అన్వేషించండి

Bhimavaram Latest News: భీమవరానికి ఇద్దరు ఎంపీలు - గోదావరి జిల్లాలో బీజేపీ బిగ్‌ గేమ్ ప్లాన్

Bhimavaram Latest News: భీమవరానికి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. అందులో ఒకరు కేంద్రమంత్రి కూడా. గోదావరి జిల్లాలను కేంద్రంగా చేసుకోని బీజేపీ సరికొత్త పొలిటికల్ గేమ్ ఆడుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Bhimavaram Latest News: గోదావరి జిల్లాలకు ఆర్థిక రాజధాని గా పేరొందిన భీమవరానికి అరుదైన అవకాశం లభించింది. ఈ పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కేంద్రంలో ఒకే పార్టీ నుంచి ఎంపీలుగా ఉన్నారు. అది కూడా ఒకే సమయంలో నరసాపురం నుంచి ఎంపీగానూ కేంద్ర మంత్రి గానూ ఉన్న శ్రీనివాస్ వర్మ, రెండు రోజుల క్రితం బిజెపి నుంచి రాజ్యసభ సీటు పొందిన  పాకా సత్యనారాయణ ఇద్దరూ భీమవరం వాస్తవ్యులే. ఇలా ఒకే సమయంలో ఒకే పార్టీ నుంచి ఒకే ఊరికి చెందిన ఇద్దరు ఎంపీలుగా ఉండడం అరుదైన ఘటనగానే చెప్పాలి. అందులోనూ 1996లో నరసాపురం ఎంపీగా బిజెపి నుంచి  పాక సత్యనారాయణ పోటీ చేస్తే ఆయనకు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా ప్రస్తుత నర్సాపురం ఎంపీ కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ పనిచేశారు అంటారు. ఇప్పుడు కట్ చేస్తే ఇద్దరూ అదే బిజెపి నుంచి ఎంపీలుగా ఉన్నారు. మూడు దశాబ్దాలుపైబడి పార్టీకి కట్టుబడి ఉన్నందుకు ఈ ఇద్దరు సీనియర్ నేతలకు బిజెపి హైకమాండ్ ఇచ్చిన గుర్తింపు ఇది. ఇది భీమవరానికి ఒక గర్వకారణమైన రోజు అని అక్కడి ప్రజలు చెబుతున్నారు.

Image

భీమవరం అంటే.. మోదీ అయినా రావలసిందే

గత కొన్నేళ్లలో భీమవరం ఆర్థికంగా చాలా ఉచ్చస్థితికి చేరుకుంది. అక్కడి రాజులు ఏం చెబితే అది ఢిల్లీ స్థాయిలో జరిగిపోవాల్సిందే. వాళ్ల పలుకుబడి ఆరేంజ్‌కు వెళ్ళిపోయింది. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కృష్ణంరాజు బిజెపి నుంచి ఎంపీగా కేంద్రమంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనే భీమవరం రాజులు బిజెపికి దగ్గరయ్యారు. కృష్ణంరాజు తమ్ముడు కొడుకు ప్రభాస్ బాహుబలితో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాక ప్రధాని మోదీ ఆయనను పిలిచి మరీ అభినందించారు. భీమవరం ప్రాంత రాజుల పలుకుబడి గుర్తించిన ప్రధాని మోదీ ఎలాగైనా ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలని చూస్తున్న బిజెపికి క్షత్రియ సామాజిక వర్గాన్ని ఒక అవకాశంగా చూపించారు అంటారు.

ఏపీలో బలమైన చౌదరి, రెడ్డి, కాపు సామాజిక వర్గాలు పార్టీలపరంగా విడిపోయి ఉన్నాయి. వారిలాగే అర్థికంగా రాజకీయంగా పలుకుబడి ఉన్న క్షత్రియ సామాజిక వర్గాన్ని బీజేపీ వైపు ఆకర్షించే పనిలో కమలనాథులు పావులు కదిపారు. అందుకే భీమవరం రాజులు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని భీమవరంలో ప్రతిష్టిస్తే  ఏకంగా ప్రధాని మోదీనే ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. తర్వాత 2024 ఎన్నికలు వచ్చేసరికి  కావాలని కూటమిలో పట్టుబట్టి మరీ నర్సాపురం ఎంపీ సీటును సాధించుకున్నారు. అక్కడ నుంచి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన  శ్రీనివాస వర్మను పోటీలో నిలబెట్టి గెలిపించి కేంద్రమంత్రిని చేశారు.

