అన్వేషించండి

TDP Attacks on YSRCP: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని ప్రాంతాల్లో విధ్వంసం- టీడీపీ శ్రేణులపై వైసీపీ విమర్శలు

Andhra Pradesh News: ఏపీలో ఫలితాలు తర్వాత జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొందరు టీడీపీ శ్రేణులు ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నారు. వైసీపీ లీడర్లు కూడా కొన్ని ప్రాంతాల్లో తెగబడుతున్నారు.

TDP And YSRCP Cadre Attack Each Other: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియ పూర్తి అయింది. కొన్ని రోజుల్లోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. అయితే గెలిచిన ఉత్సాహంలో కొందరు టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టిస్తున్నారు. వైసీపీ బలంగా ఉన్న చోట్ల తమకు ఓట్లు వేయలేదని దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 

టీడీపీ, జనసేన కార్యకర్తలు కత్తులు, కొడవళ్లతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల ఇళ్లలో దూరి దాడులకు తెగబడుతున్నారని వైసీపీ అధికారిక ట్విట్టర్‌లో వీడియోలు పోస్టు చేసింది. వెనుకబడిన వర్గాలపై టీడీపీ, జనసేన నేతలు దాడులకు దిగుతున్నారన్న విమర్శించింది.

రేషన్‌ వాహనాలు ధ్వంసం చేస్తున్నారు... ప్రశ్నించిన వారిని చంపేందుకు కూడా వెనకాడటం లేదని వైసీపీ ఆరోపించింది. తమ పార్టీకి భారీ మెజార్జీ వచ్చిందన్న పొగరో... లేక.. పవర్‌ చేతిలో ఉంటే.. తమను ఎవరూ  ఏమీ చేయలేరన్న ధీమానో కానీ... విచక్షణ మరిచి ఉన్మాదుల్లా మారి పేదలపై దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తింది. ఒకటి కాదు, రెండు కాదు... ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి 

కడప జిల్లా పులివెందులలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త.. ఆదిశేషు ఇంట్లోకి మారణాయుధాలతో ఆకతాయిలు చొరబడ్డాయి. ఇంట్లో ఉన్న మహిళలను బయటకు పంపి... ఆదిశేషుపై కత్తులతో దాడి చేశారు. భయానక వాతావరణం సృష్టించారంటూ.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో... ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు కత్తులతో ఇంట్లోకి వెళ్లారు. ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు మహిళలను... బయటకు పంపారు. ఆ తర్వాత.. ఇంట్లో ఉన్న వ్యక్తిపై దాడికి తెగబడ్డారు. ఇది టీడీపీ గూండాల పనే అని బాధితులు అంటున్నారు.

తిరుపతి జిల్లా చంద్రగిరిలోనూ ఎన్నికల్లో గెలవగానే... వైఎస్‌ఆర్‌సీపీ నాయకులపై దాడులకు దిగుతున్నారని గ్రామస్తులు చెప్తున్నారు. చంద్రగిరి మండలం ఐతేపల్లి సమీపంలోని ఓ దాబా దగ్గర వైసీపీ నాయకుడు, చంద్రగిరి పట్టణ వార్డు మెంబర్ వంశీపై... టీడీపీ నాయకులు మన్సూర్‌, చంద్రశేఖర్‌, ప్రసాద్‌కుమార్‌ రాజు, లోకేష్‌తోపాటు పలువరు దాడి చేశారని సమాచారం. చంద్రగిరి దాసరి వీధి సమీపంలో మండల వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు మస్తాన్‌పై కూడా టీడీపీ నాయకులు... కత్తులతో దాడి చేసేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది.

కళ్యాణదుర్గంలోనూ వైఎస్‌ఆర్‌సీపీ నేత ఉమామహేశ్వర నాయుడు ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశారని సమాచారం. ఆయన కారును ధ్వంసం చేసి... ఇంటిపైకి టీడీపీ గూండాలు రాళ్లు రువ్వినట్టు తెలుస్తోంది. ఏలూరు జిల్లా చింతలపూడి గ్రామంలో వృద్ధిరాలిపై దాడి చేశారట. వృద్ధురాలిని కొట్టి... ట్రాక్టర్ కిందకి తోసేశారని వైసీపీ ఓ వీడియో పోస్టు చేసింది. ఏలూరు జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు పరిధిలోని సూర్యారావుపేటకు చెందిన వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ యలమంచిలి ప్రవీణ్‌కు టీడీపీ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రవీణ్‌కు నివాళులర్పించి... వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు వైసీపీ నేతల అబ్బయ్య చౌదరి. ప్రవీణ్‌ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ప్రభుత్వ ఆస్తులను కూడా టీడీపీ, జనసేన శ్రేణులు ధ్వంసం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బియ్యం పంపిణీ చేసే వాహనాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ ధ్వంసం చేస్తున్నారట. ప్రభుత్వ భవనాలు ముందున్న శిలాఫలకాలు, గ్రామాల్లోని వైఎస్‌ఆర్‌ విగ్రహాలను కూడా పగలగొడుతున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. టీడీపీ-జనసేన శ్రేణుల దాడులకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABPJasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Rahul Gandhi: లోక్‌సభలో రాహుల్ ప్రసంగంపై దుమారం - స్పీకర్ ఆదేశాలతో ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు
లోక్‌సభలో రాహుల్ ప్రసంగంపై దుమారం - స్పీకర్ ఆదేశాలతో ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు
Virat Kohli : ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు కోహ్లీ, ధోనీకి కూడా సాధ్యం కాని ఘనత మరి
ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు కోహ్లీ, ధోనీకి కూడా సాధ్యం కాని ఘనత మరి
Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
Embed widget