అన్వేషించండి

Apollo News: విద్యార్థుల ఆరోగ్య భ‌ద్ర‌తే అపోలో తొలి ప్రాధాన్యమన్న యాజమాన్యం

ఫుడ్ పాయిజ‌న్ కార‌ణంగా యూనివ‌ర్సిటీ విద్యార్థులు ఆస్ప‌త్రిపాలు కావ‌డంపై సంస్థ యాజ‌మాన్యం స్పందించింది. భ‌విష్య‌త్తులో ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చింది.

Apollo Food Poision: విద్యార్థుల ఆరోగ్య భ‌ద్ర‌తే త‌మ ప్ర‌థ‌మ ప్రాధాన్య‌మ‌ని అపోలో యాజ‌మాన్యం పేర్కొంది. చిత్తూరు అపోలో రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో జ‌రిగిన ఫుడ్ పాయిజ‌న్ సంఘ‌ట‌న నేప‌థ్యంలో ఆ సంస్థ యాజ‌మాన్యం ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. యూనివ‌ర్సిటీ డీన్ ఆల్ఫ్రెడ్ జె అగ‌స్టీన్ విద్యార్థుల‌ను, బాధితుల‌ను ఉద్దేశించి ఒక లేఖ రాశారు. 

మెరుగైన వైద్యం అందిస్తున్నాం

విద్యార్థుల ఆరోగ్యం, శ్రేయ‌స్సు మాకు చాలా ముఖ్యం. ఫుడ్ పాయిజ‌న్ కార‌ణంగా విద్యార్థులు ఆస్ప‌త్రి పాలు కావ‌డం మ‌మ‌ల్ని తీవ్ర ఆవేద‌నకు గురి చేసింది. అనారోగ్యంతో ఆస్ప‌త్రిపాలైన ప్ర‌తి ఒక్క‌రికీ మెరుగైన వైద్యం అందిస్తున్నాం. జిల్లా ప్ర‌భుత్వాసుప‌త్రిలో చికిత్స పొందుతున్న చాలా మంది ఇప్ప‌టికే కోలుకుని ఇంటికి కూడా చేరుకున్నారు.  ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు.  ప్ర‌తి విద్యార్థిని సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకునే వ‌ర‌కు పూర్తి బాధ్య‌త అపోలో యాజ‌మాన్య‌మే చూసుకుంటుంది. అంతేకాకుండా భ‌విష్య‌త్తులో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా విద్యార్థుల భోజ‌నం విషయంలోనూ మ‌రింత శ్ర‌ద్ధ తీసుకుంటామ‌ని హామీ ఇస్తున్నా. ఈ ఘ‌ట‌న‌కు బాధ్యులైన వారిపై త‌ప్ప‌కుండా చ‌ర్యలు తీసుకోవ‌డం జ‌రుగుతుంది. ఇప్ప‌టికే దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రుగుతోంది.


Apollo News: విద్యార్థుల ఆరోగ్య భ‌ద్ర‌తే అపోలో తొలి ప్రాధాన్యమన్న యాజమాన్యం

ఏ సాయం కావాలన్నా సంప్రదించాలంటూ డీన్ అగస్టీన్ లేఖ

ఆహార భ‌ద్ర‌తా ప్రొటోకాల్‌, ప్ర‌మాణాల‌ను మెరుగు ప‌రుస్తాం. సుర‌క్షిత‌మైన వాతావ‌ర‌ణంలో బ‌ల‌మైన ఆహారాన్నిఅందించ‌డానికి ఇక‌పై ప్ర‌తిరోజూ ఫుడ్ త‌నిఖీలు చేస్తామ‌ని హామీ ఇస్తున్నా. ఈ విష‌యంలో అపోలో యాజ‌మాన్యం ఏమాత్రం రాజీప‌డే ప్ర‌సక్తే ఉండ‌దు. ఏ విధ‌మైన స‌హాయం అవ‌స‌ర‌మైనా నిర్మొహ‌మాటంగా మ‌మ్మ‌ల్ని సంప్ర‌దించ్చు. అంటూ యూనివ‌ర్సిటీ డీన్ ఆల్ఫ్రెడ్ జె అగ‌స్టీన్ పేరిట ఈ లేఖ‌ను విడుద‌ల చేసింది అపోలో యాజ‌మాన్యం. 

300 మందికి పైగా అస్వ‌స్థ‌త‌

నాలుగు రోజుల క్రితం చిత్తూరులోని అపోలో యూనివ‌ర్సిటీ లో జ‌రిగిన ఫుడ్ పాయిజ‌న్ కార‌ణంగా దాదాపు 300 మందికి పైగా విద్యార్థులు ఆస్ప‌త్రి పాల‌య్యారు. కలుషితాహారం తిన్న కార‌ణంగా వాంతులు, విరేచ‌నాలు డ‌యేరియా బారిన ప‌డిన‌ట్లు డాక్ట‌ర్లు గుర్తించారు. విద్యార్థుల‌ను స‌మీపంలోని జిల్లా ప్ర‌భుత్వాసుప‌త్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కొంత‌మందికి అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ కాలేజీలో ఎంబీబీఎస్‌, బీఎస్సీ, ఏహెచ్‌ఎస్‌, ఫిజియోథెరపీ, ఎంఎస్‌సీ, బీటెక్‌, ఎంబీఏ కోర్సుల్లో దాదాపు 900 మంది ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందినవారు చదువుతున్నారు. వీరంతా యూనివ‌ర్సిటీ హాస్టల్లోనే ఉంటున్నారు. చిత్తూరు ప‌ట్ట‌ణానికి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలోని మురకంబట్టు ప్రాంతంలో ఈ అపోలో మెడికల్‌ కాలేజీ ఉంది. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం విద్యార్థులు వంకాయ‌, సాంబారుతో భోజ‌నం తిన్నారు. అదే రోజు రాత్రి నుంచే కొంద‌రికి వాంతులు, విరేచ‌నాలు మొద‌ల‌య్యాయి. రాత్రి సాంబారు,దోశ తిన్న‌వారికి బుధ‌వారం వేకువ‌జామున 2 గంట‌ల ప్రాంతంలో తీవ్ర‌మైన క‌డుపునొప్పి,వాంతులు, విరేచ‌నాల‌తో ఆస్ప‌త్రిలో చేరారు. ఉద‌యాన్నే టిపిన్‌లోకి మిర‌పకాయ బ‌జ్జీ, ఉగ్నాని, ఉప్మా తిన్న‌వారు ఇదే విధంగా ఆస్ప‌త్రి పాల‌య్యారు. 
దాదాపు 300 మందికి పైగా విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. 

Also Read: Blue Ribbon Overseas: అపోలో మెడ్‌స్కిల్స్‌తో బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఒప్పందం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Embed widget