ఇప్పుడు బీసీల వంతు

బిజెపికి అగ్రవర్ణాల పార్టీగా ఒక పేరు ఉంది. దాన్ని చెరిపేసుకోవడానికి అన్నట్టు బీసీ సామాజిక వర్గానికి చెందిన పాక సత్యనారాయణను హఠాత్తుగా ఎంపీని చేసింది బిజెపి. విజయసాయి రెడ్డి రాజీనామా చేశాక ఖాళీ అయిన స్థానాన్ని టిడిపి జనసేనతో పోటీ పడి మరీ దక్కించుకున్న బిజెపి పార్టీకి ఎప్పటి నుంచో కట్టుబడి ఉన్న వ్యక్తిగా పేరు ఉన్న పాకా సత్యనారాయణకు ఆ పదవి కట్టబెట్టింది. దీంతో ఒకే పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు ఎంపీ పదవులు ఇచ్చిన పార్టీగా భీమవరం పరిసర ప్రాంతాల్లో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో బిజెపి ఉంది. అలాగే క్షత్రియ బీసీ వర్గాలకు చెందిన వ్యక్తులకు కీలక పదవులు ఇచ్చామని  ప్రచారం కూడా చేసుకుంటుంది. వీళ్ళు మాత్రమే కాదు కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని మరొక బలమైన సామాజిక వర్గాన్ని కూడా దగ్గర చేసుకునే ప్రయత్నంలో బిజెపి నేతలు తలమునకులై ఉన్నారు.ఈ లెక్కలన్నీ పక్కన పెడితే ఒకే పట్టణానికి చెందిన ఇద్దరు నేతలకు ఒకే పార్టీ ఎంపీ సీట్లు ఇవ్వడం ఏపీలో హాట్ టాపిక్ అయింది. మరి ఆ ఇద్దరు కీలక నేతలు భీమవరానికి కేంద్రం నుంచి ఎలాంటి తాయిలాలు సాధించుకు వస్తారో చూడాలి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Temple: పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
Hyderabad Crime News: అమ్మాయి ఫొటోతో మెస్సేజ్ చేసి రూ.14 కోట్లు కొట్టేశారు.. నలుగురి అరెస్ట్‌, అతిపెద్ద సైబర్ మోసం
అమ్మాయి ఫొటోతో మెస్సేజ్ చేసి రూ.14 కోట్లు కొట్టేశారు.. నలుగురి అరెస్ట్‌, అతిపెద్ద సైబర్ మోసం
CM Revanth Reddy: పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
Maa Vande Movie : మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్

వీడియోలు

Sanju Samson For T20 World Cup 2026 | మొత్తానికి చోటు దక్కింది...సంజూ వరల్డ్ కప్పును శాసిస్తాడా | ABP Desam
Ishan Kishan Named T20 World Cup 2026 | రెండేళ్ల తర్వాత టీ20ల్లో ఘనంగా ఇషాన్ కిషన్ పునరాగమనం | ABP Desam
Shubman Gill Left out T20 World Cup 2026 | ఫ్యూచర్ కెప్టెన్ కి వరల్డ్ కప్పులో ఊహించని షాక్ | ABP Desam
T20 World Cup 2026 Team India Squad Announced | ఊహించని ట్విస్టులు షాకులతో టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ | ABP Desam
Tilak Varma Innings Ind vs SA T20 | అహ్మదాబాద్‌లో రెచ్చిపోయిన తిలక్ వర్మ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Temple: పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
Hyderabad Crime News: అమ్మాయి ఫొటోతో మెస్సేజ్ చేసి రూ.14 కోట్లు కొట్టేశారు.. నలుగురి అరెస్ట్‌, అతిపెద్ద సైబర్ మోసం
అమ్మాయి ఫొటోతో మెస్సేజ్ చేసి రూ.14 కోట్లు కొట్టేశారు.. నలుగురి అరెస్ట్‌, అతిపెద్ద సైబర్ మోసం
CM Revanth Reddy: పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
Maa Vande Movie : మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
Ishan Kishan Viral Video: టి20 ప్రపంచ కప్‌నకు ఎంపికైన ఇషాన్ కిషన్.. ప్యాకెట్ డైనమైట్ ఫస్ట్ రియాక్షన్ చూశారా
టి20 ప్రపంచ కప్‌నకు ఎంపికైన ఇషాన్ కిషన్.. ప్యాకెట్ డైనమైట్ ఫస్ట్ రియాక్షన్ చూశారా
ఉద్యోగులకు EPFO శుభవార్త.. వారాంతపు సెలవుల్లో బీమా క్లెయిమ్ కట్ అవ్వదు
ఉద్యోగులకు EPFO శుభవార్త.. వారాంతపు సెలవుల్లో బీమా క్లెయిమ్ కట్ అవ్వదు
Tata Punch CNG లేదా Hyundai Exter CNG లలో ఏది బెటర్? రూ. 7 లక్షల్లో ఏ కారు మంచిది
Tata Punch CNG లేదా Hyundai Exter CNG లలో ఏది బెటర్? రూ. 7 లక్షల్లో ఏ కారు మంచిది
Pawan Counter to YS Jagan: అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయావు? ఇప్పుడేం చేస్తావు? జగన్‌కు పవన్ స్ట్రాంగ్ కౌంటర్
అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయావు? ఇప్పుడేం చేస్తావు? జగన్‌కు పవన్ స్ట్రాంగ్ కౌంటర్
Embed widget