అన్వేషించండి

CM Jagan Reviews: అమూల్ ప్రైవేట్ సంస్థ కాదు... పాలు పోసే రైతులే యాజమానులు... వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం జగన్ సమీక్ష

వ్యవసాయ అనుబంధ రంగాల ప్రగతిపై సీఎం జగన్ సమీక్షించారు. అమూల్ కార్పొరేట్ సంస్థ కాదన్న సీఎం.. పురుగు మందుల కొరత ఎక్కడా లేదన్నారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకుంటామని తెలిపారు.

వ్యవసాయ అనుబంధ రంగాల్లో మౌలిక వసతులపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రైతులకు మంచి ధర అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో పోటీ ఉండేలా చూడాలన్నారు. దీంతో రైతులకు మంచి ధర వస్తుందన్నారు. ధరల విషయంలో రైతులకు నిరాశాజనక పరిస్థితులు ఉంటే మార్కెట్లో జోక్యం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకోవాలని సీఎం అన్నారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది పడకుండా చూడాలన్న సీఎం జగన్ అన్నారు. ఆర్బీకేల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చజరుగుతుందన్నారు. నాణ్యత ఉన్న ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు రైతులకు మంచి ధరలకు లభిస్తున్నాయన్న సీఎం... బయట మార్కెట్లో డీలర్‌ అమ్మే రేట్లకన్నా తక్కువ రేట్లకు లభిస్తున్నాయన్నారు. ఆర్బీకేల ద్వారా ఎమ్మార్పీ ధరలకే నాణ్యమైన సీడ్, ఫీడ్, ఎరువులు రైతులకు అందుబాటులోకి వస్తున్నాయని సీఎం తెలిపారు. 

Also Read: "అమరావతి పాఠం" తొలగింపుపై విమర్శలు .. స్పందించని ప్రభుత్వం !

సబ్ డీలర్లుగా ఆర్బీకేలు

ఆర్బీకేలను సబ్‌డీలర్లుగా మార్పు చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రి తెలిపారు. వచ్చే రబీ నుంచి ఈ విధానం అమల్లోకి వస్తోందన్న అధికారులు తెలిపారు. రైతులకు మరింత మేలు జరుగుతుందని పేర్కొన్నారు.  వరి అధికంగా సాగవుతున్న ప్రాంతాల్లో కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం అధికారుకు సూచించారు. బోర్ల కింద వరిని సాగుచేసే చోట ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సాహించాలని సీఎం జగన్ అన్నారు. మిల్లెట్స్‌తో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటలను సాగును ప్రోత్సహించాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసే రైతులకు ప్రోత్సాహకాలు అందించాలన్నారు. 33 చోట్ల సీడ్‌ కమ్‌ మిల్లెట్‌ ప్రాససింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ డిసెంబరు నాటికి 20 యూనిట్లు అందుబాటులోకి తీసుకుమన్నారు. 

Also Read: బద్వేలులో త్రిముఖ పోటీ.. అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ !

అమూల్ ప్రైవేటు సంస్థ కాదు

బీఎంసీల నిర్మాణంపై వివరాలను అధికారులు సీఎంకు అందించారు. ప్రాధాన్యతా క్రమంలో బీఎంసీలను డిసెంబర్‌ నాటికి పూర్తిచేస్తామన్నారు. జగనన్న పాలవెల్లువ కార్యక్రమం చేపట్టిన జిల్లాల్లో పాల సేకరణ అంతకంతకూ పెరుగుతోందన్న సీఎంకు అధికారులు తెలిపారు. రైతులకు మేలు చేస్తున్న ఈ కార్యక్రమంపైనా లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని సీఎం జగన్ అన్నారు. అమూల్‌ ప్రైవేటు సంస్థ కాదన్న సీఎం... పెద్ద సహకార ఉద్యమమని గుర్తుచేశారు. పాలుపోసే రైతులే ఈ సంస్థకు యజమానులని సీఎం జగన్ తెలిపారు. అమూల్‌ వచ్చాక  పాల సేకరణ ధరలు పెంచాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. దీనివల్ల రైతులకు మేలు జరుగుతోందన్నారు. పుడ్‌ ప్రాససింగ్‌ యూనిట్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణంపైనా సమీక్షించిన సీఎం 
జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడలో పనులపై ఆరాతీశారు.  

