Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్లో పర్యటించి రేవంత్ రెడ్డి, కేటీఆర్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

Akhilesh Yadav Tour in Hyderabad: ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్ పర్యటన ఆసక్తిగా మారింది. ఆయన ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. తర్వాత ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సమావేశమయ్యారు. త్వరలోనే కేసీఆర్తో భేటీ అవుతానంటూ ప్రకటించారు. ఒకే రోజు ఇలా అధికార పార్టీ, ప్రతిపక్ష నేతలతో సమావేశం కావడం రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తోంది.
సాయంత్రం హైదరాబాద్ వచ్చిన అఖిలేశ్ యాదవ్ ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ భేటీ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు గురించి చర్చించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఉన్న పరిణామాలు, దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ సమీకరణాలపై మాట్లాడుకున్నారని సమాచారం.
తెలంగాణలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, బీసీ రిజర్వేషన్ అమలు, ఇతర అభివృద్ధి అంశాలపై అఖిలేశ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఈ సమావేశంలో ఎంపీ అనిల్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, రోహిన్ రెడ్డి కూడా ఉన్నారు.
ముఖ్యమంత్రితో సమావేశమైన కాసేపటికే అఖిలేశ్ యాదవ్ కేటీఆర్తో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. అక్కడే ఉన్న హరీష్రావు, కేటీఆర్ ఆయనకు స్వాగతం పలికి వివిధ రాజకీయ అంశాలపై చర్చించారు. సమావేశంలో చర్చలు ముగిసిన తర్వాత ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు.
#WATCH | Telangana | Samajwadi Party chief Akhilesh Yadav meets BRS working President KT Rama Rao (KTR) at the latter's residence in Hyderabad. pic.twitter.com/jK4fhIZGyO
— ANI (@ANI) December 12, 2025
అఖిలేశ్ యావద్ మాట్లాడుతూ రాజకీయాల్లో ఒడిదుడుకు సహజమని ఒక్కోసారి ప్రజలు స్వీకరిస్తారు, మరోసారి వేరే వాళ్లకు అవకాశం ఇస్తారని అన్నారు. ఎప్పుడూ ప్రజల్లో ఉంటేనే వారు అర్థం చేసుకుంటారని అన్నారు. సమీక్షించుకొని ప్రజల కోసం నిలబడినప్పుడే వాళ్లు స్వీకరిస్తారని తెలిపారు. ఉత్తర్ప్రదేశ్లో ఒకప్పుడు రెండు సీట్లు మాత్రమే సమాజ్వాదీ పార్టీకి వచ్చాయని తర్వాత ప్రజలు భారీ సీట్లు అప్పగించారని అన్నారు. ఇప్పుడు అక్కడ బీజేపీ రెండో స్థానానికి పరిమితమవుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో కూడా ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్తో మాట్లాడానని త్వరలోనే కలుస్తానని కూడా వివరించారు. రాజకీయాలు దేశ ప్రగతికి దోహదపడాలని విజన్తో సాగాలని సానుకూల విమర్శలతో ఉండాలని అభిప్రాయపడ్డారు.
#WATCH | Hyderabad, Telangana | After the meeting with SP chief Akhilesh Yadav, BRS working president KT Rama Rao says, "We draw inspiration from you and your party about the manner in which you reached Delhi with 37 MPs. We will bounce back once again and try to come back to… https://t.co/E6IzeavCNB pic.twitter.com/LUlBkqi2uh
— ANI (@ANI) December 12, 2025
కేటీఆర్ మాట్లాడుతూ... హైదరాబాద్ వచ్చిన అఖిలేశ్ను కలుద్దామని ఆయనే స్వయంగా వస్తానని చెప్పారని అన్నారు. అన్నట్టుగానే వచ్చారని తెలిపారు. గతంో పార్టీకి తక్కువ సీట్లు ఇచ్చినా ప్రజల్లో ఉంటూ మళ్లీ నిలబడ్డారని అదే స్ఫూర్తితో తాము నిలబడతామని చెప్పుకొచ్చారు. వారి ఆశీర్వాదం పొందుతామని అశాభావం వ్యక్తం చేశారు.





















