అన్వేషించండి

Somu Veerraju: ఏపీలో రేషన్ బియ్యంపై వెయ్యి కోట్ల కుంభకోణం జరుగుతోంది - సోము వీర్రాజు ఆరోపణలు

రేషన్ బియ్యం రీసైకిల్ చేసి వెయ్యి కోట్లు కుంభకోణం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ఈ మాఫియాలో వైసీపీ నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి (BRS) పేరుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెడితే అడ్డుకుంటామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (AP BJP Chief Somu Veerraju) హెచ్చరించారు. గన్నవరం వేదికగా ప్రజాపోరు ప్రారంభం చేద్దామంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం...  
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గన్నవరంలో జరిగింది. ఈ సందర్బంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దిగ్బంధం చేసే విధంగా జిల్లా స్థాయిలో కూడా ఛార్జిషీట్ దాఖలు చేస్తామన్నారు. రైతులకు భీమా సౌకర్యం లేకుండా నట్టేట ముంచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు. రైతులకు చిల్లులు పడిన గోనె సంచులు ఇవ్వడంలో ప్రభుత్వం మాఫియాను నడుపుతోందని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ఛార్జ్ షీట్ లో పొందుపరుస్తున్నట్లు సోము వీర్రాజు వెల్లడించారు.

రాష్ట్రంలో రేషన్ మాఫియా... 
రేషన్ బియ్యం రీసైకిల్ చేసి వెయ్యి కోట్లు కుంభకోణం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ఈ మాఫియాలో అధికార పార్టీకి చెందిన నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు సేకరించామని అన్నారు. రైతు భరోసా కేంద్రాలు రైతు దోపిడీ కేంద్రాలుగా మారాయని ఎద్దేవా చేశారు.

కేంద్ర కాంట్రాక్టులు మంత్రి అనుచరులకు కేటాయింపు.. 
జాతీయ రహదారుల కనెక్టివిటికి కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఇస్తే, ఆంధ్రప్రదేశ్ లో ఆయా కాంట్రాక్ట్ పనులను మంత్రి అనుచరులకు కట్టబెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టుల కోసం అధికారులుపై ఒత్తిడి తీసుకువచ్చి, అవినీతి అక్రమాలకు కేంద్రంగా మంత్రులు మారుతున్నారని, అన్నీ తెలిసినప్పటికి అధికారులు సైలెంట్ అయిపోవాల్సిన పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.

బ్రాందీ మీదే మమకారం... 
రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాల మీదనే ఎక్కువ ధ్యాస ఉందని సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్ పై రాష్ట్ర ప్రభుత్వానికి అసలు అవగాహన లేదని అన్నారు. బ్రాందీ మీద ఉన్న అవగాహన ఆయుష్ పై ముఖ్యమంత్రి జగన్ కి లేదన్నారు. సాంప్రదాయ వైద్య విధానం పై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షలు చేయడం లేదన్నారు. జగన్ బ్రాందీ షాపు ల్లో అంతా క్యాష్ ని వినియోగిస్తున్నారని, ఆ నగదు అంతా ఎక్కడికి వెళుతుందని సోము వీర్రాజు ప్రశ్నించారు.

ఇళ్ల స్థలాల కోనుగోలులో అవినీతి... 
వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి 22 లక్షల ఇళ్ళు కేంద్రం ప్రభుత్వం ఇస్తే 7 లక్షలు నిర్మాణం చేశామని చెపుతున్నారని, ఎంత మందికి ఇళ్ళను కేటాయించారో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలు కొనుగోలులో వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు వందల కోట్ల రూపాయలు అవినీతికి  పాల్పడ్డారని ఆరోపించారు. ఇంత దారుణమైన ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా నిత్యకృత్యం అయ్యాయని, టిడ్కో ఇళ్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ఛార్జ్ షీట్ లో ఎమ్మెల్యేలే టార్గెట్.. 
బీజేపీ అనుబంధ సంఘాలు ఛార్జిషీట్ దాఖలు చేస్తాయని, ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి ఛార్జిషీట్ లు దాఖలు చేసినట్లు తెలిపారు. బీజేపీ నేతలపై నెల్లూరు జిల్లా కావలిలో పోలీసులు దాష్టికాన్ని రాష్ట్ర గవర్నర్ కి ఫిర్యాదు చేశామని చెప్పారు.  

మోడీ పాలన రావాల్సిందే... 
అవినీతి అంతం కావాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో రావాలని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. ఇళ్ళు కట్టలేని దద్దమ్మ ప్రభుత్వం ఇక్కడ ఉందని, జిల్లా, రాష్ట్ర స్థాయి ఛార్జిషీట్ దాఖలు చేస్తామని, నరేంద్ర మోడీ పరిపాలన మే30 నుండి జూన్ 30 వరకు ప్రతి ఇంటి కి తీసుకొని వెళ్తామన్నారు. దశాబ్ద కాలంలో కాంగ్రెస్ వేల కోట్ల అవినీతి కి పాల్పడిందని ఆరోపించారు. కానీ బీజేపీ పాలనలో అవినీతికి చోటు లేదన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"ఒక్కో ఉద్యోగం 40 లక్షలు" టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు 
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
YS Sharmila Rajya Sabha Seat: చివరి క్షణంలో షర్మిలకు రాజ్యసభ చాన్స్ మిస్ - వైఎస్ఆర్‌సీపీతో స్నేహం కోసమే రాహుల్ వ్యూహాత్మక నిర్ణయమా?
చివరి క్షణంలో షర్మిలకు రాజ్యసభ చాన్స్ మిస్ - వైఎస్ఆర్‌సీపీతో స్నేహం కోసమే రాహుల్ వ్యూహాత్మక నిర్ణయమా?
YS Jagan News: ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News:
"ఒక్కో ఉద్యోగం 40 లక్షలు" టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు 
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
Karnataka Minister Ramalinga Reddy : కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
Embed widget