Also Read: పాదయాత్రలో చూసి కష్టాలు తీరుస్తున్నా .. ! రెండో విడత ఆసరా నిధులు విడుదల చేసిన సీఎం జగన్ !

ఎక్కడా ఎరువుల కొరత లేదు : మంత్రి కన్నబాబు

ఏపీలో ఎక్కడా ఎరువుల కొరత లేదని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. శుక్రవారం మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాల్లో మౌలిక వసతులపై సీఎం జగన్ సమీక్షించారని తెలిపారు. రాష్ట్రంలో ఎరువుల కొరత ఉందని దుష్ర్పచారం జరుగుతోందన్నారు. నాణ్యతతో కూడిన ఎరువుల మందులు ఇవ్వడమే రైతు భరోసా కేంద్రాల లక్ష్యమన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువుల పంపిణీతో డీలర్ల కడుపు కొడుతున్నామన్న ఆరోపణలు సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే ఎరువుల ఉత్పత్తి తగ్గిందని ఆయన తెలిపారు. 

Also Read: తాకట్టులో ఆంధ్రప్రదేశ్... జీతాలు, ఫించన్లు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి... ఏపీ సర్కార్ పై పవన్ ట్వీట్ వార్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

టాప్ హెడ్ లైన్స్

Anant Ambani: తిరుమల శ్రీవారికి అనంత్ అంబానీ 27.5 కోట్ల విలువైన భారీ విరాళం, గోశాల ఆధునీకరణకు నిర్ణయం
తిరుమల శ్రీవారికి అనంత్ అంబానీ 27.5 కోట్ల విలువైన భారీ విరాళం, గోశాల ఆధునీకరణకు నిర్ణయం
YS Jagan: రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!

వీడియోలు

IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
India vs Ireland 2nd T20 Series decider | ఇండియా కంబ్యాక్ ఇస్తుందా?
Abhishek Sharma’s 50 Cancelled Ind vs Ire | అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు
Ronaldo's Special Gold Scorpion Shoes | రొనాల్డో సరికొత్త గోల్డ్ స్కార్పియన్ షూస్
Ashwin About Vaibhav Bench Controversy | వైభవ్ ను క్కనపెట్టడంపై అశ్విన్ కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
T20 World Cup - IND W VS AUS W Result Update:  టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
Kavitha On Idupu Kayitham: ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
PM Modi Mann Ki Baat: సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
PV Narasimha Rao Birth Anniversary Tributes 2026: మహనీయులకు ప్రాంతాలు ఉండవు - విశాఖలోనూ పీవీకి ఘనగా నివాళులు - టీఆర్ఎస్ కవిత వర్సెస్ బీజేపీ విష్ణు
మహనీయులకు ప్రాంతాలు ఉండవు - విశాఖలోనూ పీవీకి ఘనగా నివాళులు - టీఆర్ఎస్ కవిత వర్సెస్ బీజేపీ విష్ణు
Ayodhya Ram Mandir Donation Row: సిట్ దర్యాప్తులో కీలక విషయాలు.. అయోధ్య కానుకల డబ్బు పంపకాల గొడవతోనే బయటపడ్డ కుట్ర!
సిట్ దర్యాప్తులో కీలక విషయాలు.. అయోధ్య కానుకల డబ్బు పంపకాల గొడవతోనే బయటపడ్డ కుట్ర!
Hang Man OTT : ఆరేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి బ్రహ్మాజీ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఆరేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి బ్రహ్మాజీ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Deepti Sharma World Record: దీప్తి శ‌ర్మ వ‌రల్డ్ రికార్డు.. అంత‌ర్జాతీయ క్రికెట్లో లీడింగ్ వికెట్ టేక‌ర్ గా ఘ‌న‌త‌.. 
దీప్తి శ‌ర్మ వ‌రల్డ్ రికార్డు.. అంత‌ర్జాతీయ క్రికెట్లో లీడింగ్ వికెట్ టేక‌ర్ గా ఘ‌న‌త‌.. 
Embed widget