అన్వేషించండి

YSRCP Rajya Sabha: తెలంగాణ వ్యక్తుల్ని రాజ్యసభ పదవుల నుంచి తొలగించండి - సీఎం జగన్‌కు ఏపీ నిరుద్యోగ జేఏసీ నిరసన సెగ

R Krishnaiah and Niranjan Reddy : ఏపీ వారిని కాదని, తెలంగాణ వ్యక్తులకు పదవులు ఇవ్వడంపై ఏపీ నిరుద్యోగ జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని తొలగించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ని డిమాండ్ చేశారు.

YSRCP Rajya Sabha Members: ఎంపీ వి.విజయసాయిరెడ్డితో పాటు ఆర్‌.కృష్ణయ్య, ఎస్‌.నిరంజన్‌రెడ్డి, బీదా మస్తాన్‌రావులను వైఎస్సార్‌సీపీ తమ రాజ్యసభ సభ్యులుగా మంగళవారం ప్రకటించింది. అయితే ఏపీ వారిని కాదని, తెలంగాణ వ్యక్తులకు పదవులు ఇవ్వడంపై ఏపీ నిరుద్యోగ జేఏసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, న్యాయవాది నిరంజన్ రెడ్డిలు తెలంగాణకు చెందిన వారని, వారికి కేటాయించిన రాజ్యసభ పదవుల నుంచి తక్షణమే తొలగించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు.

2024 ఎన్నికల్లో జగన్‌కు కష్టమే.. 
ఆ ఇద్దరికి కేటాయించిన రాజ్యసభ పదవుల నుంచి తొలగించకపోతే 2024లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలు, రుద్యోగులు, ప్రజలు సీఎం జగన్‌కు దూరం అవుతారని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సమయం హేమంత్ కుమార్, ఎస్సీ ఎస్టీ నాయకులు అక్క బత్తుల గిరీష్ బీసీ నాయకులు ఉమ్మడి మహేష్ సంతోష్ చిన్ని  సీతంపేట వేదికగా తెలియజేశారు. తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డిలు తెలంగాణ రాష్ట్ర సాధణ పోరాటంలో ఆంధ్రులకు వ్యతిరేకంగా  కీలక పాత్ర పోషించారని, 2024 వరకు తమకు హైదరాబాద్‌లో ఉమ్మడి రాజధానిగా సమాన హక్కు ఉన్నప్పటికీ, ఎన్నడూ ఏపీ నిరుద్యోగులను హైదరాబాద్ ఉద్యోగాలలో స్థానికులుగా పరిగణించాలని ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డిలు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదన్నారు.

ఆంధ్ర ద్రోహులకు రాజ్యసభ పదవులా ? 
అలాంటి ఆంధ్ర ద్రోహులకు రాష్ట్రం నుంచి వైఎస్సార్‌సీపీ నేతలు రాజ్యసభకు వారిని పంపడం అన్యాయం అన్నారు. ఏపీలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరెడ్డిని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, సీఎం వైఎస్ జగన్‌ను, రాష్ట్రాని అభిమానించే ఎంతోమంది కార్యకర్తలు, అభిమానులు ఉండగా, 175 బీసీ కులాలకు చెందిన లక్షలాది మంది నేతల్ని కాదని తెలంగాణకు చెందిన వ్యక్తులకు రాజ్యసభ పదవులు ఇవ్వడం తమ మనోభావాలు దెబ్బతీయడమేనన్నారు. నిరుద్యోగ పోరాటాలు చేసిన ఉద్యమకారులు ఏపీలో ఉండగా, వారందర్నీ కాదని ఆర్.కృష్ణయ్య ,నిరంజన్ రెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏపీ నేతలకు రాజ్యసభ పదవులను కేటాయించే వరకు నిరసన దీక్షలు కొనసాగిస్తామని ఏపీ నిరుద్యోగ జేఏసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు స్పష్టం చేశారు.  

Also Read: R Krishnaiah Thanks YS Jagan: ఏ రాజకీయ పార్టీ గుర్తించలేదు, కానీ వైఎస్ జగన్ ఛాన్స్ ఇచ్చారు : ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు

Also Read: Lucky Krishnayya : ఏ పార్టీ అయినా పిలిచి మరీ అవకాశాలు - అదృష్టమంటే ఆర్.కృష్ణయ్యదే !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
WPL Result Update: గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.