అన్వేషించండి

TDP On Jagan: వైఎస్‌ఆర్‌సీపీ గుర్తు, అభిమానుల కామెంట్స్ వాడేసుకుంటున్న టీడీపీ- విద్యుత్ ఛార్జీలపై ఇదో టైపు నిరసన

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలు, విద్యుత్ ఛార్జీలు పెంపుపై టీడీపీ నిరసనల డోసు పెంచింది. క్షేత్రస్థాయిలో ఆందోళన చేస్తూనే సోషల్ మీడియాను కూడా వదలడం లేదు.

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో విద్యుత్ ఛార్జీల పెంపు, కోతలపై భగ్గుమంటున్నాయి విపక్షాలు. నిర్ణయం వెల్లడైనప్పటి నుంచి ఒక్కొక్కరు ఒక్కో తీరున ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇందులో భాగంగా టీడీపీ(TDP) మరో అడుగు ముందుకేసింది. 

విద్యుత్ ఛార్జీల పెంపు, కోతలపై నిరసనలకు టీడీపీ లీడర్లు తమ క్రియేటివిటీని బయటకు తీస్తున్నారు. టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక శాఖ విభాగం అధ్యక్షుడు నరసింహ ప్రసాద్‌  వినూత్న నిరసన చేపట్టారు. ఫ్యాన్స్‌, బల్బ్స్‌ తీసుకొని విసనకర్రలు, లాంతర్లు ఇస్తామంటూ ప్రచారం చేశారు. వీధి వీధిలో తోపుడు బండిపై వాటిని తిప్పుతూ అమ్మడం మొదలు పెట్టారు. 

నరసింహ ప్రసాద్ చేసిన ఆందోళన సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంది. నెటిజన్లు, టీడీపీ నేతలు దాన్ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. తనకున్న నటనాచాతుర్యంతో ఆ వెరైటీ నిరసనను రక్తికట్టించారాయన. 

సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రాహావేశాలను కూడా టీడీపీ లీడర్లు వాడేస్తున్నారు. అందులో జగన్ అభిమానుల కామెంట్స్ ఉంటే చాలు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అలాంటి వ్యక్తి చేసిన కామెంట్స్‌ను టీడీపీ అధికారిక సోషల్ మీడియాలో పోస్టు చేశారు. జగన్‌ మోహన్ రెడ్డి బాదుడే బాదుడుకు సొంత పార్టీ అభిమానులే తట్టుకోలేకపోతున్నారని కామెంట్‌ రాశారు. అందులో ఉన్న వ్యక్తి ఏ చెప్పాడంటే... తాను జగన్ అభిమానిని అని... తన గుండెలపై వైఎస్‌ఆర్‌ఆని ఉందన్నాడు. ఫ్యామిలీని పక్కన పెట్టి రాజకీయ నేతలను అభిమానించానన్నారు. చివరకు తనకు ఏమీ మిగల్లేదని.. పింఛన్ ఇస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా ఇంతవరకు అతీగతి లేదన్నాడు. తాను రోడ్లపై వ్యాపారు చేస్తుంటానని.. బేరాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశాడు. తినడానికి కనీసం బియ్యం కూడా లేకుండాపోయాయని.. పేదవాడు కరెంట్‌ బిల్లు ఎలా కడతాడని ప్రశ్నించాడు. చివర్లో జై టీడీపీ అని ముగించడంతో దీన్ని టీడీపీ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేసింది.

 

నీ బాదుడే బాదుడని భరించలేక నీ పార్టీ అభిమానులు, కార్యకర్తలే ఏమంటున్నారో చూడు వైఎస్‌ జగన్ అంటూ తెలుగు మహిలా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా ట్వీట్ చేశారు. మీకు కౌంట్‌ డౌన్ మొదలైందని రాసుకొచ్చారామె. 
టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా ఈ వీడియోను రీ ట్వీట్ చేశారు. ఓటేసే ముందు ఆలోచించి ఉండాల్సిందని.. నమ్మిన వారికి వెన్నుపోటు పొడవడంలో జగన్‌ పీహెచ్‌డీ చేశారని ఎద్దేవా చేశారాయన. 

ఇలా చాలా మంది టీడీపీ అభిమానులు, సానుభూతి పరులు ఈ వీడియోను వైరల్‌ చేస్తున్నారు. రాష్ట్రంలో చాలా మంది అభిప్రాయం ఇలానే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి- విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి- విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Chandrababu Serious On Bonda Uma: వైసీపీతో వేదికలు పంచుకుంటే వేటే? - బొండా ఉమా ఎపిసోడ్‌తో టీడీపీ క్రమశిక్షణకు చంద్రబాబు కఠిన పరీక్ష!
వైసీపీతో వేదికలు పంచుకుంటే వేటే? - బొండా ఉమా ఎపిసోడ్‌తో టీడీపీ క్రమశిక్షణకు చంద్రబాబు కఠిన పరీక్ష!
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Embed widget