అన్వేషించండి

Sajjala : తిట్టిన నోటితోనే బీజేపీని పొగుడుతున్నారు - చంద్రబాబుపై సజ్జల విమర్శలు !

బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. పొత్తులు లేకుండా పోటీ చేసే ఆలోచన చంద్రబాబుకు లేదన్నారు.


Sajjala :  తిట్టిన నోటితోనే చంద్రబాబు బీజేపీని పొగుడుతున్నారని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో చంద్రబాబు వంగి వంగి.. నంగి నంగి మాట్లాడారని మండిపడ్డారు. చంద్రబాబు బపూన్ కు ఎక్కువ జోకర్‌కు తక్కువ అని మండిపడ్డారు. పొత్తు లేకుండా ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడూ రలేదని..  రాజకీయాలు ప్రజల కోసం చేయాలన్నారు.  బీజేపతో పొత్తుకు చంద్రబాబు తహతహలాడుతున్నారని  ఇప్పుడు ఢిల్లీ  వెళ్లి చంద్రబాబు హడావుడి చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఏపీ పరువు తీస్తున్నారని  విమర్శించారు. 2019 వరకూ చంద్రబాబు ప్రజలకు ఏమి చేశారో చెప్పాలన్నారు. తెలుగుదేశం పార్టీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు ఎన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తుందో.. చంద్రబాబుకే క్లారిటీ లేదన్నారు. పురందేశ్వరి టీడీపీ ఏజెంట్ లా మారారని సజ్జల ఆరోపించారు.  లోకేష్ పాదయాత్రకుత టీడీపీ కార్యకర్తలే రావడం లేదన్నారు. 

ప్రజలను భ్రమల్లో పెట్టాలనుకునేవాళ్లు.. భ్రమల్లోనే వుంటారని సజ్జల వ్యాఖ్యానించారు.  అవసరం వున్నప్పుడల్లా ఇప్పటికీ ఎన్టీఆర్‌ను చంద్రబాబు వాడుకుంటున్నారని సజ్జల ఆరోపించారు. దగ్గుబాటి పురంధేశ్వరి టీడీపీ ఏజెంట్‌లా మారారని.. బీజేపీతో కలిసేందుకు పురందేశ్వరి, పవన్‌తో పైరవీలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతి భవన్ లో చంద్రబాబు అండ్ కో తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేంద్రంగా మలచుకున్నారని సజ్జల పేర్కొన్నారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతికి అవకాశం ఇవ్వకపోవటం సరి కాదన్నారు. 1994లో ఎన్టీఆర్ అందరి సమక్షంలోనే లక్ష్మీ పార్వతి తన సతీమణిగా పరిచయం చేసారని గుర్తు చేసారు.ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లోనూ పార్టీ తరపున ఎన్టీఆర్ తో కలిసి లక్ష్మీపార్వతి ప్రచారం చేసారని సజ్జల చెప్పుకొచ్చారు. అసలు లక్ష్మీపార్వతికి ఎన్టీఆర్ తో సంబంధం లేదని చెప్పగలరా అని సజ్జల ప్రశ్నించారు. లోకేశ్ యాత్రకు కార్యకర్తలే రావటం తేదన్నారు. ప్రజలకు ఏం చేస్తామో చెప్పే ధైర్యం టీడీపీకి లేదని సజ్జల పేర్కొన్నారు. ఎవరు పొత్తులతో వచ్చినా..ప్రజలు తమతోనే ఉన్నారని సజ్జల ధీమా వ్యక్తం చేసారు.       

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక గురించి ప్రతిపక్షాలు మాట్లాడటంపై సజ్జల కీలక విశ్లేషణ చేసారు. ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా పాజటివ్ ఓటింగ్ పైనే నమ్మకంతో ఉన్నారని సజ్జల వెల్లడించారు. ప్రస్తుతం 70 శాతం మేర పాజిటివ్ ఓటింగ్ ఉందని, కొంత తగ్గినా 60 శాతం వైసీపీకి పాజిటివ్ ఓటింగ్ ఉందని పేర్కొన్నారు.ప్రతిపక్షాలు మిగిలిన ఓటింగ్ శాతంలో చీలిక లేకుండా చేసినా.. కలిసి పోటీ చేసినా ప్రభావం ఉండదని సజ్జల తేల్చి చెప్పారు. అసలు టీడీపీ 175 స్థానాల్లో పోటీ చేసే పరిస్థితి లేదని, అటువంటి పార్టీ వైసీపీ గురించి మాట్లాడుతుందని ఎద్దేవా చేసారు. చంద్రబాబు చెబుతున్నట్లుగా ప్రజలు టీడీపీకి బ్రహ్మరధం పడితే పొత్తులు ఎందుకని సజ్జల ప్రశ్నించారు.                                                      

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
AP School Timings: ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget