అన్వేషించండి

TDP Leaders: దొంగ ఓట్ల కోసమే వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ - ఎన్నికల అధికారికి టీడీపీ ఫిర్యాదు

TDP Leaders: దొంగ ఓట్ల కోసమే జగన్ రెడ్డి ప్రభుత్వం వలంటీర్లు, సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు కనిపిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telugu Desam Party: దొంగ ఓట్ల కోసమే జగన్ రెడ్డి ప్రభుత్వం వలంటీర్లు, సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు కనిపిస్తోందని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలతో కలిసి, రాష్ట్ర సచివాలయంలో బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్‌ మీనా (Mukesh Kumar Meena)ను కలిసి దొంగ ఓట్లపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఓటర్ల జాబితాలో అవకతవకలకు తెరలేపిందని విమర్శించారు. దొంగఓట్లు సృష్టించడం, అర్హుల ఓట్లు తొలగించడం అనే తంతుని నిరంతరం కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఈ మాట తాము అనడం లేదని.. అన్ని పార్టీలు.. ప్రజలే అంటున్నారని చెప్పారు

ఎమ్మెల్యే అనిల్‌కు మూడు చోట్ల ఓట్లు
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక చెట్టుకు ఓటు హక్కు కల్పించారని, ఒక్కో వ్యక్తికి మూడు, నాలుగు చోట్ల దొంగ ఓట్లు నమోదు చేయించారని విమర్శించారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ (Anil Kumar Poluboina)కు మూడుప్రాంతాల్లో ఓట్లున్నాయని, ఆయన ఎవరో ఈ ప్రభుత్వానికి, అధికారులకు తెలియదా? అంటూ ప్రశ్నించారు. కేవలం దొంగ ఓట్లతోనే వచ్చేఎన్నికల్లో  గెలవాలని జగన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రక్రియలో జరిగే తప్పులు.. ఓటర్ల జాబితాకు సంబంధించిన తప్పులను ఆధారాలతో అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా వారు స్పందించడం లేదని ఆరోపించారు

చర్యలు తీసుకోవడం లేదు
ఓట్ల సమస్యలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లోఉంటే.. వాటిని పరిష్కరించకుండా మరలా కొత్తగా ఫామ్-6, ఫామ్-7, ఫామ్-8 ఇతర వివరాలు అడగడం సరికాదన్నారు. 5.58 లక్షల ఫామ్ -7ల దరఖాస్తులు, 7.16 లక్షల ఫామ్-8 దరఖాస్తులు అందించినా అధికారులు పట్టించుకోలేదని వెల్లడించారు. నియోజకవర్గాల వారీగా పోలైన దొంగఓట్లు, అర్హుల ఓట్ల తొలగింపు వివరాలను కూడా ఎన్నికల కమిషన్ ముందు ఉంచామని,  అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. 

త్వరలోకే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
18 నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు సరిగా లేవని, స్థానిక ఎమ్మెల్యేల ప్రోద్బలంతోనే పోలింగ్ కేంద్రాలు మార్చడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ ఒక్కరోజే 13 లేఖలు అందించినట్లు చెప్పారు. ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలు.. దొంగఓట్ల వ్యవహారం.. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఇతర అంశాలపై త్వరలోనే టీడీపీ ఎంపీలతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు సజావుగా జరగాలన్నదే టీడీపీ అభిమతమని అచ్చెన్న అన్నారు. వైసీపీలోని పెద్ద నాయకులే సిగ్గులేకుండా దొంగఓట్లు చేర్పిస్తున్నారని ఆరోపించారు. 

అధికారుల ప్రమేయం లేకుండా ఎలా సాధ్యం?
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు(Bonda Umamaheswara Rao) మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ డ్రైవ్ రాష్ట్రంలో అపహాస్యంగా మారిందని అన్నారు. ఆర్వోలు, కలెక్టర్లు చుట్టూ తిరగడమే ప్రతిపక్షాల పని అయ్యిందని విమర్శించారు. ఫామ్-7 దరఖాస్తుల విషయంలో టీడీపీ ఓట్లు తొలగించే విషయంలో అధికారులు పోటీలు పడి పనిచేస్తున్నారని, వారికి వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సహకరిస్తున్నారని ఆరోపించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో  ఒక వైసీపీ నాయకుడి తల్లిపేరుతో మూడు ఓట్లు నమోదు చేశారని, అధికారుల ప్రమేయం లేకుండా మూడు ఓట్లు ఎలా నమోదవుతాయని ప్రశ్నించారు. 

వారికి నచ్చితే చెప్పులకు కూడా ఓటు
అధికార పార్టీకి నచ్చితే చెట్టుకు, పుట్టకు, ఆఖరికి చెప్పులకు కూడా ఓట్లు పుట్టిస్తారని బోండా ఉమా విమర్శించారు. టీడీపీ వాళ్లు దొంగఓట్లు తీసేయమంటే నిబంధనలు అంటున్న అధికారులకు ఇలాంటి వింతలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో తాను 25 ఓట్లతో ఓడిపోయానని, ఇప్పుడు తన నియోజకవర్గంలో 12,000 దొంగఓట్లు చేర్చారని ఆరోపించారు. వాటిపై చర్యలు తీసుకోవాలని కోరితే వెటకారంగా సమాధానమిస్తున్నారని అన్నారు. ఓటమి భయంతోనే జగన్ రెడ్డి అధికారుల్ని అడ్డుపెట్టుకొని ఓటర్ల జాబితాలో ఇలాంటి అవక తవకలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Janasena Formation Day: గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవం - పవన్ కల్యాణ్ ప్రత్యేక కార్యక్రమం
గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవం - పవన్ కల్యాణ్ ప్రత్యేక కార్యక్రమం
Ustaad Bhagat Singh Ticket Rates : ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
Farmer admired by CM Chandrababu: ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
AP Cabinet decisions: పరిశ్రమలకు కేటాయించిన భూములు 22A నుంచి తొలగింపు -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
పరిశ్రమలకు కేటాయించిన భూములు 22A నుంచి తొలగింపు -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం

వీడియోలు

Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam
Josh Hazlewood to Miss IPL 2026 | ఐపీఎల్ 2026కు స్టార్ పేసర్ దూరం? | ABP Desam
Surya Kumar Yadav Apologizes to Axar Patel | అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య | ABP Desam
Did Dhoni Ruin Yuvraj Singh’s Career? | యువరాజ్ కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడా? | ABP Desam
IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Formation Day: గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవం - పవన్ కల్యాణ్ ప్రత్యేక కార్యక్రమం
గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవం - పవన్ కల్యాణ్ ప్రత్యేక కార్యక్రమం
Telangana Tenth Class Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
Telangana RTC Protest : మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
Womens History Month.. తీర్మానంపై ట్రంప్ సంతకాలు
Womens History Month.. తీర్మానంపై ట్రంప్ సంతకాలు
Ustaad Bhagat Singh Ticket Rates : ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
Farmer admired by CM Chandrababu: ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
Aaya Sher Song: ఆయా షేర్ కోసం రెండున్నర ఎకరాల్లో సెట్స్... సాంగ్ సెట్ స్టోరీ తెలుసా?
ఆయా షేర్ కోసం రెండున్నర ఎకరాల్లో సెట్స్... సాంగ్ సెట్ స్టోరీ తెలుసా?
KTR Letter to Amit Shah: రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
Embed widget