Messi mania in Hyderabad: హైదరాబాద్కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Messi mania: హైదరాబాద్ లో శనివారం జరగనున్న మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ చూసేందుకు రాహుల్ గాంధీ రానున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఆర్ఆర్9, మెస్సీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

Messi football match in Hyderabad on Saturday: ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ భారతదేశంలోని GOAT ఇండియా టూర్ 2025లో భాగంగా డిసెంబర్ 13 సాయంత్రం 4 గంటలకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతారు. ఇంటర్ మియామీ స్టార్ మెస్సీకి 'Z+' సెక్యూరిటీ, మొత్తం 3,500 మంది పోలీసులు, SPG టీమ్తో భారీ భద్రతా వ్యవస్థలు ఏర్పాటు చేయబడ్డాయి. ఎయిర్పోర్ట్ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా నేరుగా ఫలక్ నుమా ప్యాలెస్కు వెళ్లి విశ్రాంతి తీర్చుకున్న తర్వాత, సాయంత్రం 7 గంటలకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో ఎగ్జిబిషన్ మ్యాచ్లో పాల్గొంటారు. మ్యాచ్ చివరి 10 నిమిషాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మెస్సితో కలిసి ఆడనున్నారు. ఈ ఈవెంట్కు టికెట్లు రూ. 10,000 నుంచి రూ. 5 లక్షల వరకు ధరలు ఉన్నాయి. మెస్సీతో సెల్ఫీ అవకాశం కూడా ఉంది.
GOAT ఇండియా టూర్ 2025 మెస్సీ, ఇంటర్ మియామీ టీమ్తో కలిసి నాలుగు నగరాల్లో జరుగుతుంది. కోల్ కతా నుంచి ప్రారంభమై, హైదరాబాద్లో రెండో దశగా జరిగే ఈ టూర్, ముంబై లో డిసెంబర్ 14న, ఢిల్లీలో డిసెంబర్ 15నలో ముగుస్తుంది.
హైదరాబాద్ షెడ్యూల్ ప్రకారం:
సాయంత్రం 4:00 PM: మెస్సీ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్. గ్రీన్ ఛానల్ ద్వారా కస్టమ్స్ క్లియరెన్స్, నేరుగా ఫలక్నుమా ప్యాలెస్కు బులెట్-ప్రూఫ్ కాన్వాయ్తో ప్రయాణం
సాయంత్రం 5:00 PM - 6:30 PM: ఫలక్నుమా ప్యాలెస్లో విశ్రాంతి
సాయంత్రం 6:30 PM: ఉప్పల్ స్టేడియంకు పయనం
సాయంత్రం 7:00 PM - 8:00 PM: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో 'రేవంత్ రెడ్డి 9 vs లియోనెల్ మెస్సీ 10' అనే ఎగ్జిబిషన్ మ్యాచ్. మొత్తం 60 నిమిషాల మ్యాచ్లో చివరి 10 నిమిషాలు సీఎం మెస్సితో కలిసి ఆడతారు. మ్యాచ్ తర్వాత మ్యూజికల్ కాన్సర్ట్.
మెస్సీ vs రేవంత్ రెడ్డి
— Telangana Congress (@INCTelangana) December 12, 2025
ఫుట్ బాల్ ఆటతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి టీం స్పిరిట్ ఒక్కసారి చూడాల్సిందే.
డిసెంబర్ 13, 2025
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, ఉప్పల్ హైదరాబాద్. @revanth_anumula #footballgames#TelanganaRising#LionelMessi#gamechanger… pic.twitter.com/WLikOqwCQs
మెస్సీకి 'Z+' సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్లో మెస్సీ ఇంటర్ మియామీ టీమ్తో కలిసి ఆడతారు. చివరి 10 నిమిషాలు సీఎం రేవంత్ రెడ్డి మెస్సీతో జెర్సీలు మార్చుకుని ఆడతారు – 'రేవంత్ 9 vs మెస్సీ 10' అనే థీమ్తో. మ్యాచ్ తర్వాత మ్యూజికల్ కాన్సర్ట్, మెస్సీతో సెల్ఫీ అవకాశం ఉంది. టికెట్లు ఆన్లైన్లో అమ్మకానికి ఉన్నాయి, మొత్తం 50,000 ఫ్యాన్స్ హాజరు కా అవుతారని అంచనా.
ఈ మ్యాచ్ కోసం ప్రభుత్వం వంద కోట్లు ఖర్చు పెడుతోందన్నప్రచారం జరుగుతోంది. కానీ ఈ ప్రచారాన్ని ఫ్యాక్ట్ చెక్ తోసిపుచ్చింది. తప్పుడు ప్రచారమని స్పష్టం చేసింది.
తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు లియోనెల్ మెస్సీ మధ్య జరగనున్న స్నేహపూర్వక ఫుట్బాల్ మ్యాచ్ RR9 vs Messi10 కోసం ₹100 కోట్లు కేటాయించిందన్న వార్త పూర్తిగా అసత్యం.
— FactCheck_Telangana (@FactCheck_TG) December 11, 2025
ప్రచారంలో ఉన్న ఫేక్ వార్తలో ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియాన్ని శుభ్రపరచడం, మరమ్మతులు… pic.twitter.com/Z2jvq0nIX5
ఈ మ్యాచ్ ను చూసేందకు ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ కూడా హైదరాబాద్ వస్తున్నారు.





















