా?
చత్తీస్‌ఘడ్‌లో వింగ్ కమాండ్ ఆత్మహత్య - భార్యతో గొడవలే కారణమా?
IPL 2026: ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎలా బుక్ చేసుకోవాలి
ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎలా బుక్ చేసుకోవాలి
Embed widget