అన్వేషించండి

Ap News:ఊపేసిన ఉప్పాడ పట్టు, అదరగొట్టి అరకు కాఫీ, వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రొడక్ట్‌ ప్రోగాంలో ఏపీకి ఆరు పతకాలు

చేతివృత్తి కళాకారులను ప్రోత్సహించి చేయూతనిచ్చేందుకు కేంద్రం ప్రవేశంపెట్టిన వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రొడక్ట్‌ ప్రోగాంలో ఏపీకి ఆరు పతకాలు దక్కాయి.

కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకంలో ఏపీ ప్రభుత్వానికి ఏకంగా ఆరు అవార్డులు(Medels) దక్కాయి. సామాజిక, ఆర్ధిక అభివృద్దిని ప్రోత్సహించే లక్ష్యంతో దేశంలోని ప్రతి జిల్లా నుంచి ఒక ఉత్పత్తిని ఎంపిక చేసి, బ్రాండింగ్, విస్తృత ప్రచారం కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రొడక్ట్‌ ‍( One District One Product) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా చేతివృత్తి కళాకారులను ప్రోత్సహించడం, ఉపాధి అవకాశాలు కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 12 అవార్డుల్లో ఒక్క ఏపీనే 6 అవార్డులు కైవసం చేసుకోవడం విశేషం. అరకు(Araku) కాఫీ‍, సవర ఆదివాసీ పెయింటింగ్, చిత్తూరు టెర్రకోట, దుర్గి రాతి శిల్పాలు వంటి స్థానిక ఉత్పత్తులను అభివృద్ధి చేయడం, ప్రోత్సహించడం ద్వారా ఇది విజయవంతమైంది. రాష్ట్రం అంతర్గత వనరులను గుర్తించి, ఉపయోగించుకునే ప్రక్రియ ద్వారా ఒకే జిల్లా ఒకే ప్రోడక్ట్‌ (ఓడీఓపీ) చొరవ అట్టడుగు వర్గాలకు ఆర్థిక విలువను అందించింది.

జామ్దానీ జబర్దస్త్‌
కాకినాడ జిల్లా ఉప్పాడ (Uppada) జామ్దాని చీరలు, అల్లూరి జిల్లా అరకు(Araku) కాఫీకి బంగారు పతకాలు కైవసం చేసుకోగా... పొందూరు( Pondhuru) కాటన్, కోడుమూరు, గద్వాల్‌(Gadwal) చీరలకు కాంస్య పతకాలు దక్కాయి. మదనపల్లె(Madanapalle) పట్టు, మంగళగిరి(Mangalagiri) చేనేత చీరలకు ప్రత్యేక జ్యూరీ అవార్డులు వచ్చాయి. ఉప్పాడ జామ్దాని చీరలకు దాదాపు మూడు వందల ఏళ్లనాటి చరిత్ర ఉంది. జామ్దాని చీరలు ఈ ప్రాంతంలో నేతన్నల చేతుల్లోనే ప్రాణం పోసుకుంటాయి. బంగ్లాదేశ్‌కు చెందిన ఈ అపురూప కళలో చీరలపై మొక్కలు, పూలు డిజైన్లు వేస్తారు. శుభకార్యాల్లో ఉప్పాడ జామ్దానీ పట్టుచీరలు ధరించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తారు. వందశాతం పట్టుతో రూపుదిద్దుకునే ఈ చీరల కోసం నేత కళాకారులు ఎంతో సహనం, ఓర్పుతో నేస్తారు. ఒక్కో చీర నేయడానికే సుమారు 15 రోజుల సమయం తీసుకుంటంది. అంతటి ప్రాధాన్యం ఉంది కాబట్టే ఉప్పాడ జామ్దాని చీర బంగారు పతకం కైవసం చేసుకుంది.

అరకు కాఫీ అపురూపం
దేశంలో అస్సాం టీ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు అరకు కాఫీకే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. విశాఖ(Vizag) మన్యంలో పూర్తిగా సేంద్రీయ పద్ధతుల్లో ఎలాంటి రసాయనాలు, పురుగు మందులు వాడకుండా గిరిజనులు అడవుల్లో పండించడం వల్లే ఈ కాఫీ పొడికి అంత రుచి వచ్చింది. అరకులో తయారయ్యే అర్గానిక్ కాఫీ విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందింది.ఇది దేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ కాఫీ బ్రాండ్. దీని రుచి అమోఘం.. అందుకే వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రొడక్ట్‌ పథకంలో బంగారు పతకం కైవసం చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పొందూరు కాటన్‌ బట్టలకు ఎంతో ప్రత్యేకం. ఇక్కడ హ్యాండ్‌స్పన్ ఫాబ్రిక్ తయారీకి ప్రసిద్ధి. అలాగే గద్వాల్, కోడుమూరు పట్టు చీరలు సైతం వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్నాయి. వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రొడక్ట్‌ పథకంలో ఇవి కాంస్య పతాకాలు కైవసం చేసుకున్నారు. పట్టుగూళ్ల పరిశ్రమకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మదనపల్లెలోనాణ్యమైన పట్టుదారం లభిస్తుంది. దీంతో తయారైన పట్టుచీరలు, అలాగే మంగళగిరిలో చేనేత చీరలు సైతం ఎంతో ఆకట్టుకోవడంతో ప్రత్యేక జ్యూరీ అవార్డులు దక్కించుకున్నాయి.

సగానికి సగం కైవసం
ఇటీవల ఢిల్లీ(Delhi)లో జరిగిన కార్యక్రమంలో అధికారులు ఈ అవార్డులను అందుకున్నారు. రాష్ట్రానికి వచ్చిన అవార్డలతో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి జగన్‌(Ap Cm Jagan) ను కలవగా...ఆయన వారందరినీ అభినందించారు. రాష్ట్రం నుంచి టెక్స్‌టైల్స్, హస్తకళలు, చేనేత, మత్స్య, పారిశ్రామిక రంగాలతో సహా 26 ఉత్పత్తుల కోసం దరఖాస్తులను సమర్పించగా...14 ఉత్పత్తులు షార్ట్‌లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయని వారు సీఎంకు వివరించారు. వీటిల్లో ఆరు అవార్డులు గెలుచుకున్నాయన్నారు. మొత్తం అవార్డుల్లో సగానికి సగం రాష్ట్రానికే వచ్చాయని వివరించారు. అవార్డులు వచ్చేలా కృషి చేసిన అధికారులను సీఎం జగన్‌ అభినంధించారు.

టాప్ హెడ్ లైన్స్

Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget