అన్వేషించండి

Bhimavaram Latest News: భీమవరానికి ఇద్దరు ఎంపీలు - గోదావరి జిల్లాలో బీజేపీ బిగ్‌ గేమ్ ప్లాన్

Bhimavaram Latest News: భీమవరానికి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. అందులో ఒకరు కేంద్రమంత్రి కూడా. గోదావరి జిల్లాలను కేంద్రంగా చేసుకోని బీజేపీ సరికొత్త పొలిటికల్ గేమ్ ఆడుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Bhimavaram Latest News: గోదావరి జిల్లాలకు ఆర్థిక రాజధాని గా పేరొందిన భీమవరానికి అరుదైన అవకాశం లభించింది. ఈ పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కేంద్రంలో ఒకే పార్టీ నుంచి ఎంపీలుగా ఉన్నారు. అది కూడా ఒకే సమయంలో నరసాపురం నుంచి ఎంపీగానూ కేంద్ర మంత్రి గానూ ఉన్న శ్రీనివాస్ వర్మ, రెండు రోజుల క్రితం బిజెపి నుంచి రాజ్యసభ సీటు పొందిన  పాకా సత్యనారాయణ ఇద్దరూ భీమవరం వాస్తవ్యులే. ఇలా ఒకే సమయంలో ఒకే పార్టీ నుంచి ఒకే ఊరికి చెందిన ఇద్దరు ఎంపీలుగా ఉండడం అరుదైన ఘటనగానే చెప్పాలి. అందులోనూ 1996లో నరసాపురం ఎంపీగా బిజెపి నుంచి  పాక సత్యనారాయణ పోటీ చేస్తే ఆయనకు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా ప్రస్తుత నర్సాపురం ఎంపీ కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ పనిచేశారు అంటారు. ఇప్పుడు కట్ చేస్తే ఇద్దరూ అదే బిజెపి నుంచి ఎంపీలుగా ఉన్నారు. మూడు దశాబ్దాలుపైబడి పార్టీకి కట్టుబడి ఉన్నందుకు ఈ ఇద్దరు సీనియర్ నేతలకు బిజెపి హైకమాండ్ ఇచ్చిన గుర్తింపు ఇది. ఇది భీమవరానికి ఒక గర్వకారణమైన రోజు అని అక్కడి ప్రజలు చెబుతున్నారు.

Image

భీమవరం అంటే.. మోదీ అయినా రావలసిందే

గత కొన్నేళ్లలో భీమవరం ఆర్థికంగా చాలా ఉచ్చస్థితికి చేరుకుంది. అక్కడి రాజులు ఏం చెబితే అది ఢిల్లీ స్థాయిలో జరిగిపోవాల్సిందే. వాళ్ల పలుకుబడి ఆరేంజ్‌కు వెళ్ళిపోయింది. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కృష్ణంరాజు బిజెపి నుంచి ఎంపీగా కేంద్రమంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనే భీమవరం రాజులు బిజెపికి దగ్గరయ్యారు. కృష్ణంరాజు తమ్ముడు కొడుకు ప్రభాస్ బాహుబలితో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాక ప్రధాని మోదీ ఆయనను పిలిచి మరీ అభినందించారు. భీమవరం ప్రాంత రాజుల పలుకుబడి గుర్తించిన ప్రధాని మోదీ ఎలాగైనా ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలని చూస్తున్న బిజెపికి క్షత్రియ సామాజిక వర్గాన్ని ఒక అవకాశంగా చూపించారు అంటారు.

ఏపీలో బలమైన చౌదరి, రెడ్డి, కాపు సామాజిక వర్గాలు పార్టీలపరంగా విడిపోయి ఉన్నాయి. వారిలాగే అర్థికంగా రాజకీయంగా పలుకుబడి ఉన్న క్షత్రియ సామాజిక వర్గాన్ని బీజేపీ వైపు ఆకర్షించే పనిలో కమలనాథులు పావులు కదిపారు. అందుకే భీమవరం రాజులు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని భీమవరంలో ప్రతిష్టిస్తే  ఏకంగా ప్రధాని మోదీనే ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. తర్వాత 2024 ఎన్నికలు వచ్చేసరికి  కావాలని కూటమిలో పట్టుబట్టి మరీ నర్సాపురం ఎంపీ సీటును సాధించుకున్నారు. అక్కడ నుంచి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన  శ్రీనివాస వర్మను పోటీలో నిలబెట్టి గెలిపించి కేంద్రమంత్రిని చేశారు.

ఇప్పుడు బీసీల వంతు

బిజెపికి అగ్రవర్ణాల పార్టీగా ఒక పేరు ఉంది. దాన్ని చెరిపేసుకోవడానికి అన్నట్టు బీసీ సామాజిక వర్గానికి చెందిన పాక సత్యనారాయణను హఠాత్తుగా ఎంపీని చేసింది బిజెపి. విజయసాయి రెడ్డి రాజీనామా చేశాక ఖాళీ అయిన స్థానాన్ని టిడిపి జనసేనతో పోటీ పడి మరీ దక్కించుకున్న బిజెపి పార్టీకి ఎప్పటి నుంచో కట్టుబడి ఉన్న వ్యక్తిగా పేరు ఉన్న పాకా సత్యనారాయణకు ఆ పదవి కట్టబెట్టింది. దీంతో ఒకే పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు ఎంపీ పదవులు ఇచ్చిన పార్టీగా భీమవరం పరిసర ప్రాంతాల్లో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో బిజెపి ఉంది. అలాగే క్షత్రియ బీసీ వర్గాలకు చెందిన వ్యక్తులకు కీలక పదవులు ఇచ్చామని  ప్రచారం కూడా చేసుకుంటుంది. వీళ్ళు మాత్రమే కాదు కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని మరొక బలమైన సామాజిక వర్గాన్ని కూడా దగ్గర చేసుకునే ప్రయత్నంలో బిజెపి నేతలు తలమునకులై ఉన్నారు.ఈ లెక్కలన్నీ పక్కన పెడితే ఒకే పట్టణానికి చెందిన ఇద్దరు నేతలకు ఒకే పార్టీ ఎంపీ సీట్లు ఇవ్వడం ఏపీలో హాట్ టాపిక్ అయింది. మరి ఆ ఇద్దరు కీలక నేతలు భీమవరానికి కేంద్రం నుంచి ఎలాంటి తాయిలాలు సాధించుకు వస్తారో చూడాలి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Delhi : ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
Stranger Things Series Season 5 OTT : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Embed widget