అన్వేషించండి

Payyavula Kesav: వైసీపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రంలో విద్యుత్ కొరత... ఏపీ సంక్షోభాన్ని చైనా, యూరప్ లతో పోల్చడమేంటని ప్రశ్న... వైసీపీ ప్రభుత్వంపై పయ్యావుల కేశవ్ ఫైర్

విద్యుత్ సంక్షోభంపై ప్రధాని మోదీకి సీఎం జగన్ రాసిన లేఖపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ స్పందించారు. విద్యుత్ కొరతకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు.

రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ముందుచూపులేనితనమే కారణమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రధానికి లేఖ రాశారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు తప్పయితే, వైసీపీ ప్రభుత్వం అదానీ సంస్థ నుంచి 10 వేల మెగావాట్ల విద్యుత్ ఎందుకు కొంటుందని ప్రశ్నించారు. ఏపీలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న హిందూజా సంస్థను మూతపడేలా చేసిన ప్రభుత్వం అదానీ సంస్థ నుంచి అధిక ధరకు విద్యుత్ ఎందుకు కొనుగోలుచేస్తుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు రూ.12 వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా ఆ భారాన్ని కూడా ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజలపై వేసిందని ఆరోపించారు. 

Also Read: తాకట్టులో ఆంధ్రప్రదేశ్... జీతాలు, ఫించన్లు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి... ఏపీ సర్కార్ పై పవన్ ట్వీట్ వార్ 

అధికార యంత్రాంగ వైఫల్యం
 
రిజర్వాయర్లలో నీరు సమృద్ధిగా ఉన్న ఈ సమయంలోనే లోడ్ రిలీఫ్ ల పేరుతో విద్యుత్ కోతలకు కారణం ముమ్మాటికీ అధికార యంత్రాంగమేనని పయ్యావుల అన్నారు. ఆర్థిక రంగాన్ని ఏ విధంగా అయితే దెబ్బతీశారో, విద్యుత్ రంగాన్ని కూడా కోలుకోలేని సంక్షోభంలోకి నెట్టివేశారని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. శనివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ కోతల్లో అధికారుల పాత్ర ప్రధానంగా ఉందని, వైసీపీ ప్రభుత్వం టీడీపీ హయాంలో జరిగిన పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లపై తప్పుడు సమాచారమిచ్చింది అధికార యంత్రాంగమేనని ఆరోపించారు. సీఎం జగన్ ప్రధానికి రాసిన లేఖలో కూడా అసత్యాలే ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలు లేవని, ఆర్టీపీపీ, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ వంటిని పనిచేసే స్థితుల్లో లేవని లేఖలో రాశారన్నారు. ప్రభుత్వ ముందుచూపులేనితనానికి ప్రధాని ఎలా స్పందిస్తారన్నారు. మిగులు విద్యుత్ లో ఉన్న రాష్ట్రం ఈ విధమైన స్థితికి రావడానికి వైసీపీ ప్రభుత్వ చర్యలే కారణమన్నారు. 

Also Read: విద్యుత్ ట్రూ అప్ చార్జీలపై ఏపీ సర్కార్‌లో గందరగోళం ! నిన్న రద్దు... మళ్లీ వచ్చే నెల నుంచి వసూలు ?

రాష్ట్ర ప్రజలపై రూ.50 వేల కోట్ల భారం

సీమ థర్మల్ పవర్ స్టేషన్ ను 50 శాతం సామర్థ్యంతోనే ప్రభుత్వం నిర్వహిస్తోందని పయ్యావుల ఆరోపించారు. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్ని మూసివేత దిశగా తీసుకెళ్లి, ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని పయ్యావుల అన్నారు.రాష్ట్రంలో పవన విద్యుత్ ఉత్పత్తి కూడా ఎప్పటి నుంచో జరుగుతుందన్న ఆయన.. కానీ దాన్ని కూడా ప్రభుత్వం ఆపేసిందని ఆరోపించారు. పవర్ ఎక్సేంజ్ ల నుంచి విద్యుత్ కొనడానికి సిద్ధమయ్యారన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్ ను కొనకుండా బయటి రాష్ట్రాలకు చెందిన విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి విద్యుత్ కొంటున్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల వల్ల రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడిందని ఆరోపించారు. ప్రధాని మోదీకి సీఎం జగన్ రాసిన లేఖలో 8 వేల మెగావాట్ల పవన విద్యుత్ తమ వద్ద సిద్ధంగా ఉందని, అందుకే థర్మల్ కేంద్రాల నుంచి విద్యుత్ కొనలేకపోతున్నామన్నారు. అలాంటప్పుడు అదానీ సంస్థ నుంచి 10 వేలమెగావాట్ల విద్యుత్ కొనడానికి, రాష్ట్ర ప్రజలపై రూ.50 వేల కోట్ల అదనపు భారం వేయడానికి ప్రభుత్వం ఎందుకు సిద్ధమైందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. 

Also Read: అమూల్ ప్రైవేట్ సంస్థ కాదు... పాలు పోసే రైతులే యాజమానులు... వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం జగన్ సమీక్ష

రూ.20 వేల కోట్లకు పైగా ప్రభుత్వ బకాయిలు

టీడీపీ హయాంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలన్నీ తప్పని వైసీపీ ప్రభుత్వం చేసిన ఆరోపణలు అవాస్తవాలని ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. విద్యుత్ రంగ సంస్థల డిస్ట్రిబ్యూషన్ కంపెనీల ఆర్థిక పరిస్థితి ఎందుకు దిగజారిందో కూడా ప్రభుత్వమే చెప్పాలని పయ్యావుల ప్రశ్నించారు. విద్యుత్ వినియోగదారులు బిల్లుల తాలూకా సొమ్ముచెల్లించడం ఆపేశారా? పైసాతో సహా వారి నుంచి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఏపీఈఆర్సీ నిర్ణయించిన ధర ప్రకారం వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న నగదు ఏమవుతుందని ప్రశ్నించారు. కొనుగోలు చేస్తున్న విద్యుత్ తాలూకా సొమ్ముని కూడా ప్రభుత్వం సదరు సంస్థలకు చెల్లించడంలేదన్నారు. కనీసం 50 శాతం సొమ్మునైనా విద్యుత్ సంస్థలకు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించినా ప్రభుత్వం చెల్లించలేదన్నారు. ప్రభుత్వం సదరు సంస్థలకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వనందునే నష్టాల్లో కురుకుపోయాయని తెలిపారు. ఆ భారాన్ని కూడా ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజలపైనే మోపారని ఆరోపించారు. డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.12వేల కోట్లు చెల్లించని కారణంగా దాదాపు రూ.20 వేల కోట్ల వరకు ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు బకాయిపడిందని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. 

Also Read: విద్యుత్ కొరతపై ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ... యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Formula E Race Case: అప్పటివరకూ కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దు, హైకోర్టులో మరోసారి ఊరట
Formula E Race Case: అప్పటివరకూ కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దు, హైకోర్టులో మరోసారి ఊరట
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నచ్చని పని చేసిన మన్మోహన్, అయినా మోదీ పొగడ్తలుమేం చీమూ, నెత్తురు ఉన్న నాకొడుకులమే! బూతులతో రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డిManmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Formula E Race Case: అప్పటివరకూ కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దు, హైకోర్టులో మరోసారి ఊరట
Formula E Race Case: అప్పటివరకూ కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దు, హైకోర్టులో మరోసారి ఊరట
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Boxing Day Test Live Updates: పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
Gas Cylinder Price Cut: కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
Samantha: సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
Embed widget